- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Delhi rainfall: జలమయంగా దిల్లీ: ఎంపీని ఎత్తుకొని వచ్చి.. కారులో కూర్చోబెట్టి..!
దేశ రాజధాని దిల్లీలో కురుస్తోన్న భారీ వర్షాలకు (Delhi rainfall) పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది.
దిల్లీ: భారీ వర్షాలతో(Delhi rainfall) దేశరాజధాని దిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం ఎంపీలంతా ప్రస్తుతం నగరంలోనే ఉన్నారు. ఈ వర్షాలతో వారి నివాసాలు కూడా నీటిలో చిక్కుకుపోయాయి. నీటి ఎద్దడి పరిష్కరించాలంటూ ఇటీవల నిరాహారదీక్ష చేసిన ఆప్ నేత, దిల్లీ జలమంత్రి ఆతిశీ ఇల్లు కూడా వాటిల్లో ఉంది. తన ఇంట్లోని సామాన్లన్నీ పాడైపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించారు.
‘‘నేను నిద్రలేచేసరికి అన్ని గదులు నీటితో నిండిపోయాయి. కార్పెట్స్, ఫర్నిచర్ సహా నేలమీద ఉన్న సామాన్లన్నీ పాడైపోయాయి. డ్రైనేజీలు మూసుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సమయంలో కరెంట్ షాక్లను నివారించేందుకు ఉదయం ఆరు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు’’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తాను పార్లమెంట్కు సమయానికి వచ్చానని చెప్పారు.
దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!
ఈ వర్షాలతో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. లోథి ఎస్టేట్ ప్రాంతంలోని నివాసం వద్ద నీరు నిలవడంతో సిబ్బంది ఆయన్ను ఎత్తుకొని కారులో కూర్చోపెట్టారు. పార్లమెంట్కు వెళ్లేందుకే ఇదంతా అని యాదవ్ వెల్లడించారు. తన ఇల్లంతా నీటితో నిండిపోయిందని, రెండు రోజుల క్రితం చేసిన ఫ్లోరింగ్ అంతా పాడైపోయిందని చెప్పారు. ఫ్లోరింగ్ కోసం వెచ్చించిన సొమ్మంతా వృథా అయిందన్నారు. నీటిని తోడేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఫోన్ చేసిన ప్రయోజనం లేకపోయిందన్నారు.
ఈ పరిస్థితులపై దిల్లీ కౌన్సిలర్, భాజపా నేత రవీందర్ సింగ్ నేగి మాట్లాడుతూ.. ‘‘అన్ని కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలానికి ముందు వాటిలో పేరుకుపోయిన చెత్తను తీయకపోవడమే ఈ పరిస్థితికి కారణం’’ అని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూరీ జగన్నాథుడి రథయాత్రకు 315 ప్రత్యేక రైళ్లు
పూరీ జగన్నాథుడి రథయాత్రకు 315 ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. -
‘అమ్మ పేరుతో ఒక మొక్క’.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు
బాల్య స్నేహితులిద్దరు దేశంలోని అత్యున్నత అధికారులుగా బాధ్యతలు చేపట్టిన అరుదైన ఘటన చోటు చేసుకొంది. -
16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్ వైరల్
ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం దేశం మొత్తం ప్రపంచ కప్పు ఫీవర్లో ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న పోస్టులు వైరల్గా మారుతున్నాయి. -
ఉత్తర భారతంలో భారీవర్షాలు
ఉత్తర భారతంలో శనివారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. -
విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదు : సీబీఐ
మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (55) విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. -
నీట్ కేసు.. గుజరాత్లో ఏడుచోట్ల సీబీఐ సోదాలు
వైద్యవిద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష’ (నీట్-యూజీ) అక్రమాలకు సంబంధించి గుజరాత్లో ఏడుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం సోదాలు నిర్వహించింది. -
కూలిన రాజ్కోట్ విమానాశ్రయ పైకప్పు
భారీవర్షాలకు దిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలిన 24 గంటల్లోనే గుజరాత్లోని రాజ్కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అటువంటి సంఘటనే మరొకటి నమోదైంది. విమానాశ్రయ పైకప్పులో ఓ భాగం శనివారం ఊడిపడిపోయింది. -
లద్దాఖ్లో నది దాటుతూ ఐదుగురు సైనికుల దుర్మరణం
ఓ నదిని దాటే ప్రయత్నంలో యుద్ధ ట్యాంకులోని ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో శనివారం చోటుచేసుకుంది. -
ప్రభుత్వాన్ని నియంత్రించేది రాజ్యాంగ నైతికతే
రాజ్యాంగ నైతికత ప్రభుత్వాన్ని నియంత్రించే కారకంగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. భిన్నత్వాన్ని గౌరవించడం, అందరినీ కలుపుకొనిపోవడాన్ని ప్రోత్సహించడం, సహనాన్ని కొనసాగించడం వంటి షరతులు ఇందులో ఇమిడి ఉన్నాయని వివరించారు. -
బ్రీత్ ఎనలైజర్లపై పకడ్బందీ నిబంధనలు
శ్వాస విశ్లేషణ సాధనాలు (బ్రీత్ ఎనలైజర్స్) కచ్చితమైన, విశ్వసనీయమైన ఫలితాలను అందించేలా చూడటానికి కేంద్ర వినియోగదారుల శాఖకు చెందిన చట్టపరమైన తూనికలు, కొలతల విభాగం శుక్రవారం కొత్త ముసాయిదా నిబంధనలను వెలువరించింది. -
ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ
బిహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని జనతాదళ్ (యునైటెడ్) డిమాండ్ చేసింది. పేరు ఏదైనా తమ రాష్ట్రానికి సాయం కావాలని పేర్కొంది. ఈ మేరకు శనివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. -
13వేల మందికిపైగా భక్తుల అమర్నాథ్ ఆలయ సందర్శన
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి రోజున 13వేల మందికిపైగా భక్తులు గుహాలయాన్ని సందర్శించారు. అంతకుముందు శనివారం తెల్లవారు జామున గట్టి బందోబస్తు మధ్య కశ్మీర్లోని జంట బేస్ క్యాంపులైన బాల్టాల్, నున్వాన్ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. -
ఏఐతో గొంతు మార్చి.. పురుషుడిలా మాట్లాడిన మహిళ
కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఓ మహిళ పురుషుడిలా గొంతు మార్చి ఓ యువతి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఠాణెకు చెందిన ఓ మహిళ ఏఐ సాయంతో పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్ చేసింది. -
‘డేటింగ్ యాప్’తో.. ఘరానా మోసం
సివిల్స్కి సిద్ధమవుతున్న ఓ యువకుడు ‘డేటింగ్ యాప్’ల మాయలో పడి రూ.1.2 లక్షలు కోల్పోయిన సంఘటన దిల్లీలో చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దాని వెనకున్న ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. -
ఎమర్జెన్సీపై ఓంబిర్లా వ్యాఖ్యలు సరికాదు
‘ఎమర్జెన్సీ’ అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు. -
ఎమర్జెన్సీలో జైల్లో వేసినా.. దేశద్రోహి అనలేదు: లాలూ
దాదాపు 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఇటీవల రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ అత్యయిక పరిస్థితిని ఉద్దేశించి ప్రధాని మోదీ కాంగ్రెస్పై విమర్శలు చేశారు. -
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి 40% ప్రమాదభత్యం : అమిత్ షా
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) చేపట్టే కీలకమైన ఆపరేషన్లను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి 40 శాతం ప్రమాద భత్యాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు బైడెన్, ట్రంప్ మధ్య జరిగిన తొలి చర్చకు సంబంధించి అందరూ అంగీకరిస్తున్నది ఒక్కటే.. ట్రంప్ ముందు బైడెన్ తేలిపోయారని. అయితే బైడెన్ తాను చెప్పాలనుకున్న ముఖ్య విషయాలను స్పష్టంగానే వివరించారు. -
మీ భర్తలను ఇంట్లో కూర్చొని తాగమనండి.. మహిళలకు మధ్యప్రదేశ్ మంత్రి సలహా
పురుషులతో మద్యం మాన్పించేందుకు మధ్యప్రదేశ్ సామాజిక న్యాయశాఖ మంత్రి నారాయణసింగ్ కుశ్వాహా మహిళలకు ఇచ్చిన సూచన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
సంక్షిప్త వార్తలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో నమోదైన పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది.