- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET Row: నీట్పై చర్చకు విపక్షాల పట్టు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది.
దద్దరిల్లిన ఉభయసభలు
దిల్లీ : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి, నీట్పై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. స్పీకర్ అందుకు అంగీకరించకపోవటంతో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం నెలకొనటంతో సభను మధ్యాహ్నం వరకు ఓసారి, ఆ తర్వాత సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
వెనక్కి తగ్గని ప్రతిపక్షాలు
నీట్ పరీక్ష లక్షల మంది విద్యార్థులకు సంబంధించినదని, దానిపై చర్చకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ను కోరారు. లోక్సభ సమావేశం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలు నిలిపి నీట్పై చర్చించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే ఎంపీలు వెల్లోకి చొచ్చుకెళ్లారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈ అంశాన్ని లేవనెత్తవచ్చని, తగినంత సమయం కూడా ఇస్తామని స్పీకర్, పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపినా, ప్రతిపక్ష సభ్యులు వినలేదు. నినాదాలు చేస్తూ ఎంతకీ శాంతించకపోవడంతో స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు ఆ తర్వాత సోమవారానికి వాయిదా వేశారు. మరోపక్క గందరగోళ పరిస్థితుల్లోనే టీఎంసీ సభ్యుడు ఎస్.కె.నురల్ ఇస్లాం లోక్సభ సభ్యుడిగా శుక్రవారం ప్రమాణం చేశారు.
ప్రభుత్వానిది సరైన నిర్ణయం: దేవేగౌడ
నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించడం సరైన నిర్ణయమని జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ శుక్రవారం రాజ్యసభలో పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తికాకుండా ప్రభుత్వం బాధ్యులను తేల్చలేదని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు సభ నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
చర్చకు సిద్ధం : ధర్మేంద్ర ప్రధాన్
నీట్పై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు. అయితే అది సంప్రదాయం, పద్ధతి ప్రకారం సాగాలని పేర్కొన్నారు. లోక్సభ వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులను అయోమయానికి గురిచేయొద్దని ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
చర్చ జరగాల్సిందే: రాహుల్
అంతకుముందు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నీట్ పేపర్ లీక్ సమస్య.. దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశం. దానిపై సభలో అర్థవంతమైన, గౌరవప్రదమైన చర్చను ప్రధాని మోదీ చేపట్టాలి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తోందనే సందేశాన్ని పార్లమెంట్ ఇవ్వాలి’’ అని అన్నారు.
రాజ్యసభలోనూ వాయిదాల పర్వం
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించడం వల్ల రాజ్యసభ కార్యకలాపాలు కూడా వాయిదా పడ్డాయి. నీట్ సమస్యపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదించలేదు. చర్చ డిమాండ్ను ఆమోదించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరినా ఛైర్మన్ అంగీకరించలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష సభ్యులు తిరిగి తమ స్థానాల్లో కూర్చోవాలని ఛైర్మన్ కోరినా వారు నిరాకరించారు. సీనియర్ నేత ఖర్గే కూడా వెల్లోకి చొచ్చుకు రావడంపై ధన్ఖడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల నడుమ కొంతసేపు ఛైర్మన్ సభను నడిపించారు. అయినప్పటికీ వారు తగ్గకపోవడంతో సభను పలుమార్లు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. చివరకు వారు వాకౌట్ చేయడంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను కొనసాగించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవీ నేతాం కళ్లుతిరిగి పడిపోయారు. ఆసుపత్రిలో చేరిన ఆమె కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారని ధన్ఖడ్ సభకు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)(Bharatiya Nyay Sanhita) కింద తొలి కేసు నమోదు అయింది. దిల్లీలో ఓ వీధి వ్యాపారిపై పోలీసులు ఈ కేసు పెట్టారు. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
-
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?