- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
PM Modi: మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
PM Modi: ఎన్ని అబద్ధాలు చెప్పినా విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని ప్రధాని మోదీ విమర్శించారు. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. 99 సీట్లకే కాంగ్రెస్ మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటోందన్నారు.
దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. వరుసగా మూడోసారి తాము అధికారంలోకి రావడంతో కొందరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కాంగ్రెస్కు పరోక్షంగా చురకలంటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం లోక్సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా లోక్సభ ఎన్నికల్లో విపక్షాల (Opposition)కు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని.. వారి బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘కాంగ్రెస్ (Congress) ప్రతిపక్షంలోనే కూర్చోవాలని ప్రజలు మరోసారి తీర్పునిచ్చారు. వరుసగా మూడు సార్లు ఆ పార్టీ 100 మార్క్ దాటలేదు. ఇన్నిసార్లు ఓడినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావట్లేదు. 99 సీట్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచుకుంటున్నారు. కాంగ్రెస్కు వందకు 99 సీట్లు రాలేదు. 543లో 99 వచ్చాయి. వారి స్ట్రైక్ రేట్ 26శాతం మాత్రమే. ప్రజా తీర్పును వారు ఇకనైనా గౌరవించాలి’’ మోదీ దుయ్యబట్టారు.
‘‘వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్రపతి మార్గదర్శనం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు సభ్యులు అభిప్రాయాలు చెప్పారు. సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. పదేళ్లలో అవినీతిరహిత పాలన అందించాం. అది చూసే ప్రజలు మరోసారి మాకు అవకాశమిచ్చారు. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. భారత్ ప్రథమ్ అనే మా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఏ కార్యక్రమం చేపట్టినా భారత్ ప్రథమ్ కేంద్రంగానే తీసుకుంటున్నాం. మా పథకాలన్నీ అట్టడుగు వర్గాలకు చేరాలనేదే మా విధానం’’ అని ప్రధాని (Narendra Modi) తెలిపారు.
అప్పుడు ప్రతి రోజు కుంభకోణాల వార్తలే..
‘‘దేశంలో కొన్ని దశాబ్దాల పాటు బుజ్జగింపు రాజకీయాలు కొనసాగాయి. దాంతో దేశం తీవ్రంగా నష్టపోయింది. 2014లో దేశం నిరాశ, నిస్పృహలో కూరుకుపోయింది. ప్రజలంతా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయారు. ఆ సమయంలో ప్రతి సామాన్యుడి నోట ఒకటే మాట వినబడేది.. ‘ఈ దేశంలో మార్పు రాదా?’ అని..! అప్పుడు ఏ పేపర్ చూసినా కుంభకోణాల వార్తలే కన్పించేవి. గత ప్రభుత్వాల పాలనలో రూపాయిలో యాభై పైసలు అవినీతి జరిగేది. గతంలో గ్యాస్ కనెక్షన్ల కోసం ఎంపీల చుట్టూ తిరగాల్సిన పని ఉండేది. రేషన్ బియ్యం దొరకడం కష్టంగా ఉండేది. వీటన్నిటితో ప్రజలు విసుగెత్తిపోయారు. మమ్మల్ని ఎన్నుకున్న తర్వాతే మార్పు మొదలైంది. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని ప్రధాని తెలిపారు.
రాజ్యాంగం నెత్తిన పెట్టుకుని..
‘‘2014కు ముందు దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి దేశంలో ఎక్కడపడితే అక్కడ దాడులు చేసేవారు. మేం వచ్చాకే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాం. సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని చిందులేస్తున్న వారు.. జమ్ముకశ్మీర్లో దాన్ని అమలు చేయలేక.. అంబేడ్కర్ను అవమానించారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించాకే అక్కడ శాంతిభద్రతలు మెరుగయ్యాయి. అక్కడ రాళ్ల దాడులు తగ్గాయి. గతంలో దోషులు చట్టం నుంచి తప్పించుకునేవారు. 2014 తర్వాత దోషుల ఇళ్ల వద్ద కూడా బుల్లెట్ల వర్షం కురిసింది. మేం వచ్చాకే తుప్పుపట్టిన చట్టాలను రద్దు చేశాం.’’ అని మోదీ గుర్తుచేశారు.
ప్రధాని ప్రసంగంలో ఏపీ ప్రస్తావన..
ఈ సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ‘‘లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో మా కూటమి క్వీన్ స్వీప్ చేసింది. ఒడిశాలో జగన్నాథుడి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అనేక రాష్ట్రాలు భాజపా పాలనను కోరుకుంటున్నాయి’’ అని మోదీ తెలిపారు.
విపక్షాల ఆందోళన.. స్పీకర్ సీరియస్
ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. నీట్ పేపర్ లీకేజ్, మణిపుర్ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ గట్టిగట్టిగా నినాదాలు చేశాయి. దీంతో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం సబబు కాదన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సభను తప్పుదోవ పట్టించొద్దని అన్నారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. ప్రధాని మాట్లాడుతున్నంత సేపు ‘మణిపుర్.. మణిపుర్’ అంటూ నినాదాలు చేశారు. వారి నిరసన మధ్యే ప్రధాని ప్రసంగాన్ని కొనసాగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆచూకీ లేని ‘భోలే బాబా’.. బాధితుల్లో ఆక్రోశం!
మృతదేహాలను గుర్తించేందుకు మార్చురీలకు ఓవైపు.. గాయపడిన వారి కోసం ఆసుపత్రులకు పరుగులు తీయడం మరోవైపు.. తమవారి ఆచూకీ ఇంకా దొరకలేదంటూ అధికారులను పలువురు ప్రాధేయపడుతున్న యూపీలోని దృశ్యాలు కలిచివేస్తున్నాయి. -
దేవభూమిని వణికిస్తున్న వర్షాలు.. 100 రహదారులు మూసివేత
ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. -
పవిత్రా గౌడను నా భర్త పెళ్లి చేసుకోలేదు: పోలీసులకు దర్శన్ భార్య లేఖ
Renukaswamy murder case: పవిత్రా గౌడను తన భర్త దర్శన్ పెళ్లి చేసుకోలేదని నటుడి భార్య వెల్లడించారు. ఈమేరకు బెంగళూరు పోలీసు కమిషనర్కు ఆమె ఓ లేఖ రాశారు. -
ప్రచారంలో సవాలు విసిరి.. మంత్రి పదవికి రాజీనామా చేసి..!
తాను బాధ్యత వహించిన స్థానాల్లో భాజపా ఓడిపోవడంతో రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా తన పదవికి రాజీనామా చేశారు. -
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
Bhole Baba: హాథ్రస్ తొక్కిసలాట ఘటన తర్వాత నుంచి భోలే బాబా అదృశ్యమయ్యాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
Pollution: వాయు కాలుష్యం కారణంగా భారత్లో సంభవిస్తున్న మరణాలపై నిర్వహించిన ఓ అధ్యయనాన్ని లాన్సెట్ ప్రచురింది. అందులోని కీలక విషయాలేంటో చూద్దాం. -
గజరాజులకు అదిరిపోయే డెన్
ఆ ఆరు ఏనుగులకూ అక్కడ రాజభోగాలే... ఉదయమే కాసేపు నడక, వ్యాయామం. 8:30కు అరటి పండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, చెరకు గడలు, పుచ్చకాయలతో టిఫిన్. మధ్యాహ్నం గంటన్నర సేపు జలకాలాట. -
132 సీట్లతో విమానం తరహా బస్సులు అందుబాటులోకి తెస్తాం : గడ్కరీ
కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని.. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
అనుమతి 80 వేలమందికి.. హాజరైంది 2.5 లక్షలు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 121కి చేరింది. -
గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషను అవసరం
‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. -
సంఘ విద్రోహుల చర్య ఇది.. దర్యాప్తునకు సహకరిస్తా: భోలే బాబా
యూపీలో హాథ్రస్ దుర్ఘటన జరిగిన ఒకరోజు అనంతరం దానిపై భోలే బాబా స్పందించాడు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఆ తొక్కిసలాట చోటుచేసుకుందన్నాడు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆడ్వాణీ
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.ఆడ్వాణీ (96) బుధవారం రాత్రి దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత వారం ఎయిమ్స్లో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. -
సూరజ్ పాలే భోలే బాబా!
అతడు తన చేతితో నీరు ఇస్తే సమస్యలు తీరుతాయట.. అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకినా ఆశీర్వాదం అట.. ఉత్తరప్రదేశ్కు చెందిన ‘భోలే బాబా’ను అనుసరించేవారి నమ్మిక ఇది. -
రుతుపవనాల సమయంలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రుతుపవనాల సమయంలో తీవ్రమైన తేమతో కూడిన వేడికి గురవుతున్న వారి సంఖ్య భారత్లో క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ రకమైన వాతావరణ ప్రభావానికి గురవతున్న వారి సంఖ్య 1951-2020 మధ్యకాలంలో 67 కోట్లకు చేరిందని తెలిపింది. -
కొవిడ్లో 3% అధికంగా.. బరువు తక్కువ శిశు జననాలు
భారత్లో కొవిడ్ మహమ్మారి సమయంలో బరువు తక్కువ శిశువుల జననాలు 3 శాతం అధికంగా నమోదైనట్లు ఓ అధ్యయనం పేర్కొంది. -
మణిపుర్ ప్రభుత్వాన్ని విశ్వసించలేం
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్లోని రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర సర్కారును విశ్వసించలేమంటూ జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం మండిపడింది. -
వందేభారత్ రైలులో వర్షపునీటి లీకేజీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందేభారత్ రైళ్లలోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. -
బిహార్లో ఒకే రోజు కుప్పకూలిన 3 వంతెనలు
నిర్మాణంలో ఉన్నవి..వినియోగంలో ఉన్నవి.. పాతవి అనే తేడా లేకుండా బిహార్లో వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. బుధవారం ఏకంగా మూడు వారధులు నేలమట్టమయ్యాయి. -
రాహుల్గాంధీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు
మితవాద గ్రూపులు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఝార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్!
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. -
నీట్ అక్రమాలపై శిరోముండనంతో నిరసన
‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ బుధవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్ జైలుకు పోయే సమయం ఆసన్నమైంది: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
-
రోహిత్ - కోహ్లీ బదులు వీళ్లే.. ఇంట్రెస్టింగ్గా మూడో ప్లేయర్ స్థానం?
-
రష్యాకు ప్రధాని మోదీ.. అయిదేళ్ల తర్వాత తొలిసారి
-
అనంత్ అంబానీ - రాధికా మర్చెంట్ ‘మామెరు’ ఫంక్షన్.. ఏంటీ వేడుక?
-
ఝార్ఖండ్ సీఎంగా.. ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్
-
స్టీవ్ జాబ్స్తో కలిసి పనిచేసిన ఆ రోజులు మరిచిపోలేను: ఐఫోన్ మాజీ డిజైనర్