- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
RajyaSabha: ధన్ఖడ్, ఖర్గే సంభాషణ.. సభలో నవ్వులే నవ్వులు!
రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన సరదా సంభాషణతో సభలో నవ్వులు విరబూశాయి.
దిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగడం సాధారణంగా చూస్తుంటాం. ఈక్రమంలో రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ల మధ్య వాడీవేడి సంభాషణ జరిగిన రెండురోజులకే వారి మధ్య చోటుచేసుకున్న సరదా సంభాషణతో సభలో నవ్వులు విరిసాయి.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి నిలబడ్డారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోతున్నానని.. ఛైర్మన్ అనుమతిస్తే కూర్చొని మాట్లాడతానని విజ్ఞప్తి చేశారు. దీనిపై ధన్ఖడ్ స్పందిస్తూ.. ‘‘సభలో ప్రసంగించేటప్పుడు మీరు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మీరు కూర్చొని మాట్లాడవచ్చు. ఆ నిర్ణయం మీదే’’ అని బదులిచ్చారు. కూర్చొని చేసే ప్రసంగం, నిలబడి మాట్లాడి చేసేంత ఉద్రేకంగా ఉండదని ఖర్గే నవ్వుతూ చెప్పారు. విపక్ష నేత మాటలతో ఛైర్మన్ కూడా ఏకీభవించడంతో ఇద్దరూ నవ్వులు చిందించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
‘‘ఈ విషయంలో నేను మీకు సాయం చేస్తాను’’ అని ఛైర్మన్ ధన్ఖడ్ అన్నారు. ఛైర్మన్ కూడా కొన్ని సందర్భాల్లో తమకు సాయం చేశారని.. దాన్ని తాము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని ఖర్గే పేర్కొనడంతో సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ‘‘తమ నవ్వులతో సభ్యులు నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఛైర్మన్ కూడా తోడయ్యారు’’ అని ఖర్గే మళ్లీ వ్యాఖ్యానించారు. తాను కూడా ఒక్కోసారి అలాగే మాట్లాడతానంటూ ధన్ఖడ్ చమత్కరించారు. ఇలా ధన్ఖడ్-ఖర్గేల మధ్య కొనసాగిన సంభాషణలతో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కూడా చిరునవ్వులు చిందించారు.
ఇది నేరమా..?
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సభలో వాతావరణం వేడెక్కింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం దేశానికి ప్రమాదకరమని ఆరోపించారు. యూనివర్సిటీలు, ఎన్సీఈఆర్టీతో పాటు ఇతర విద్యాసంస్థల్లో వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్ల నియామకాలపై ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంటోందన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మండిపడ్డారు. ‘‘ఈ సంస్థ దేశ అభివృద్ధికి కృషి చేస్తోంది. దేశ ప్రగతి కోసం శ్రమిస్తున్న ఎంతోమంది గొప్పవారు దీనిలో ఉన్నారు. అలాంటివారు ఆర్ఎస్ఎస్లో భాగమవడం నేరమా?’’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్ తొక్కిసలాటకు కారణమేంటి?
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. -
అగ్గి రాజేసిన ‘వీధి న్యాయం’... మమతపై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు
ఇటీవల పశ్చిమబెంగాల్లోని చోప్రాలో ఓ వ్యక్తితోపాటు మహిళను నడిరోడ్డుపై చావబాదిన ఘటన రాష్ట్రంలో అగ్గి రాజేస్తోంది. గవర్నర్ ఆనంద్బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
గూగుల్ మ్యాప్స్ను నమ్మి.. దట్టమైన అడవిలో 11 గంటలు చిక్కుకొని..
గూగుల్ మ్యాప్స్ను అనుసరిస్తూ ఆలయానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు దట్టమైన అడవిలో చిక్కుకున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో 11 గంటల పాటు అక్కడే గడిపారు. -
పేపర్ లీక్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం - ప్రధాని మోదీ
నీట్ ప్రశ్నాపత్రం లీక్ నిందితులను కఠినంగా శిక్షిస్తామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 87కి చేరిన మృతుల సంఖ్య
ఉత్తర్ప్రదేశ్లో ఓ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
ఖర్గే స్థానంలో ‘ఆయన’ ఉంటే బాగుంటుంది.. రాజ్యసభ ఛైర్మన్
రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీరుపై ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మండిపడ్డారు. జగదీప్వ్యాఖ్యలకు బదులిస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలతో సభ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. -
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!
ఇటీవల తమ కాలేజీల్లో హిజాబ్పై నిషేధం విధించిన ముంబయిలోని ఓ విద్యాసంస్థ.. తాజాగా చిరిగిన జీన్ ప్యాంట్, టీషర్ట్లపైనా ఆంక్షలు విధించింది. -
మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
PM Modi: ఎన్ని అబద్ధాలు చెప్పినా విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని ప్రధాని మోదీ విమర్శించారు. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. 99 సీట్లకే కాంగ్రెస్ మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటోందన్నారు. -
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
కొన్నేళ్లపాటు కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ (Kerala)లోని కోర్టు విధించిన శిక్ష సంచలనం సృష్టించింది. -
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
మూడు దశాబ్దాల క్రితం నాటి ముంబయి అలర్ల కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. -
నీట్పై 26 పిటిషన్లు.. జులై 8 నుంచి సుప్రీం కోర్టు విచారణ
నీట్ వివాదంపై దాఖలైన అనేక పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జులై 8న విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. -
పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నపత్రం రెడీ.. ‘నీట్ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం..!
NEET PG Exam: నీట్ పీజీ 2024 పరీక్షను ఈ నెలాఖరు లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ వారంలోనే షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ మాల్యాపై నాన్- బెయిలబుల్ వారెంట్.. జారీ చేసిన ముంబయి కోర్టు
Vijay Mallya: బ్యాంకుల నుంచి తీసుకొన్న రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాపై ముంబయి ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పలు అంశాలపై మాట్లాడారు. -
‘రాహుల్ గాంధీలా ప్రవర్తించకండి’.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
PM Modi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ స్పీకర్ను అవమానిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ చేయొద్దని సూచించారు. -
జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
సల్మాన్ ఖాన్ను కూడా సింగర్ సిద్ధూ మూసేవాలా తరహాలోనే హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నింది. జిగాన తుపాకులు, 70 మందితో కూడిన నెట్వర్క్, పాక్ ఆయుధ డీలర్లు, స్థానిక కిరాయి గ్యాంగ్లతో ఓ నెట్వర్క్ ఈ బాలీవుడ్ హీరోపై దాడి కుట్రలో భాగమైనట్లు తేలింది. -
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని అంశాలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. -
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు.. హైకోర్టు సంచలన తీర్పు
ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పుర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. -
ఎంపీగా ఇంజినీర్ రషీద్ ప్రమాణానికి ఎన్ఐఏ అనుమతి
ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమతి ఇచ్చింది. -
స్వచ్ఛంద సంస్థల రెన్యువల్ చెల్లుబాటు గడువు పెంపు
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్యే) కింద నమోదైన అన్ని స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
భారతీయులకు మాతృభూమిపై ప్రేమ, భక్తి ఎన్నటికీ తరగవు
బయటి ప్రపంచానికి భారత్పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పుణె శివారులో ఘోర ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఐదుగురి దుర్మరణం
-
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!
-
షారుక్ ఖాన్కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా
-
ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్ తొక్కిసలాటకు కారణమేంటి?
-
ఆన్లైన్లోనే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ: తెలంగాణ ప్రభుత్వం
-
తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదలకు జీవో జారీ