- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET UG 2024 Row: నీట్ పేపర్ లీక్ నిజమే
దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్-యూజీ ప్రవేశ పరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పరీక్షకు ముందు రోజు రాత్రే బయటకు..
అంగీకరించిన విద్యార్థులు
నీట్లో అవకతవకలపై దిల్లీలోని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను నిలువరిస్తున్న పోలీసులు
దిల్లీ: దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్-యూజీ ప్రవేశ పరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ప్రశ్న పత్రం లీకేజీ నిజమేనని తేలింది. ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బిహార్లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు లీక్కు కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నిందితుడే అంగీకరించాడు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ 14 మందిని అరెస్టు చేశారు. వారిలో అనురాగ్ యాదవ్, నీతీశ్ కుమార్, అమిత్ ఆనంద్లతోపాటు దాణాపుర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న సికందర్ యాదవేందు అనే జూనియర్ ఇంజినీరు ఉన్నాడు. పట్నాలోని శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారిస్తున్నారు. లీకేజీకి సూత్రధారి అమిత్ ఆనంద్ అని తేలింది. అతడు యాదవేందుతో కలిసి పేపరును బయటకు తీసుకొచ్చారు. యాదవేందు అనే నిందితుడు అనురాగ్ యాదవ్ అనే విద్యార్థికి మామయ్య అవుతాడు.
విద్యార్థి ఏం చెప్పాడంటే..
‘‘రాజస్థాన్లోని కోటాలో నీట్కు సిద్ధమవుతున్న నాకు మామయ్య ఫోన్ చేశాడు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, బిహార్ సమస్తీపుర్లోని ఇంటికి రమ్మని పిలిచాడు. నీట్ పరీక్ష (మే 5) తేదీకి ఒక రోజు ముందు అంటే మే 4న రాత్రి నా స్నేహితులను తీసుకుని నేను మామయ్య వద్దకు వెళ్లాను. అతడు అమిత్ ఆనంద్, నీతీశ్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ నాకు నీట్ ప్రశ్నపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారు. రాత్రంతా వాటిని మేం బట్టీ పట్టాం. మరుసటి రోజు పరీక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే.. ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్తో పూర్తిగా సరిపోలింది’’ అని 22 ఏళ్ల అనురాగ్ పోలీసులకు వివరించాడు.
యాదవేందు చెప్పిందిదీ..
‘పరీక్షకు ముందు అమిత్ ఆనంద్, నీతీశ్ కుమార్ పేపరు లీకేజీ గురించి నాకు చెప్పారు. అది రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలకు దొరుకుతుందని తెలిపారు. దీంతో నేను ఆయుష్ కుమార్, అనురాగ్ యాదవ్, శివానంద్ కుమార్, అభిషేక్ కుమార్ అనే విద్యార్థులను తీసుకుని వాళ్ల వద్దకు వెళ్లా. నేను విద్యార్థుల నుంచి రూ.40లక్షలు డిమాండు చేశా’ అని యాదవేందు పోలీసులకు తెలిపాడు.
హైకోర్టుల్లో విచారణపై సుప్రీం స్టే
నీట్ పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ వ్యవహారంపై పలు హైకోర్టుల్లో విచారణలపై స్టే ఇచ్చింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్టీఏ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో నీట్ యూజీ-2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
లీకేజీపై విచారణ జరుపుతున్న బిహార్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఏడీజీ నయ్యర్ హస్నైన్ను కేంద్ర హోంశాఖ దిల్లీకి పిలిపించింది. విచారణపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. యూజీసీ నెట్ రద్దు, నీట్ ప్రశ్నప్రతం లీకేజీపై దేశవ్యాప్తంగా గురువారం విద్యార్థులు భగ్గుమన్నారు. దిల్లీలోని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు విద్యార్థి నేతలు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితులు ఏమన్నారంటే..
‘యాదవేందు అరెస్టయ్యాక అతడు మా పేర్లు చెప్పాడు. దీంతో విద్యార్థులకు ప్రశ్నపత్రం అందజేసిన ప్రాంతంలో పోలీసులు సోదాలు జరిపారు. అక్కడే తగులబెట్టిన ప్రశ్నపత్రం ముక్కలు వారికి దొరికాయి’ అని అమిత్ ఆనంద్, నీతీశ్ కుమార్ వెల్లడించారు.
తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించం: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ పరీక్షలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకే పరిమితమని, ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదని తెలిపారు. నీట్ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలో అవకతవకలపై బిహార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని వెల్లడించారు. అవసరమైతే ఎన్టీఏ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించబోమని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి