Mumbai Airport: భారీ వర్షాల ఎఫెక్ట్.. 27 విమానాల దారి మళ్లింపు..!
ముంబయిలో వర్షాలు ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దాదాపు 27 విమానాలను దారి మళ్లించారు.
ఇంటర్నెట్డెస్క్: ముంబయిలో భారీ వర్షాల ప్రభావం ఎయిర్ పోర్టు (Mumbai Airport)పై తీవ్రంగా ఉంది. కొద్దిసేపు రన్వే కార్యకలాపాలను సస్పెండ్ చేయగా.. మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. ఇవి హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యాయి. ఉదయం 11 గంటల సమయానికి 50కిపైగా విమానాలను రద్దు చేశారు. వీటిల్లో ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్, ఖతార్ ఎయిర్ వేస్కు చెందినవి ఉన్నట్లు సమాచారం.
ఇక తెల్లవారుజామున 2.22 నుంచి 3.40 వరకు రన్వేపై కార్యకలాపాలను నిలిపివేశారు. తాము అరైవల్స్కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం దారి మళ్లించిన విమానాలకు, డిపార్చర్లలో ఆలస్యమైతే అవసరమైన ఏర్పాట్లు చేయడంపైనా దృష్టి పెడతామన్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.
బయల్దేరే ముందు విమాన సర్వీసు స్టేటస్ను చెక్ చేసుకోవాలని ముంబయి విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ప్రతికూల వాతావరణం, అతిభారీ వర్షాల కారణంగా ప్రయాణికులు తమ విమాన సర్వీసుల అప్డేట్ను సంబంధిత ఎయిర్లైన్స్ నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ప్రయాణానికి కొద్దిసేపు ముందు విమనాశ్రయానికి చేరుకోవాలి’’ అని సీఎస్ఎంఐఏ ఎయిర్పోర్టు ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి (Mumbai) వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి., పోవాయ్లో 314 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్ రైళ్ల (Local Trains) రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రైల్వేస్టేషన్లలో నిలిచిన నీటిని తొలగించేందుకు శక్తిమంతమైన మోటార్లను ఏర్పాటు చేశారు. కుర్లా వద్ద భారీ వర్షాల కారణంగా రాష్ట్ర మంత్రి అనిల్ పటేల్ సహా 15 మంది ప్రజాప్రతినిధులు ఒక రైలులో చిక్కుకుపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్పోర్టులో వృద్ధుడికి గుండెపోటు.. ప్రాణం నిలిపిన వైద్యురాలు
Delhi Airport: ఎయిర్పోర్టులో ఉన్నట్టుండి గుండెపోటుకు గురైన వృద్ధుడి ప్రాణాలు కాపాడారో వైద్యురాలు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
బెదిరింపుల వీడియో వైరల్.. వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి అరెస్టు
మహారాష్ట్రకు చెందిన ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ (Puja Khedkar) తల్లి మనోరమ ఖేడ్కర్ను గురువారం పుణె పోలీసులు అరెస్టు చేశారు. -
లక్షల్లో ఇన్స్టా ఫాలోవర్లు.. రీల్స్ చేస్తూ యువతి దుర్మరణం!
Aanvi Kamdar: తన రీల్స్, వీడియోలతో లక్షలాది మంది అనుచరులను సంపాదించుకున్న ఆన్వీ కామ్దార్ చివరకు ఓ లోయలో జారిపడి మృతిచెందారు. -
కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగాలన్నీ కన్నడిగులకే!
పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో స్థానిక కన్నడిగులకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ‘ఎక్స్’లో చేసిన ప్రకటన కలకలం రేపిన క్రమంలో.. బుధవారం దాన్ని తొలగించారు. -
‘మహా’ డిప్యూటీ సీఎంల హెలికాప్టర్ దారితప్పింది!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడణవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. ఇద్దరూ పెనుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. -
ఈ 10 పాటిస్తే దిగులు మాయం
మీ మనసు ఎప్పుడూ దిగులు, చికాకుతో నిండి ఉండటం, ఏకాగ్రత లేకపోవడం, వాయిదా వేసే అలవాటు ఉంటే, వాటిని మార్చుకోవడానికి ఇవి ప్రయత్నించండి. -
దేశంలో గణనీయంగా తగ్గిన బాల్యవివాహాలు
పౌర సమాజ సంస్థలు, గ్రామ పంచాయతీల జోక్యంతో దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు (6)
అస్సాంలో పోలీసులు, సాయుధమూకలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హమార్కు చెందిన ముగ్గురు మిలిటెంట్లు మరణించారు. -
బెంగళూరులో అన్నదాతను అవమానించిన మాల్
బెంగళూరులో పంచెకట్టుతో వచ్చిన ఓ అన్నదాతను మాల్లోకి రానివ్వకపోవడం ఇంటా, బయటా తీవ్ర విమర్శల పాలైంది. -
మరొకరికి బదిలీ చేసేందుకు కుమార్తె ‘ఆస్తి’ కాదు
‘‘అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపాలని కోరుకోరు’’ అని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ అన్నారు. -
కేదార్నాథ్లో 228 కిలోల బంగారం అదృశ్యం!
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలపై ఆలయ కమిటీ బుధవారం స్పందించింది. -
నిరుద్యోగ ఉప్పెన!
దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతగా తాండవిస్తోందో తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఘటన కళ్లకు కట్టింది. ఉద్యోగ సాధన కోసం ప్రాణాలనూ లెక్కచేయని పరిస్థితి అక్కడ కనిపించడం ఉపాధి అవకాశాల దుస్థితికి అద్దం పట్టింది. -
మీ పనయ్యాక సిస్టమ్స్ లాగౌట్ చేస్తారా?
డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్న మనం నిత్యం హ్యాకింగ్, సైబర్ మోసాలు, వైరస్ దాడుల గురించి వింటున్నాం. -
కేజ్రీవాల్ పిటిషన్లపై దిల్లీ హైకోర్టు తీర్పు వాయిదా
మద్యం విధానం కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై దిల్లీ హైకోర్టు బుధవారం తన తీర్పును వాయిదా వేసింది. -
పూజా ఖేడ్కర్ కుటుంబ అక్రమ నిర్మాణాల కూల్చివేత
మహారాష్ట్రకు చెందిన ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కుటుంబ అక్రమ నిర్మాణాలపై పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) చర్యలు చేపట్టింది. -
పొలం కబ్జా చేసిన మాఫియా.. కలెక్టరేట్లో రైతు పొర్లుదండాలు
నకిలీ పత్రాలతో తన భూమిని కొందరు కబ్జా చేశారని ఓ రైతు అధికారులకు మొరపెట్టుకున్నాడు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురై కలెక్టరేట్లో పొర్లుదండాలు పెట్టి తన నిరసన వ్యక్తం చేశాడు. -
జలవనరుల పరిరక్షణపై ఏఐ
చెన్నై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో జల వనరులు కలుషితం కాకుండా, నాణ్యతను పాటించేలా తమిళనాడులో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. -
84 వేల మంది బాలలను రక్షించిన ఆర్పీఎఫ్
‘నన్హే ఫరిస్తే’ కార్యక్రమంలో భాగంగా గత ఏడేళ్లలో ఆపదలో ఉన్న దాదాపు 84,119 మంది బాలలను రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) రక్షించిందని రైల్వే మంత్రిత్వశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
మరణం ఎవరికైనా తప్పదు
హాథ్రస్ తొక్కిసలాట తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, అయితే జరగాల్సిందాన్ని ఎవరూ ఆపలేరని, ప్రతిఒక్కరూ ఏదో ఒక రోజు మరణించాల్సిందేనని భోలే బాబా అలియాస్ నారాయణ్ సాకార్ హరి పేర్కొన్నారు. -
చాందీపురా వైరస్తో నాలుగేళ్ల బాలిక మృతి
గుజరాత్లో చాందీపురా వైరస్ సోకడంతో నాలుగేళ్ల బాలిక మృతి చెందిందని రాష్ట్ర అధికారులు నిర్ధారించారు. ఆ వైరస్ కారణంగా నమోదైన తొలి మరణం ఇదేనని బుధవారం స్పష్టం చేశారు. -
హరియాణా పోలీసుశాఖలో ‘అగ్నివీర్’లకు 10% కోటా
పోలీసుశాఖతోపాటు అటవీ గార్డులు, జైలు వార్డెన్ల ఉద్యోగాల్లో అగ్ని వీరులకు 10శాతం కోటా ఇవ్వనున్నట్లు హరియాణా ప్రభుత్వం ప్రకటించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ మరో రికార్డు.. ‘జవాన్’ను అధిగమించి
-
ఎయిర్పోర్టులో వృద్ధుడికి గుండెపోటు.. ప్రాణం నిలిపిన వైద్యురాలు
-
బెదిరింపుల వీడియో వైరల్.. వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి అరెస్టు
-
ములుగు డీఎంహెచ్వోకు మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు
-
వెనకబడిన 157 కి.మీ. పేసర్.. కారణం ఏంటో చెప్పిన బౌలింగ్ కోచ్
-
పోలీసుల కళ్లుగప్పి రిమాండ్ ఖైదీ పరారీ