- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Darshan: పవిత్రా గౌడను నా భర్త పెళ్లి చేసుకోలేదు: పోలీసులకు దర్శన్ భార్య లేఖ
Renukaswamy murder case: పవిత్రా గౌడను తన భర్త దర్శన్ పెళ్లి చేసుకోలేదని నటుడి భార్య వెల్లడించారు. ఈమేరకు బెంగళూరు పోలీసు కమిషనర్కు ఆమె ఓ లేఖ రాశారు.
బెంగళూరు: తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు (Renukaswamy murder case)లో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్, అతడి స్నేహితురాలు పవిత్రా గౌడ (Pavithra Gowda) ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, విచారణ క్రమంలో పోలీసులు వీరిద్దరినీ దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ (Darshan) భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమె నటుడి భార్య కాదంటూ బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానందకు తాజాగా లేఖ రాశారు.
‘‘ఇటీవల మీడియా సమావేశంలో పవిత్ర.. దర్శన్ భార్య అంటూ మీరు తప్పుగా ప్రకటన చేశారు. ఆ తర్వాత కర్ణాటక హోంమంత్రి కూడా ఇదే మాట అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ నటుడి దంపతులు అరెస్టయ్యారని ఆ మంత్రి చెప్పారు. ఆమె దర్శన్ భార్య కాదు. కేవలం నా భర్తకు స్నేహితురాలు మాత్రమే. దర్శన్కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేను ఒక్కదాన్ని మాత్రమే. 2003లో మా పెళ్లి జరిగింది. పోలీసు రికార్డుల్లోనూ మీరు ఆమె పేరును దర్శన్ సతీమణిగా పేర్కొనవద్దు. అది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. పవిత్రకు సంజయ్సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి’’ అని విజయలక్ష్మి (Actor Darshan's Wife) తన లేఖలో అభ్యర్థించారు.
విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ దర్శన్ కొంతకాలంగా కన్నడ నటి పవిత్రతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తమ బంధానికి పదేళ్లు అంటూ ఇటీవల నటి ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో వీరి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని బాధపడిన దర్శన్ అభిమాని రేణుకాస్వామి.. పవిత్రకు అశ్లీల సందేశాలు, అసభ్య హెచ్చరికలు చేశాడని పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ సందేశాల గురించి దర్శన్కు చెప్పడంతో అతడు ఆగ్రహానికి గురై, రేణుకాస్వామిపై దాడి చేశాడని పవిత్ర విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా కస్టడీలో ఉన్నారు.
దర్శన్, పవిత్ర గౌడకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ సహా పలువురు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్వర్వులు ఇచ్చింది. జులై 18వరకు కస్టడీని పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో దర్శన్, పవిత్రతో పాటు మొత్తం 17 మంది నిందితులను పోలీసులు బెంగళూరు, తుమకూరు జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. జులై 18వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆయన వ్యాఖ్యలతో నా హృదయం బరువెక్కింది: జగదీప్ ధన్ఖడ్
నూతన నేర చట్టాలను రూపొందించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మీ తరఫున గళమెత్తుతా’.. బాధితులకు రాహుల్ హామీ
గుజరాత్లో కొన్నేళ్లలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. -
నా భర్త రాజకీయ కుట్రలో ఇరుక్కున్నారు: సునీత కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ శనివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. -
కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. 15 మందికి గాయాలు!
గుజరాత్లోని సూరత్లో ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. -
హాథ్రస్ ఘటన.. భోలేబాబాపై తొలికేసు
హాథ్రస్ తొక్కిసలాట (Hathras stampede)కు కారణమైన భోలేబాబాపై తొలికేసు నమోదైంది. అలాగే ఆయన ముఖ్యసేవాదర్ ఇటీవల పలువురు రాజకీయ నేతలను సంప్రదించినట్లు వెల్లడైంది. -
ఆమెది ప్రేమ.. అతడిది త్యాగం: వీరుడి భార్య కన్నీటి ప్రేమ కథా దృశ్యం..!
అమితమైన ప్రేమ, అంతులేని బాధ, వెలకట్టలేని త్యాగం.. కలగలిపి ఈ దృశ్యం. దీని వెనుక కన్నీటి కథ తెలిస్తే ప్రతి హృదయం ద్రవిస్తుంది. -
అగ్నివీరుల వయోపరిమితిని పెంచాలి: ఆర్మీ
అగ్నిపథ్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న అగ్నివీరుల వయోపరిమితి, సర్వీస్ పొడిగింపుపై ఆర్మీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నట్లుగా సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు. -
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది
పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ఒక విద్యాసంస్థకు చెందిన ప్రిన్సిపల్ను బయటకు పంపినతీరు విమర్శలకు దారితీసింది. -
అనంత్- రాధిక సంగీత్లో టీ20 హీరోలకు గ్రాండ్ వెల్కమ్
Anant - Radhika: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో టీ20 ప్రపంచకప్ హీరోలకు అరుదైన గౌరవం లభించింది. -
అస్సాం అతలాకుతలం.. ఉప్పొంగుతున్న నదులు
వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు దీని కారణంగా 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. -
ఉత్తరాఖండ్లో కొండచరియల బీభత్సం.. ఇద్దరు హైదరాబాదీల మృతి
Landslides: ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతిచెందారు. వారు వెళ్తున్న బైక్పై కొండచరియలు విరిగిపడ్డాయి. -
కేరళలో ‘మెదడును తినే అమీబా’.. మరో కేసు నమోదు
‘మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్)’ అరుదైన వ్యాధి కేరళ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కాగా తాజాగా మరో కేసు నమోదైంది. -
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా..
NEET UG counselling: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా పడింది. -
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ సంగీత్ వేడుక అట్టహాసంగా జరిగింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. -
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
Hathras stampede: కొద్దిరోజుల క్రితం హాథ్రస్లో జరిగిన సత్సంగ్ తీవ్ర విషాదం నింపింది. దీనిపై తాజాగా ‘భోలేబాబా’(Bhole Baba) మీడియాతో మాట్లాడారు. -
మహువాపై ఎఫ్ఐఆర్కు ఎన్సీడబ్ల్యూ ఆదేశం
జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖాశర్మపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు!
వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి.. అల్ప, మధ్యాదాయ దేశా (ఎల్ఎంఐసీ)ల్లోని చిన్నారుల పాలిట శాపమవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. -
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామనీ, పెండింగు కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సూచించారు. -
వంతెనలు కూలిన ఘటనలో..16 మంది ఇంజినీర్లపై వేటు వేసిన బిహార్
బిహార్లో వరుస వంతెనలు కూలిపోతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు.