nitin gadkari: రోడ్లు బాగా లేకుంటే టోల్‌ వసూలు చేయొద్దు

రహదారులు నాణ్యంగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్‌ వసూలు చేయొద్దని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఉపగ్రహ ఆధారిత టోల్‌ వసూలుకు సంబంధించిన గ్లోబల్‌ వర్క్‌షాపులో బుధవారం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 27 Jun 2024 06:32 IST

కేంద్ర మంత్రి గడ్కరీ

దిల్లీ: రహదారులు నాణ్యంగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్‌ వసూలు చేయొద్దని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఉపగ్రహ ఆధారిత టోల్‌ వసూలుకు సంబంధించిన గ్లోబల్‌ వర్క్‌షాపులో బుధవారం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు నాణ్యమైన సేవలు అందించకుంటే, టోల్‌ వసూలు చేయొద్దు. మనం టోల్‌ వసూలుమీద చాలా ఆత్రుతతో ఉన్నాం. కానీ నాణ్యమైన రోడ్లు ఉన్నచోటే ఫీజులు వసూలు చేయాలి. గుంతలూ, మట్టితో ఉండే అధ్వానమైన రోడ్లకు టోల్‌ వసూలు చేస్తామంటే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది’ అని గడ్కరీ హెచ్చరించారు. ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ).. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి తొలిగా 5వేల కి.మీ పరిధిలో జీఎన్‌ఎస్‌ఎస్‌(గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌) ఆధారిత ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు పద్ధతిని ప్రవేశపెట్టాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ పరిధిలోనే ఇది పనిచేస్తుంది. మొదట్లో దీన్ని హైబ్రిడ్‌ విధానం (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌-ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఆధారిత)లో అమలు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు