- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Lalu Prasad Yadav: ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ మమ్మల్ని జైల్లో వేయించారేగానీ..: లాలూ ప్రసాద్ యాదవ్
గత కొద్దిరోజులుగా దేశ రాజకీయ నేతల నోట ఎమర్జెన్సీ పదం విరివిగా వినిపిస్తోంది. దీనిపై తాజాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.
పట్నా: దాదాపు 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ (Emergency)పై ఇటీవల రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దానికి ముందు ఆ అత్యయిక పరిస్థితిని ఉద్దేశించి ప్రధాని మోదీ కాంగ్రెస్పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) స్పందించారు. నాడు ఇందిర తమను జైల్లో పెట్టించారు కానీ.. ఎన్నడూ వేధించలేదని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘‘ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ(Emergency)కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాశ్ నారాయణ్ ఏర్పాటు చేసిన కమిటీకి కన్వీనర్గా పనిచేశాను. అప్పుడు మెయింటినెన్స్ ఆఫ్ సెక్యూరిటీ యాక్ట్ (MISA) కింద జైల్లో పెట్టారు. 15 నెలలు జైల్లో ఉన్నాను. ఈ రోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న మోదీ, జేపీ నడ్డా, ఇతర కేంద్రమంత్రుల గురించి మేం వినలేదు. ఇందిర ఎంతోమందిని జైల్లో వేయించారు కానీ.. ఎవరినీ వేధించలేదు. ఆమె కానీ, ప్రభుత్వంలోని మంత్రులు కానీ మమ్మల్ని దేశ వ్యతిరేకులని అనలేదు. మన ప్రజాస్వామ్యంపై 1975 నాటి స్థితి ఒక మరకలాంటిదే. కానీ, 2024లో విపక్షాలను గౌరవించని వారిని ఎవరూ మర్చిపోకూడదు’’ అని లాలూ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు. "The Sangh Silence in 1975" పేరిట ఒక కథనాన్ని షేర్ చేశారు.
‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్ పవార్
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..‘‘ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి. అత్యయిక స్థితి నాటి రోజుల్లో దేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. కానీ అటువంటి రాజ్యాంగ విరుద్ధ శక్తులపై వ్యతిరేకంగా దేశం విజయం సాధించింది’’ అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించి, పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాలరాసి.. రాజ్యాంగాన్ని అణగదొక్కినవారికి రాజ్యాంగంపై ప్రేమ నాటకాలాడే హక్కు లేదని ఇటీవల కాంగ్రెస్ను ఉద్దేశించి మోదీ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరువు నష్టం కేసులో ఎదురు దెబ్బ.. ఎంపీకి 50లక్షల జరిమానా
పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది. -
‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్
Mahua Moitra: లోక్సభలో తనపై బహిష్కరణ వేటు వేసిన భాజపాకు ప్రజలు గట్టి సమాధానం చెప్పారని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా అన్నారు. 63 మంది ఎంపీలను ఇంటికి పంపించారన్నారు. -
రాహుల్ దాడి భాజపాపై మాత్రమే: ప్రియాంక గాంధీ
రాహుల్ గాంధీ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని భాజపా చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కొట్టిపడేశారు. -
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!
కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టాలు న్యాయ వ్యవస్థలో మార్పునకు కీలక ముందడుగుగా కొందరు అభివర్ణించగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?
Rahul Gandhi: లోక్సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మోదీజీ ఎప్పుడూ సీరియస్గా ఎందుకు ఉంటారని అడగ్గా.. ప్రధాని దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. -
పరువునష్టం కేసు.. మేధా పాట్కర్కు అయిదు నెలల జైలుశిక్ష
ఓ పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ కోర్టు అయిదు నెలల జైలుశిక్ష విధించింది. -
మైక్ కట్ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా
ప్రతిపక్ష నేతల మైక్లను సభాపతి కట్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం సరికాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) పేర్కొన్నారు. -
ఇది రాహుల్కి కఠిన పరీక్ష.. అనురాగ్ ఠాకూర్ విమర్శలు
లోక్సభ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికవ్వడం ఆయనకు కఠిన పరీక్షతో సమానమని భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. -
భద్రతా పరమైన సవాళ్లు స్వీకరించడానికి ఆర్మీ సిద్ధంగా ఉంది: జనరల్ ద్వివేది.
దేశానికి ఎదురయ్యే ఎటువంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది పేర్కొన్నారు. -
మోదీ అంతరిక్షంలోకి వెళ్లగలరా? - ఇస్రో చీఫ్ ఏమన్నారంటే!
‘గగన్యాన్’ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పేర్కొన్నారు. -
లోక్సభలో రాహుల్ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం
దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
కొత్త నేర చట్టాలపై విపక్షాలది అనవసర ఆరోపణే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కొత్త నేర చట్టాల(New criminal laws)పై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వాటిపై ఆందోళన చెందుతున్న నేతలతో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమిత్ షా (Amit Shah) తెలిపారు. -
ధన్ఖడ్, ఖర్గే సంభాషణ.. సభలో నవ్వులే నవ్వులు!
రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన సరదా సంభాషణతో సభలో నవ్వులు విరబూశాయి. -
జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ అనుమతి
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ జైల్లో ఉండటంతో ఇంజినీర్ రషీద్ (Engineer Rashid ).. ఎంపీగా ప్రమాణం చేయలేకపోయారు. దీనిపై ఎన్ఐఏ స్పందించింది. -
‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు
New Criminal Laws: తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. వాటిని బలవంతంగా అమల్లోకి తీసుకొస్తున్నారని ఆరోపించాయి. -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సభ్యులంతా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. -
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
పశ్చిమ బెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా కొడుతున్న వీడియో వైరల్గా మారింది. దీనిపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. -
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
NEET-UG 2024: నీట్ రీటెస్ట్ ఫలితాలను ఎన్టీఏ సోమవారం విడుదల చేసింది. దీంతోపాటు నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులు సవరించినట్లు వెల్లడించింది. -
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)(Bharatiya Nyay Sanhita) కింద తొలి కేసు నమోదు అయింది. దిల్లీలో ఓ వీధి వ్యాపారిపై పోలీసులు ఈ కేసు పెట్టారు. -
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాలుగేళ్ల తర్వాత భారత్కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి!
-
అమరావతిపై చంద్రబాబు సమీక్ష.. ఎల్లుండి శ్వేతపత్రం
-
‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్
-
త్వరలో క్యాబినెట్ విస్తరణ.. సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్: దామోదర రాజనర్సింహ
-
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
-
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!