- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET Row: నీట్ కేసు.. గుజరాత్లో ఏడుచోట్ల సీబీఐ సోదాలు
వైద్యవిద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష’ (నీట్-యూజీ) అక్రమాలకు సంబంధించి గుజరాత్లో ఏడుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం సోదాలు నిర్వహించింది.
దిల్లీ: వైద్యవిద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష’ (నీట్-యూజీ) అక్రమాలకు సంబంధించి గుజరాత్లో ఏడుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం సోదాలు నిర్వహించింది. జమాలుద్దీన్ అన్సారీ అనే హిందీ పాత్రికేయుడిని ఝార్ఖండ్లో అరెస్ట్ చేసింది. ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న హజారీబాగ్ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్లకు సాయపడేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ ఆయనపై ఉంది. గుజరాత్, రాజస్థాన్, బిహార్, దిల్లీ, ఝార్ఖండ్లకు విస్తరించిన విస్తృత కుట్రపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. గోధ్రాలో నీట్-యూజీ పరీక్ష అవకతవకల్లో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఒక పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు, ఇద్దరు దళారులను నాలుగు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఆదేశాలిచ్చింది. అసలైన కుట్రదారుల్ని పట్టుకునేందుకు వీరిని విచారించాల్సి ఉందని సీబీఐ తెలిపిన మీదట న్యాయస్థానం అంగీకరించింది.
పరీక్ష కేంద్రం గోధ్రా.. భాష గుజరాతీ
గోధ్రా, ఖేడాల్లో పరీక్ష కేంద్రాలుగా ‘జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ’ (ఎన్టీయే) ఎంచుకున్నవి ఒకే పాఠశాల యాజమాన్యంలో ఉన్నాయని సీబీఐ దర్యాప్తులో బయటపడింది. ఒడిశా, బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్లలో తమకు కావాల్సిన అభ్యర్థుల చేత పరీక్ష కేంద్రంగా గోధ్రాను, భాషగా గుజరాతీని నిందితులు ఎంపిక చేయించారని తెలుస్తోంది.
రెండ్రోజుల్లో పీజీ పరీక్ష తేదీ ప్రకటిస్తాం
నీట్-యూజీ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ముందుజాగ్రత్తగా వాయిదా వేసిన నీట్ పీజీ పరీక్షను ఎప్పుడు నిర్వహించేదీ జాతీయ పరీక్షల మండలి రెండ్రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం పంచ్కులలో విలేకరులకు తెలిపారు. నీట్పై పార్లమెంటులో చర్చ నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పుర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. -
ఎంపీగా ఇంజినీర్ రషీద్ ప్రమాణానికి ఎన్ఐఏ అనుమతి
ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమతి ఇచ్చింది. -
స్వచ్ఛంద సంస్థల రెన్యువల్ చెల్లుబాటు గడువు పెంపు
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్యే) కింద నమోదైన అన్ని స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
భారతీయులకు మాతృభూమిపై ప్రేమ, భక్తి ఎన్నటికీ తరగవు
బయటి ప్రపంచానికి భారత్పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. -
మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష
ఇరవై మూడేళ్ల క్రితంనాటి పరువు నష్టం దావాలో ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ సోమవారం అయిదు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు. -
పార్లమెంటులో జర్నలిస్టులపై ఆంక్షలను తొలగించండి: ఎడిటర్స్ గిల్డ్
పార్లమెంటు కార్యకలాపాలను కవర్ చేసే మీడియా ప్రతినిధులపై కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షలను తొలగించాలంటూ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్లకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. -
అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి, సత్వర న్యాయం అందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఎఫ్ఐఆర్ నమోదు దశ నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు మూడేళ్లలోగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. -
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ 2024 పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు మళ్లీ నిర్వహించిన పరీక్ష ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. -
సాధారణానికి మించి ఈ నెలలో వర్షాలు: ఐఎండీ
దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. -
నిర్దేశిత విధానంలోనే ప్రమాణం చేయండి
పార్లమెంటులో ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్లో నిర్దేశించిన విధానాన్నే అనుసరించాలని లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. -
సంక్షిప్త వార్తలు
ప్రస్తుత రైల్వే టైం టేబుల్ను డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రైల్వే జోన్లు సర్క్యులర్లు జారీ చేశాయి. సవరించిన రైళ్ల రాకపోకల సమయాలను సూచించే టైం టేబుల్ను ఏటా జూన్ 30కి ముందు రైల్వే సంస్థలు విడుదల చేస్తుంటాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు