- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Emergency: తొలి ప్రసంగంలో ‘ఎమర్జెన్సీ’పై స్పీకర్ వ్యాఖ్యలు.. మోదీ ఏమన్నారంటే..?
Emergency: ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేడు సభలో చదివి వినిపించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.
దిల్లీ: లోక్సభ స్పీకర్గా వరుసగా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా (Om Birla) సభలో తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎమర్జెన్సీ (Emergency)’ అంశాన్ని ప్రస్తావించారు. అత్యయిక స్థితి నాటి విషాదాన్ని గుర్తుచేసుకుంటూ సభలో మౌనం పాటించారు. అయితే, స్పీకర్ ప్రసంగంపై కాంగ్రెస్ సహా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
సభాపతిగా (Lok Sabha Speaker) ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం ఓం బిర్లా ‘ఎమర్జెన్సీ’పై తీసుకొచ్చిన తీర్మానాన్ని చదవి వినిపించారు. ‘‘1975, జూన్ 25 మన దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆ రోజున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ (Emergency)ని విధించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. ప్రపంచంలోనే మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు సాధించాం. ఆ ప్రజాస్వామ్య విలువలు, చర్చలు దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. కానీ, నాటి ప్రధాని (ఇందిరాగాంధీ) నియంతృత్వాన్ని అమలు చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణగదొక్కారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారు. మీడియాపై ఆంక్షలు విధించారు. యావత్ దేశం కారాగారంగా మారిపోయింది’’ అని స్పీకర్ గుర్తుచేశారు.
నాటి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అత్యయిక స్థితిని ఎదిరించిన వారిని తాము అభినందిస్తున్నామని ఓం బిర్లా (Om Birla) అన్నారు. అనంతరం నాటి చీకటి రోజులకు నివాళిగా సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దామని సభ్యులను కోరారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. అయితే, స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు.
నేటి తరం తెలుసుకోవాలి: మోదీ
స్పీకర్ ప్రసంగంపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఎమర్జెన్సీని స్పీకర్ తీవ్రంగా ఖండించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యం గొంతు నొక్కి అప్పటి ప్రభుత్వం సాగించిన అన్యాయాలను ఆయన ఎత్తిచూపారు. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించారు. దాని గురించి నేటి తరం తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి.. ప్రజాభిప్రాయాన్ని అణచివేసి, సంస్థలు నాశనం చేసినప్పుడు సమాజం ఎలా ఉంటుందో చెప్పేందుకు నాటి రోజులే సరైన ఉదాహరణ. నియంతృత్వం ఎలా ఉంటుందో ఎమర్జెన్సీ పరిస్థితుల నుంచి తెలుసుకోవచ్చు’’ అని మోదీ ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్
BJP: గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో టెంట్ కూలిన ఘటనపై భాజపా స్పందిస్తూ కాంగ్రెస్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. దీనికి నెహ్రూను నిందించొద్దంటూ కౌంటర్ పోస్ట్ చేసింది. -
ఏఐ వాయిస్తో లేడీ మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ
ఏఐ సాంకేతికత ద్వారా ఫోన్లో పురుషుడిలా వాయిస్ మార్చి పొరుగింటి యువతిని మోసం చేసింది ఓ మహిళ. బాధితురాలి నుంచి రూ.6 లక్షలకు పైగా కాజేసింది. -
ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ మమ్మల్ని జైల్లో వేయించారేగానీ..: లాలూ ప్రసాద్ యాదవ్
గత కొద్దిరోజులుగా దేశ రాజకీయ నేతల నోట ఎమర్జెన్సీ పదం విరివిగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. -
కాలుకు గాయం.. బాలుడి మర్మావయవాలకు సర్జరీ!
ఠాణెలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాలుడి కాలుకు బదులు అతడి మర్మావయవాలకు శస్త్రచికిత్స నిర్వహించారు. -
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం
Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. పార్టీ సమావేశంలో దీనిపై కీలక తీర్మానం చేశారు. -
‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్ పవార్
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నాడు దేశంలో విధించిన ‘ఎమర్జెన్సీ’పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. -
మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్ వైరల్
తాగుడుకు బానిసైన (drinking habit) తమ భర్తలతో ఆ వ్యసనాన్ని మాన్పించేందుకు భార్యలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తాగుడును ఇలా మాన్పించాలంటూ ఓ మంత్రి చేసిన సూచన వైరల్గా మారింది. -
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్ల మృతి
Ladakh: లద్దాఖ్లో జరిగిన సైనిక విన్యాసాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. -
విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ నియామకం
ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు. -
నీట్పై చర్చకు విపక్షాల పట్టు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది. -
హేమంత్ సోరెన్ దోషి అని నమ్మడానికి ఆధారాల్లేవు
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు భారీ ఊరట లభించింది. -
నీట్-యూజీ పేపర్ లీకు కేసు.. ఝార్ఖండ్లో ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ అరెస్టు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకు కేసుకు సంబంధించి ఝార్ఖండ్లోని హజారీబాగ్లో ఓ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. -
పనితీరు బాగోకపోతే ముందస్తుగా పదవీ విరమణ
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలూ తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతి నెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) స్పష్టం చేసింది. -
పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ కొత్త తేదీల ప్రకటన
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది. -
కొత్త నేర న్యాయచట్టాలపై 1న పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు
కొత్త నేర న్యాయచట్టాలు అమల్లోకి వచ్చే జులై ఒకటిన దేశవ్యాప్తంగా ఉన్న 17,500 పోలీస్ స్టేషన్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాయి. -
మీడియాలో వాణిజ్య ప్రకటనలకు ‘స్వీయ ధ్రువీకరణ’ అప్పుడే వద్దు
ప్రజలను మోసం చేసే, తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలను నిరోధించే లక్ష్యంతో సుప్రీంకోర్టు సూచన మేరకు అమలులోకి తెచ్చిన ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ సమర్పించే నిబంధనను ప్రస్తుతానికి మెడికల్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ విజ్ఞప్తి చేశారు. -
విమానం మరుగుదొడ్డిలో పొగతాగిన వ్యక్తి అరెస్టు
దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబయికి వెళుతున్న ఇండిగో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. -
పరీక్షల విధానంలో సంస్కరణలు.. సలహాల కోసం వెబ్సైట్ ప్రారంభం
నీట్ యూజీ , యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ప్రాథమిక గణిత ప్రశ్నలపై 80% మంది ఉపాధ్యాయుల్లో తడబాటు
భారత్తోపాటు మధ్య ప్రాచ్య దేశాల్లోని గణిత ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది నిష్పత్తి, అనుపాత తార్కికం, బీజ గణితం, ఎస్టిమేషన్, లాజికల్ రీజనింగ్ వంటి ప్రాథమిక భావనల్లో తడబడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
దేశానికి సంబంధించిన ఏ విషయంపైనా ప్రజాశ్రేయస్సు కోణంలో చర్చ జరగడం లేదు. హిందూ-ముస్లిం, రిజర్వేషన్లకు మద్దతు-వ్యతిరేకం, నాకు నచ్చిన పార్టీ-ప్రత్యర్థి పార్టీ.. ఇలా మన దృష్టికోణం విభజనవాదంతో నిండిపోయింది. -
నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ‘నీట్’ నుంచి తమిళనాడును మినహాయించాలని, ఇందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని శుక్రవారం తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
తాజా వార్తలు (Latest News)
-
మా బావ ప్రభాస్కు అభినందనలు: మోహన్బాబు ట్వీట్ వైరల్
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
-
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
-
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్