- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pollution: వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
Pollution: వాయు కాలుష్యం కారణంగా భారత్లో సంభవిస్తున్న మరణాలపై నిర్వహించిన ఓ అధ్యయనాన్ని లాన్సెట్ ప్రచురింది. అందులోని కీలక విషయాలేంటో చూద్దాం.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రతీ సంవత్సరం 11.5 శాతం మరణాలు (దాదాపు 12,000 మంది) వాయు కాలుష్యం (Air Pollution) కారణంగా సంభవించి ఉండొచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్లో ప్రచురితమైన ఓ నివేదిక అంచనా వేసింది. కాలుష్యం కారణంగా దేశంలో అత్యధిక మరణాలు సంభవిస్తుంది ఈ మహానగరంలోనేనని తెలిపింది.
భారత్లోని మొత్తం పది నగరాలు- అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబయి, పుణె, సిమ్లా, వారణాసిలో అధ్యయనం చేశారు. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33 వేల మరణాలు వాయు కాలుష్యం (Air Pollution) కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది. సిమ్లాలో అత్యల్పంగా 59 మంది మరణించారు. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో ఇది 3.7 శాతానికి సమానం. మొత్తం పది నగరాల్లో నమోదైన మరణాల్లో 7.2 శాతం కాలుష్యం వల్లేనని కుండబద్దలు కొట్టింది.
భారత్ సహా విదేశీ పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం చేశారు. పది నగరాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని వెల్లడించింది. సంవత్సరంలో 99.8 శాతం రోజులు ఇదే పరిస్థితి ఉంటోందని తెలిపింది. 2008 నుంచి 2019 మధ్య పది నగరాల్లోని సివిల్ రిజిస్ట్రీల నుంచి మరణాల సమాచారాన్ని సేకరించారు. నగరాన్ని బట్టి మూడు నుంచి ఏడేళ్ల డేటా మాత్రమే వారికి లభించింది. మొత్తం 36 లక్షల మరణాలను అధ్యయనం చేశారు. మెషీన్ లెర్నింగ్ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా పీఎం 2.5 రేణువుల స్థాయిలను అంచనా వేశారు.
కొవిడ్లో 3% అధికంగా.. బరువు తక్కువ శిశు జననాలు
పీఎం 2.5 స్థాయిలు ప్రతీ క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు 1.42 శాతం అధికమైనట్లు అధ్యయనం గుర్తించింది. పది నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలిపింది. విడివిడిగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీగానే ఉందని పేర్కొంది. దిల్లీలో మరణాల సంఖ్య 0.31 శాతం పెరిగితే.. బెంగళూరులో అది 3.06 శాతం పెరిగినట్లు వెల్లడించింది. పీఎం 2.5 స్థాయిలు పెరిగినప్పుడు కాలుష్యం అధికంగా ఉన్న నగరాలతో పోలిస్తే తక్కువ ఉన్న వాటిల్లోనే మరణాలు అధికమవుతున్నట్లు గుర్తించామని అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లో ఒకరైన ‘సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్’కు చెందిన సిద్ధార్థ్ మండల్ వెల్లడించారు.
ఇలా వివిధ నగరాల్లో స్వల్పకాలంలో కాలుష్య ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం భారత్లో ఇదే తొలిసారని మరో పరిశోధకుడు భార్గవ్ కృష్ణ తెలిపారు. భారతీయుల ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావానికి సంబంధించి కీలక విషయాలు దీంతో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా..
NEET UG counselling: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా పడింది. -
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ సంగీత్ వేడుక అట్టహాసంగా జరిగింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. -
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
Hathras stampede: కొద్దిరోజుల క్రితం హాథ్రస్లో జరిగిన సత్సంగ్ తీవ్ర విషాదం నింపింది. దీనిపై తాజాగా ‘భోలేబాబా’(Bhole Baba) మీడియాతో మాట్లాడారు. -
మహువాపై ఎఫ్ఐఆర్కు ఎన్సీడబ్ల్యూ ఆదేశం
జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖాశర్మపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు!
వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి.. అల్ప, మధ్యాదాయ దేశా (ఎల్ఎంఐసీ)ల్లోని చిన్నారుల పాలిట శాపమవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. -
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామనీ, పెండింగు కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సూచించారు. -
వంతెనలు కూలిన ఘటనలో..16 మంది ఇంజినీర్లపై వేటు వేసిన బిహార్
బిహార్లో వరుస వంతెనలు కూలిపోతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు. -
సింగరేణి నైనిబ్లాక్కు అనుమతులపై కిషన్రెడ్డి హర్షం
ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు గని తవ్వకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపట్ల కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. -
స్వలింగ వివాహాలకు గుర్తింపు నిరాకరించిన తీర్పు సమీక్షకు అభ్యర్థన
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించటానికి నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబరు 17న వెలువరించిన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. -
వైద్యులకు రక్షణ కల్పించండి
వైద్య పరంగా నేరపూరిత నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారి వైద్యులకు రక్షణ కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 26వ సెక్షన్ను వినియోగించేలా చూడాలని భారత వైద్య మండలి (ఐఎంఏ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. -
భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. -
పుణె కారు ప్రమాదం.. రోడ్డు భద్రతపై వ్యాసాన్ని సమర్పించిన మైనర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కారు ప్రమాదంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడు(17) శుక్రవారం రోడ్డు ప్రమాదంపై 300 పదాల వ్యాసాన్ని బాల నేరస్థుల న్యాయ మండలి(జేజేబీ)కి సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు
ఖలిస్థాన్ అనుకూలవాది, ‘వారిస్ పంజాబ్ దే’ అధిపతి అమృత్పాల్ సింగ్, కశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్లు శుక్రవారం భారీ భద్రత నడుమ పార్లమెంటులో ఎంపీలుగా ప్రమాణం చేశారు. -
కర్ణాటక జలాశయాలకు వరద
ఎగువ కురుస్తున్న వర్షాలకు కన్నడనాట జలాశయాల్లోకి వరద చేరుతోంది. ముఖ్యంగా మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వానలకు తుంగ జలాశయానికి ప్రవాహాలు పెరిగాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇకపై హాస్పిటల్కు వెళ్లం: ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి సిన్హా
-
రెండు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలి: ఎంపీ లక్ష్మణ్
-
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా..
-
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!