- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Om Birla: మైక్ కట్ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా
ప్రతిపక్ష నేతల మైక్లను సభాపతి కట్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం సరికాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) పేర్కొన్నారు.
దిల్లీ: కీలక అంశాలపై చర్చకు పట్టుబట్టిన సమయాల్లో సభాపతి సూచనల మేరకు ప్రిసైడింగ్ అధికారులు ప్రతిపక్ష నేతల మైక్లను కట్ (Mic Muted Charge) చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైక్ను ఆపరేట్ చేసేందుకు వాళ్ల దగ్గర ఎలాంటి రిమోట్ కంట్రోల్స్ ఉండవని స్పష్టం చేశారు. ఇది సభాపతి గౌరవానికి సంబంధించిన విషయమని, ఇలాంటి అంశాలపై ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. అనవసర విషయాలతో సమయం వృథా చేయకుండా సభ్యులంతా ప్రజల సమస్యలపై మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
‘‘ సభాపతి స్థానంలో ఉన్న ఎవరైనా కేవలం రూలింగ్ లేదా ఆదేశాలు మాత్రమే ఇవ్వగలరు. సభలో మాట్లాడేందుకు అవకాశమిస్తూ సభ్యుడి పేరు పిలిచినప్పుడు, సభాపతి ఆదేశాల మేరకు అక్కడున్న సిబ్బంది సంబంధిత వ్యక్తికి మైక్ కనెక్షన్ ఇస్తారు. అంతే తప్ప చైర్లో కూర్చున్న వ్యక్తికి గానీ, ప్రిసైడింగ్ అధికారులకుగానీ మైక్ను ఆపరేట్ చేసే అవకాశం ఉండదు.’’ అని ఓం బిర్లా స్పష్టం చేశారు. సభాపతి స్థానంలో స్పీకర్ లేనప్పుడు సభను సజావుగా నడిపించేందుకు ఏర్పాటు చేసిన స్పీకర్ ప్యానెల్లో అన్ని పార్టీల సభ్యులు ఉంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘ ఇది స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవానికి సంబంధించిన అంశం. కనీసం ప్యానెల్లో ఉన్నవారైనా ఇలాంటి ఆరోపణలు చేయకూడదు. కాంగ్రెస్ సీనియర్ నేత కె. సురేశ్ కూడా స్పీకర్ ప్యానెల్లో ఉన్నారు. మైక్ను సభాపతి కంట్రోల్ చేయగలరో? లేదో? ఆయనైనా చెప్పాలి’’ అని ఓం బిర్లా వ్యాఖ్యానించారు.
శుక్రవారం లోక్సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ నీట్ పరీక్ష (NEET UG 2024) నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో తనను మాట్లాడనీయకుండా మైక్ కట్ చేశారని ఆరోపించారు. దీనిపై స్పీకర్ స్పందించారు. గతంలో అలాంటి ఏర్పాటు ఉండేదని, ఇప్పుడు మాత్రం మైక్రోఫోన్ను ఆపరేట్ చేసే వెసులుబాటు సభాపతికి లేదని చెప్పారు. చైర్ ఆదేశాల మేరకు పార్లమెంట్ సిబ్బంది దానిని ఆపరేట్ చేస్తారని వివరించారు. తాజాగా ప్రతిపక్షాలు మరోసారి అదే వాదన తీసుకురావడంతో ఒకింత అసహనానికి గురవుతూనే స్పష్టత ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!
ఇటీవల తమ కాలేజీల్లో హిజాబ్పై నిషేధం విధించిన ముంబయిలోని ఓ విద్యాసంస్థ.. తాజాగా చిరిగిన జీన్ ప్యాంట్, టీషర్ట్లపైనా ఆంక్షలు విధించింది. -
మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
PM Modi: ఎన్ని అబద్ధాలు చెప్పినా విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని ప్రధాని మోదీ విమర్శించారు. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. 99 సీట్లకే కాంగ్రెస్ మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటోందన్నారు. -
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
కొన్నేళ్లపాటు కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ (Kerala)లోని కోర్టు విధించిన శిక్ష సంచలనం సృష్టించింది. -
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
మూడు దశాబ్దాల క్రితం నాటి ముంబయి అలర్ల కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. -
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 27 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్లో ఓ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
నీట్పై 26 పిటిషన్లు.. జులై 8 నుంచి సుప్రీం కోర్టు విచారణ
నీట్ వివాదంపై దాఖలైన అనేక పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జులై 8న విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. -
పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నపత్రం రెడీ.. ‘నీట్ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం..!
NEET PG Exam: నీట్ పీజీ 2024 పరీక్షను ఈ నెలాఖరు లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ వారంలోనే షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ మాల్యాపై నాన్- బెయిలబుల్ వారెంట్.. జారీ చేసిన ముంబయి కోర్టు
Vijay Mallya: బ్యాంకుల నుంచి తీసుకొన్న రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాపై ముంబయి ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పలు అంశాలపై మాట్లాడారు. -
‘రాహుల్ గాంధీలా ప్రవర్తించకండి’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
PM Modi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పీకర్ను అవమానిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ చేయొద్దని సూచించారు. -
జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
సల్మాన్ ఖాన్ను కూడా సింగర్ సిద్ధూ మూసేవాలా తరహాలోనే హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నింది. జిగాన తుపాకులు, 70 మందితో కూడిన నెట్వర్క్, పాక్ ఆయుధ డీలర్లు, స్థానిక కిరాయి గ్యాంగ్లతో ఓ నెట్వర్క్ ఈ బాలీవుడ్ హీరోపై దాడి కుట్రలో భాగమైనట్లు తేలింది. -
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. -
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు.. హైకోర్టు సంచలన తీర్పు
ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పుర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. -
ఎంపీగా ఇంజినీర్ రషీద్ ప్రమాణానికి ఎన్ఐఏ అనుమతి
ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమతి ఇచ్చింది. -
స్వచ్ఛంద సంస్థల రెన్యువల్ చెల్లుబాటు గడువు పెంపు
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్యే) కింద నమోదైన అన్ని స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
భారతీయులకు మాతృభూమిపై ప్రేమ, భక్తి ఎన్నటికీ తరగవు
బయటి ప్రపంచానికి భారత్పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. -
మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష
ఇరవై మూడేళ్ల క్రితంనాటి పరువు నష్టం దావాలో ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ సోమవారం అయిదు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు. -
పార్లమెంటులో జర్నలిస్టులపై ఆంక్షలను తొలగించండి: ఎడిటర్స్ గిల్డ్
పార్లమెంటు కార్యకలాపాలను కవర్ చేసే మీడియా ప్రతినిధులపై కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షలను తొలగించాలంటూ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్లకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. -
అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి, సత్వర న్యాయం అందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఎఫ్ఐఆర్ నమోదు దశ నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు మూడేళ్లలోగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. -
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ 2024 పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు మళ్లీ నిర్వహించిన పరీక్ష ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. -
సాధారణానికి మించి ఈ నెలలో వర్షాలు: ఐఎండీ
దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!
-
మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
-
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి ఏర్పాట్లు