- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
PM Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
PM Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో ఛైర్మన్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిల్లీ: ప్రతిపక్షాలు తమ ప్రవర్తనతో రాజ్యసభను అవమానపర్చాయని ప్రధాని మోదీ (PM Modi) దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ నేడు రాజ్యసభ (Rajya Sabha)లో సమాధానమిచ్చారు. అయితే, ఆయన మాట్లాడుతుండగా.. విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాయి. దీనిపై ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారంటూ ఛైర్మన్ దుయ్యబట్టారు.
మర్యాదను విడిచి వెళ్లారు: ఛైర్మన్ ఆగ్రహం
ప్రధాని మోదీ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. వారి ఆందోళన నడుమే మోదీ ప్రసంగం కొనసాగించగా.. ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు (Opposition Walkout). దీంతో మోదీ ప్రసంగాన్ని నిలిపివేశారు. ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ మాట్లాడుతూ.. ‘‘విపక్ష నేతలు సభను కాదు.. మర్యాదను విడిచి వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు. సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నాం. కానీ, వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారు. రాజ్యాంగంపై హేళనగా ప్రవర్తించడం సమంజసం కాదు. రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదు. జీవితానికి మార్గదర్శకం’’ అని విపక్షాలపై మండిపడ్డారు. అనంతరం మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అవును.. మాది మూడోవంతు ప్రభుత్వమే: మోదీ
ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress) పార్టీపై ప్రధాని మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘దాదాపు 60 ఏళ్ల తర్వాత దేశంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. ఇది సాధారణ విషయం కాదు. పదేళ్లుగా సేవాభావంతో ఎన్డీయే ముందుకెళ్తోంది. మా పాలనను ప్రజలు మరోసారి సమర్థించారు. దేశానికి సేవ చేసే వారినే ప్రజలు ఆశీర్వదించారు. మాపై వారు చూపిన విశ్వాసానికి గర్వంగా ఉంది. ఓటర్లు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి.. విభజన ఎజెండాను ఓడించారు. ఈ పరిణామాలతో కొందరు (కాంగ్రెస్) అసంతృప్తిగా ఉన్నారు. దేశ ప్రజల నిర్ణయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఓ కాంగ్రెస్ నేత పదే పదే మమ్మల్ని ‘మూడో వంతు ప్రభుత్వం’ అని విమర్శిస్తున్నారు. అది నిజమే.. మేం పాలనలో పదేళ్లు పూర్తి చేసుకున్నాం. మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటాం. మూడో వంతు ముగిసింది. ఇంకా రెండు వంతులు మిగిలి ఉంది’’ అని మోదీ (Narendra Modi) కాంగ్రెస్ను దుయ్యబట్టారు. విపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచేదంటూ సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు.
రాజ్యాంగం (Constitution)పై దాడి చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను ప్రధాని తిప్పికొట్టారు. ‘‘రాజ్యాంగం అంటే కేవలం ఆర్టికల్స్ను అనుసరించడం మాత్రమే కాదు. అది లైట్హౌస్లా మనకు మార్గనిర్దేశం చేస్తుంది. రాజ్యాంగ భావనను విద్యార్థులకు చేరవేస్తున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలి’’ అని మోదీ వివరించారు. ఆర్థిక వృద్ధిలో భారత్ను పది నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చామని.. రానున్న ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానానికి చేరుస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిహార్లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. -
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తనపై చేస్తోన్న ఆరోపణలకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. -
‘సింగింగ్’ చాయ్వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
ఒక చేతిలో చాయ్ కలిపే గరిటె.. మరో చేతిలో మైక్తో కనిపిస్తున్న ఓ చాయ్వాలా.. వినియోగదారులకు టీ రుచి చూపిస్తూనే.. గాన మాధుర్యంతో అలరిస్తున్నారు. -
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
భోలే బాబా (Bhole Baba) అద్భుతాలు చేయగలిగితే.. తన సత్సంగ్ కార్యక్రమానికి వచ్చిన మృతులను ఎందుకు బతికించలేదని హాథ్రస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. -
ఎంపీలుగా ప్రమాణం చేసిన అమృత్పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్
వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్, ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. -
ఆ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు - ఎన్బీఈ హెచ్చరిక
‘ఎఫ్ఎంజీఈ’ అర్హత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని అందజేస్తామని సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. -
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
Sudha Murty: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గత 30 ఏళ్లలో ఒక్క చీరను కూడా కొనలేదట. అందుకు కారణమేంటో ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్ ఘటనపై సిట్ చీఫ్
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు.. నిర్వాహకులదే తప్పిదమని సూచిస్తున్నాయని దర్యాప్తు అధికారి తెలిపారు. -
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధతమైనది కాదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. -
ఆప్ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా సంజయ్ సింగ్
ఆమ్ఆద్మీ పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా ఆప్ సంజయ్ సింగ్ను నియమించింది. -
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూకశ్మీర్ ఎన్నికలు నిర్వహించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. -
అందుకే బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం
బిహార్ (Bihar)లో వరుసగా బ్రిడ్జ్లు కూలిపోవడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి వెల్లడించారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ ఆశ్చర్యపరుస్తోంది. -
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
Hathras Stampede: భోలే బాబా నిర్వహించిన సత్సంగ్కు హాజరై అనంతరం తొక్కిసలాటలో మరణించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
Hathras Stampede: యూపీలో హాథ్రస్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన బాధితులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. -
రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. -
బ్రహ్మపుత్రి
వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియామారి చార్! -
కుటుంబాన్ని కలవవచ్చు.. దిల్లీ వదిలి వెళ్లకూడదు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. -
రోజువారీ మరణాల్లో 7శాతం వాయు కాలుష్యం వల్లే
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. -
మా అబ్బాయి పెళ్లికి రండి.. సోనియా కుటుంబాన్ని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దిల్లీలోని ఆమె 10 జన్పథ్ నివాసంలో గురువారం కలిశారు. -
నీట్-యూజీని రద్దు చేయొద్దు
పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆసుపత్రి నుంచి ఆడ్వాణీ డిశ్చార్జ్
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం.. త్వరలో నూతన ఐటీ పాలసీ: మంత్రి లోకేశ్
-
బిహార్లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
-
‘సింగింగ్’ చాయ్వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు