- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET Row: నీట్ కేసులో సీబీఐ దూకుడు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. గురువారం బిహార్లోని పట్నాలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. సీబీఐ అధికారుల వివరాల ప్రకారం..
పట్నాలో ఇద్దరి అరెస్టు
గోధ్రాలోనూ వాంగ్మూలాల నమోదు
ఓఎంఆర్ షీట్లపై సుప్రీంకోర్టులో పిటిషన్
దిల్లీ: నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. గురువారం బిహార్లోని పట్నాలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. సీబీఐ అధికారుల వివరాల ప్రకారం.. నిందితుల్లోని అశుతోష్ కుమార్ పట్నాలో ఓ హాస్టల్ను అద్దెకు తీసుకున్నారు. ఆ హాస్టల్లోనే బిహార్ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి సగం కాలిన నీట్ యూజీ ప్రశ్నపత్రాలు దొరికాయి. అక్కడే కొంత మంది నీట్ అభ్యర్థులకు ప్రశ్నపత్రం ముందుగా నిందితులు అందించారు. మరో నిందితుడు మనీశ్ కుమార్.. ప్రశ్నపత్రం కోసం కొంత మంది నీట్ అభ్యర్థులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. తర్వాత వారిని పరీక్షకు ముందు రోజు హాస్టల్కు తీసుకువచ్చి ప్రశ్నపత్రం, సమాధానాల కీ ఇచ్చాడు. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్కు సంబంధించి సీబీఐ మొత్తం ఆరు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. అరెస్టు చేసిన ఇద్దరిని సీబీఐ పట్నాలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్లోని గోధ్రాలోనూ సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ప్రశ్నపత్రం కోసం డబ్బులిచ్చిన ముగ్గురు విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వారి తల్లిదండ్రులను ప్రశ్నించారు. నీట్ యూజీకి పరీక్ష కేంద్రంగా నిలిచిన జై జలారామ్ పాఠశాల యజమాని దీక్షిత్ పటేల్నూ విచారించారు.
ఎన్టీఏకు సుప్రీం నోటీసులు
నీట్-యూజీ-2024 ఓఎంఆర్ షీట్ల విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పరీక్షకు హాజరైన కొందరు విద్యార్థులకు ఓఎంఆర్ షీట్లు అందలేదని ఓ కోచింగ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ మనోజ్ మిశ్ర, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్ ధర్మాసనం విచారణ జరిపింది. ఓఎంఆర్ షీట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి నిర్ణీత కాలవ్యవధి ఏమైనా ఉంటుందా.. అని ఎన్టీఏను ప్రశ్నించింది. సమాధానం చెప్పడానికి గడువు కావాలని ఎన్టీఏ తరఫు న్యాయవాది కోరడంతో నీట్ యూజీపై దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి వచ్చే నెల 8న విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు కోచింగ్ సంస్థ పిటిషన్ దాఖలు చేయడాన్ని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ‘‘ఇది కోచింగ్ సెంటర్ల వైపు నుంచి వచ్చిన 32వ పిటిషన్. ఇందులో మీ ప్రాథమిక హక్కులకు ఏం ఉల్లంఘన జరిగింది..? ఈ అంశంలో కోచింగ్ సెంటర్ల పాత్ర కనిపించడం లేదు. కేంద్రం ఏం చేస్తుందో చూడాల్సిన పని వారికి లేదు. ఆ పని కేంద్రం చూసుకుంటుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు నీట్ యూజీలో సిలబస్లో లేని ప్రశ్నలు అడిగారంటూ ఓ విద్యార్థి వేసిన పిటిషన్పై దిల్లీ హైకోర్టు కూడా ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది.
ఎన్టీఏ కేంద్ర కార్యాలయంలో ఉద్రిక్తత
యూజీసీ నెట్, నీట్ యూజీ పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలకు నిరసనగా గురువారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ)కు చెందిన కార్యకర్తలు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కేంద్ర కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అక్కడ తలుపులకు తాళం వేశారు. ఎన్టీఏను మూసివేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కార్యాలయంవైపు పరిగెడుతున్న ఆందోళనకారుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఎన్టీఏకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు రెండో రోజైన గురువారమూ కొనసాగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM