- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NEET Paper Leak: నీట్ పరీక్షల్లో ‘మున్నాభాయ్’లు.. వెలుగులోకి కళ్లుబైర్లుకమ్మే వాస్తవాలు..!
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సాల్వర్ గ్యాంగ్ చాలా చురుగ్గా వ్యవహరించింది. ఈ గ్యాంగ్ గతంలో దొంగ అభ్యర్థులతో కూడా పరీక్షలు రాయించినట్లు గుర్తించారు.
ఇంటర్నెట్డెస్క్: మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రం గుర్తుందా..? అందులో ఒకరికి బదులు మరో వ్యక్తి మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష రాసి ర్యాంక్ సాధిస్తాడు. కొన్నేళ్లుగా నీట్ పరీక్షల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పేపర్ లీక్లో ‘సాల్వర్ గ్యాంగ్’ హస్తం ఉన్నట్లు బయటపడటంతో బిహార్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో ఈ గ్యాంగ్ కీలక సభ్యుడు రవి అత్రి హస్తం ఉన్నట్లు బలంగా విశ్వసిస్తున్నారు. అతడి కనుసన్నల్లోనే నీట్ పేపర్ లీకైనట్లు (NEET Paper Leak) భావిస్తున్నారు.
ఈ గ్యాంగ్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది..?
నీట్ పేపర్ లీక్ వెనక ఈ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠా ప్రశ్నపత్రాన్ని ముందుగానే చేజిక్కించుకోవడం.. దానికి సమాధానాలు తయారు చేసి.. వాటిని సోషల్ మీడియా ద్వారా కొనుగోలుదార్లకు పంపడంలో అందెవేసిన చెయ్యి. గతంలో కూడా వేర్వేరు రాష్ట్రాల్లోని పలు పరీక్ష పత్రాలను లీక్ చేసిన కేసుల్లో రవి అత్రి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతడికి ఆయా ప్రాంతాల్లోని ఎగ్జామ్ మాఫియాతో బలమైన సంబంధాలున్నాయి. ప్రశ్న పత్రాలను పరీక్షకు ఒక రోజు ముందు సంపాదించడంలో ఇతడు నిష్ణాతుడు.
ఈ సాల్వర్ గ్యాంగ్కు డబ్బులు చెల్లిస్తే అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీలను ప్రవేశపెట్టి పరీక్షలు రాయిస్తుంది. కచ్చితంగా ర్యాంక్ వస్తుందన్న హామీ ఇచ్చి.. భారీగా సొమ్ములు తీసుకొని ఈ పనిచేస్తుంది.
డాక్టర్ కావాల్సినవాడు.. లీకర్గా మారాడు..!
2007లో రవి అత్రిని తల్లిదండ్రులు మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం సిద్ధమయ్యేందుకు రాజస్థాన్లోని కోటాకు పంపించారు. అతడు అక్కడ కొన్నేళ్లపాటు చదువుకొని 2012లో పీజీఐ రోహ్తక్లో సీటు సంపాదించాడు. నాలుగో ఏడాది డ్రాపౌట్ అయ్యాడు. అప్పటికే అతడు ఎగ్జామ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇతరుల మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్కు అతడు హాజరై పేపర్ రాసేవాడు. దీంతోపాటు లీకైన పేపర్లను పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టాడు. ఇతడిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు.
సంజీవ్ ముఖియా కుటుంబం హస్తం..
ఈసారి నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తి సంజీవ్ ముఖియా. ఇతడు కూడా సాల్వర్ గ్యాంగ్లో సభ్యుడే. ఇతడి కుమారుడు కూడా దీనిలో కీలక పాత్ర పోషించాడు. గతంలో బీపీఎస్సీ టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్ష, కానిస్టేబుల్ పరీక్షల లీకుల్లో కూడా వీరి హస్తం ఉంది. ప్రస్తుతం నీట్ వివాదం పెద్దదికావడంతో సంజీవ్ ముఖియా నేపాల్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.
ఝార్ఖండ్లోని హజారీబాగ్ కేంద్రంగా..?
బిహార్ పొరుగు రాష్ట్రమైన ఝార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతం లీకులకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడ ఒయాసిస్స్ స్కూల్ నీట్ పేపర్ లీకేజీలో కీలకంగా వ్యవహరించినట్లు బిహార్ పోలీస్లోని ది ఎకనామిక్ అఫెన్స్ వింగ్ గుర్తించింది. ఇక్కడ ట్యాంపర్ చేసిన నీట్ ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చిలో బీపీఎస్సీకి చెందిన టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష పత్రాన్ని కూడా ఇక్కడి నుంచే లీక్ చేశారు. అప్పుడు కూడా ఇక్కడ 268 మంది అభ్యర్థులకు ముందు రోజు రాత్రి ప్రశ్నపత్రం అందినట్లు అధికారులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది. -
ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం భారత్లో.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే!
దేశ రాజధాని దిల్లీలోని రైసినా హిల్ కాంప్లెక్స్ నార్త్, సౌత్ బ్లాక్లను 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ వెల్లడించారు. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
మోదీ బర్త్డే వేళ ‘సుభద్ర యోజన’ ప్రారంభం: ఒడిశా సీఎం
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజున ఒడిశాలో ‘సుభద్ర యోజన’ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం మాఝి వెల్లడించారు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
మణిపుర్ సమస్య మోదీ సర్కార్కు పట్టడం లేదు: జైరాం రమేశ్
మణిపుర్ పరిస్థితిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. -
ఆ పార్టీ ఎంపీకే ‘డిప్యూటీ’ ఇవ్వండి.. టీఎంసీ విజ్ఞప్తి
లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి అంశంపై తృణమూల్ కాంగ్రెస్ భిన్నంగా స్పందించింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీకి ఆ పదవిని ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. -
త్వరలో నీటి సమస్యకు పరిష్కారం: ఆతిశీ
భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన చంద్రవాల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లోని పంప్హౌస్ను జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ ఆదివారం సందర్శించారు. -
పూరీ జగన్నాథుడి రథయాత్రకు 315 ప్రత్యేక రైళ్లు
పూరీ జగన్నాథుడి రథయాత్రకు 315 ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. -
‘అమ్మ పేరుతో ఒక మొక్క’.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు
బాల్య స్నేహితులిద్దరు దేశంలోని అత్యున్నత అధికారులుగా బాధ్యతలు చేపట్టిన అరుదైన ఘటన చోటు చేసుకొంది. -
16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్ వైరల్
ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం దేశం మొత్తం ప్రపంచ కప్పు ఫీవర్లో ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న పోస్టులు వైరల్గా మారుతున్నాయి. -
ఉత్తర భారతంలో భారీవర్షాలు
ఉత్తర భారతంలో శనివారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. -
విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదు : సీబీఐ
మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (55) విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. -
నీట్ కేసు.. గుజరాత్లో ఏడుచోట్ల సీబీఐ సోదాలు
వైద్యవిద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష’ (నీట్-యూజీ) అక్రమాలకు సంబంధించి గుజరాత్లో ఏడుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం సోదాలు నిర్వహించింది. -
కూలిన రాజ్కోట్ విమానాశ్రయ పైకప్పు
భారీవర్షాలకు దిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలిన 24 గంటల్లోనే గుజరాత్లోని రాజ్కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అటువంటి సంఘటనే మరొకటి నమోదైంది. విమానాశ్రయ పైకప్పులో ఓ భాగం శనివారం ఊడిపడిపోయింది. -
లద్దాఖ్లో నది దాటుతూ ఐదుగురు సైనికుల దుర్మరణం
ఓ నదిని దాటే ప్రయత్నంలో యుద్ధ ట్యాంకులోని ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో శనివారం చోటుచేసుకుంది. -
ప్రభుత్వాన్ని నియంత్రించేది రాజ్యాంగ నైతికతే
రాజ్యాంగ నైతికత ప్రభుత్వాన్ని నియంత్రించే కారకంగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. భిన్నత్వాన్ని గౌరవించడం, అందరినీ కలుపుకొనిపోవడాన్ని ప్రోత్సహించడం, సహనాన్ని కొనసాగించడం వంటి షరతులు ఇందులో ఇమిడి ఉన్నాయని వివరించారు. -
బ్రీత్ ఎనలైజర్లపై పకడ్బందీ నిబంధనలు
శ్వాస విశ్లేషణ సాధనాలు (బ్రీత్ ఎనలైజర్స్) కచ్చితమైన, విశ్వసనీయమైన ఫలితాలను అందించేలా చూడటానికి కేంద్ర వినియోగదారుల శాఖకు చెందిన చట్టపరమైన తూనికలు, కొలతల విభాగం శుక్రవారం కొత్త ముసాయిదా నిబంధనలను వెలువరించింది. -
ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ
బిహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని జనతాదళ్ (యునైటెడ్) డిమాండ్ చేసింది. పేరు ఏదైనా తమ రాష్ట్రానికి సాయం కావాలని పేర్కొంది. ఈ మేరకు శనివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. -
13వేల మందికిపైగా భక్తుల అమర్నాథ్ ఆలయ సందర్శన
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి రోజున 13వేల మందికిపైగా భక్తులు గుహాలయాన్ని సందర్శించారు. అంతకుముందు శనివారం తెల్లవారు జామున గట్టి బందోబస్తు మధ్య కశ్మీర్లోని జంట బేస్ క్యాంపులైన బాల్టాల్, నున్వాన్ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు.
తాజా వార్తలు (Latest News)
-
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
-
ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం భారత్లో.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే!
-
కేరళ ఎయిమ్స్ తెచ్చిన చిచ్చు.. థరూర్, చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?