- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Radhika SarathKumar: ప్రధాని మోదీని కలిసిన రాధిక-శరత్ కుమార్.. ఎందుకంటే..?
రాధిక- శరత్ కుమార్ (Radhika SarathKumar) దంపతులు నేడు ప్రధాని మోదీని కలిశారు. ఈ క్రమంలో వారిమధ్య తమిళనాడు రాజకీయాలపై చర్చ జరిగింది.
దిల్లీ: తమిళనాడుకు చెందిన ప్రముఖ నటులు శరత్ కుమార్, రాధిక (Radhika-Sarathkumar) దంపతులు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ (Modi)ని కలిశారు. తమ కుమార్తె, నటి వరలక్ష్మి వివాహానికి వారు ప్రధానిని ఆహ్వానించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా టికెట్పై రాధిక పోటీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సందర్భంగా వారి మధ్య తమిళ రాజకీయాలు ప్రస్తావనకొచ్చాయి.
‘‘నేను ఎన్నికల్లో చాలా బాగా పోరాడానని ప్రధాని మోదీ అన్నారు. మరింత చురుగ్గా ఉండాలని సూచించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పనిచేయడం మొదలుపెట్టాలని చెప్పారు’’ అంటూ రాధిక ఓ జాతీయ మీడియా సంస్థతో వెల్లడించారు. తమిళనాడు ప్రజల కోసం చేయగలిగినదంతా చేస్తామని తామిద్దరం మోదీకి ప్రామిస్ చేశామని శరత్కుమార్ తెలిపారు.
2006లో రాధిక (Radhika SarathKumar) రాజకీయ ప్రస్థానం మొదలైంది. తన భర్త శరత్కుమార్తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది అగ్ర నాయకత్వం వారిని తొలగించింది. 2007లో వారు ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK) పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో ఆమె సేవలు అందించారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీని భాజపా (BJP)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు కమలం పార్టీ టికెట్ దక్కింది. అయితే.. ఈ ఎన్నికలో ఆమె ఓటమి పాలయ్యారు. మాణిక్కం ఠాగూర్ను విజయం వరించింది.
ఇదిలా ఉంటే.. వరలక్ష్మి త్వరలో వివాహబంధంలో అడుగుపెట్టనున్నారు. మార్చి నెలలో ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్దేవ్తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖల ఇళ్లకు రాధిక-శరత్కుమార్, వరలక్ష్మి స్వయంగా వెళ్లి పెళ్లి పత్రికలు అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీబీఐ జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్.. అనుమతించిన కోర్టు
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ను 14 రోజుల పాటు సీబీఐ జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. -
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్
BJP: గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో టెంట్ కూలిన ఘటనపై భాజపా స్పందిస్తూ కాంగ్రెస్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. దీనికి నెహ్రూను నిందించొద్దంటూ కౌంటర్ పోస్ట్ చేసింది. -
ఏఐ వాయిస్తో లేడీ మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ
ఏఐ సాంకేతికత ద్వారా ఫోన్లో పురుషుడిలా వాయిస్ మార్చి పొరుగింటి యువతిని మోసం చేసింది ఓ మహిళ. బాధితురాలి నుంచి రూ.6 లక్షలకు పైగా కాజేసింది. -
ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ మమ్మల్ని జైల్లో వేయించారేగానీ..: లాలూ ప్రసాద్ యాదవ్
గత కొద్దిరోజులుగా దేశ రాజకీయ నేతల నోట ఎమర్జెన్సీ పదం విరివిగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. -
కాలుకు గాయం.. బాలుడి మర్మావయవాలకు సర్జరీ!
ఠాణెలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాలుడి కాలుకు బదులు అతడి మర్మావయవాలకు శస్త్రచికిత్స నిర్వహించారు. -
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం
Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. పార్టీ సమావేశంలో దీనిపై కీలక తీర్మానం చేశారు. -
‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్ పవార్
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నాడు దేశంలో విధించిన ‘ఎమర్జెన్సీ’పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. -
మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్ వైరల్
తాగుడుకు బానిసైన (drinking habit) తమ భర్తలతో ఆ వ్యసనాన్ని మాన్పించేందుకు భార్యలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తాగుడును ఇలా మాన్పించాలంటూ ఓ మంత్రి చేసిన సూచన వైరల్గా మారింది. -
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్ల మృతి
Ladakh: లద్దాఖ్లో జరిగిన సైనిక విన్యాసాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. -
విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ నియామకం
ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు. -
నీట్పై చర్చకు విపక్షాల పట్టు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది. -
హేమంత్ సోరెన్ దోషి అని నమ్మడానికి ఆధారాల్లేవు
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు భారీ ఊరట లభించింది. -
నీట్-యూజీ పేపర్ లీకు కేసు.. ఝార్ఖండ్లో ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ అరెస్టు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకు కేసుకు సంబంధించి ఝార్ఖండ్లోని హజారీబాగ్లో ఓ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. -
పనితీరు బాగోకపోతే ముందస్తుగా పదవీ విరమణ
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలూ తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతి నెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) స్పష్టం చేసింది. -
పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ కొత్త తేదీల ప్రకటన
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది. -
కొత్త నేర న్యాయచట్టాలపై 1న పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు
కొత్త నేర న్యాయచట్టాలు అమల్లోకి వచ్చే జులై ఒకటిన దేశవ్యాప్తంగా ఉన్న 17,500 పోలీస్ స్టేషన్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాయి. -
మీడియాలో వాణిజ్య ప్రకటనలకు ‘స్వీయ ధ్రువీకరణ’ అప్పుడే వద్దు
ప్రజలను మోసం చేసే, తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలను నిరోధించే లక్ష్యంతో సుప్రీంకోర్టు సూచన మేరకు అమలులోకి తెచ్చిన ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ సమర్పించే నిబంధనను ప్రస్తుతానికి మెడికల్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ విజ్ఞప్తి చేశారు. -
విమానం మరుగుదొడ్డిలో పొగతాగిన వ్యక్తి అరెస్టు
దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబయికి వెళుతున్న ఇండిగో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. -
పరీక్షల విధానంలో సంస్కరణలు.. సలహాల కోసం వెబ్సైట్ ప్రారంభం
నీట్ యూజీ , యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ప్రాథమిక గణిత ప్రశ్నలపై 80% మంది ఉపాధ్యాయుల్లో తడబాటు
భారత్తోపాటు మధ్య ప్రాచ్య దేశాల్లోని గణిత ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది నిష్పత్తి, అనుపాత తార్కికం, బీజ గణితం, ఎస్టిమేషన్, లాజికల్ రీజనింగ్ వంటి ప్రాథమిక భావనల్లో తడబడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
దేశానికి సంబంధించిన ఏ విషయంపైనా ప్రజాశ్రేయస్సు కోణంలో చర్చ జరగడం లేదు. హిందూ-ముస్లిం, రిజర్వేషన్లకు మద్దతు-వ్యతిరేకం, నాకు నచ్చిన పార్టీ-ప్రత్యర్థి పార్టీ.. ఇలా మన దృష్టికోణం విభజనవాదంతో నిండిపోయింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
-
వైవీయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం
-
సీబీఐ జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్.. అనుమతించిన కోర్టు
-
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
-
భారత బ్యాటర్లు షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప
-
వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్ యాప్’ మాయలో సివిల్స్ అభ్యర్థి