- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Mann Ki Baat: అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు.
ప్రతి ఒక్కరూ నాటండి
భూమాతను రక్షించండి
ప్రధాని మోదీ పిలుపు
మూడోసారి బాధ్యతలు చేపట్టాక తొలి ‘మన్ కీ బాత్’
దిల్లీ: ‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై నమ్మకముంచి ఓట్లేసిన కోట్ల మంది ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రజలంతా ఆల్ ద బెస్ట్ చెప్పాలని కోరారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక ఆదివారం తొలిసారి నిర్వహించిన ‘మన్ కీ బాత్’లో మోదీ మాట్లాడారు.
అమ్మకు గుర్తుగా..
‘వన మహోత్సవంలో భాగంగా అమ్మ పేరుతో మొక్క నాటండి. నేనూ మా అమ్మ స్మారకార్థం ఒక మొక్క నాటాను. తల్లుల పేరుతో మొక్క నాటే కార్యక్రమం ఉద్యమంలా సాగడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. చాలా మంది తమ తల్లులను తీసుకుని వెళ్లి మొక్కలను నాటుతున్నారు. తల్లులు చనిపోయిన వారు వారి ఫొటోలను తీసుకుని వెళ్లి మొక్కలను నాటుతున్నారు. ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ ప్రచారం భూమాతను రక్షించడానికి సహాయపడుతుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రాజ్యాంగంపై విశ్వాసం
రాజ్యాంగంపై దేశ ప్రజలు అచంచల విశ్వాసం ఉంచారని, ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించి 65 కోట్ల మంది ఓటేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఓట్లేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సంఘంతోపాటు ఆ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పారు.
క్రీడాకారులకు ఛీర్స్
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న క్రీడాకారులకు ప్రధాని ఛీర్స్ చెప్పారు. ప్రజలంతా ‘ఛీర్ 4 భారత్’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ‘టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్లో మన క్రీడాకారులు ప్రతి భారతీయుడి మనసు గెలుచుకున్నారు. ఈసారి ప్రతి క్రీడాకారుడూ శక్తివంచన లేకుండా పతకాల సాధనం కోసం కష్టపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు 900 అంతర్జాతీయ పోటీల్లో మన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. త్వరలో నేను వారిని కలవబోతున్నా’ అని మోదీ పేర్కొన్నారు.
గొడుగులకు ప్రశంస
కేరళలోని అట్టప్పడిలో గిరిజన మహిళలు చేతితో తయారుచేసే కార్తుంభి గొడుగుల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘కార్తుంభి గొడుగులు మారుమూల గ్రామం నుంచి బహుళజాతి సంస్థలకు చేరుకున్నాయి. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం కావాలి’ అని మోదీ వ్యాఖ్యానించారు.
సంస్కృత వార్తలకు 50 ఏళ్లు
ఆకాశవాణిలో సంస్కృత వార్తల బులెటిన్ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ విజ్ఞానం, సైన్సులో పురాతనమైన ఈ భాష గణనీయ పాత్ర పోషించిందని చెప్పారు. సంస్కృతాన్ని గౌరవిద్దామని, దైనందిన జీవితానికి అనుసంధానించుకుందామని పిలుపునిచ్చారు.
మన సంస్కృతికి ప్రపంచవ్యాప్త కీర్తి
భారతీయ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలను సంపాదించిందని ప్రధాని మోదీ తెలిపారు. మన హిందీ కార్యక్రమం కువైట్ రేడియోలో ప్రసారం కావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
- ‘తుర్క్మెనిస్థాన్లో ప్రముఖ కవి 300వ జయంతిని గత మే నెలలో జరిపారు. ఈ సందర్భంగా ప్రపంచంలో 24 మంది ప్రసిద్ధ కవుల విగ్రహాలను ఆ దేశాధ్యక్షుడు ఏర్పాటు చేయించారు. అందులో మన విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం ఉంది’ అని మోదీ పేర్కొన్నారు.
- జూన్లో సురినామ్, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్ దేశాలు భారతీయ వారసత్వ ఉత్సవాలను నిర్వహించాయని ప్రధాని వివరించారు. ‘సురినామ్లోని భారతీయులు జూన్ 5ను ప్రవాసీ దివస్గా నిర్వహించారు. సెయింట్ విన్సెంట్లో మన జనాభా 6,000. వారంతా భారతీయ వారసత్వం పట్ల గర్విస్తుంటారు.జూన్ 1ని భారతీయ వారసత్వ దినంగా పాటిస్తుంటారు’ అని మోదీ వివరించారు.
- మన దేశ మరో ఘనత అంతర్జాతీయ యోగా దినోత్సవమని, తొలిసారిగా సౌదీ అరేబియాకు చెందిన మహిళ ఒకరు యోగాకు నేతృత్వం వహించారని ప్రధాని తెలిపారు. ఈజిప్టులో యోగాపై చిత్ర ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేశారని చెప్పారు. నైలు నదీతీరంలో లక్షల మంది యోగా చేశారని, ఎర్ర సముద్రంతోపాటు పిరమిడ్లవద్ద యోగా కార్యక్రమాలు జరిగాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీగా ఇంజినీర్ రషీద్ ప్రమాణానికి ఎన్ఐఏ అనుమతి
ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమతి ఇచ్చింది. -
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పుర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. -
స్వచ్ఛంద సంస్థల రెన్యువల్ చెల్లుబాటు గడువు పెంపు
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్యే) కింద నమోదైన అన్ని స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
భారతీయులకు మాతృభూమిపై ప్రేమ, భక్తి ఎన్నటికీ తరగవు
బయటి ప్రపంచానికి భారత్పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. -
మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష
ఇరవై మూడేళ్ల క్రితంనాటి పరువు నష్టం దావాలో ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ సోమవారం అయిదు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు. -
పార్లమెంటులో జర్నలిస్టులపై ఆంక్షలను తొలగించండి: ఎడిటర్స్ గిల్డ్
పార్లమెంటు కార్యకలాపాలను కవర్ చేసే మీడియా ప్రతినిధులపై కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షలను తొలగించాలంటూ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్లకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. -
అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి, సత్వర న్యాయం అందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఎఫ్ఐఆర్ నమోదు దశ నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు మూడేళ్లలోగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. -
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ 2024 పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు మళ్లీ నిర్వహించిన పరీక్ష ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. -
సాధారణానికి మించి ఈ నెలలో వర్షాలు: ఐఎండీ
దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. -
నిర్దేశిత విధానంలోనే ప్రమాణం చేయండి
పార్లమెంటులో ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్లో నిర్దేశించిన విధానాన్నే అనుసరించాలని లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. -
సంక్షిప్త వార్తలు
ప్రస్తుత రైల్వే టైం టేబుల్ను డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రైల్వే జోన్లు సర్క్యులర్లు జారీ చేశాయి. సవరించిన రైళ్ల రాకపోకల సమయాలను సూచించే టైం టేబుల్ను ఏటా జూన్ 30కి ముందు రైల్వే సంస్థలు విడుదల చేస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు