L K Advani: మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆడ్వాణీ

భాజపా దిగ్గజ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ (96) బుధవారం రాత్రి దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత వారం ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే.

Published : 04 Jul 2024 06:20 IST

దిల్లీ: భాజపా దిగ్గజ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ (96) బుధవారం రాత్రి దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత వారం ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. ‘‘ఆడ్వాణీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. న్యూరాలజీ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ వినీత్‌ సూరి ఆధ్వర్యంలో రాత్రి 9.00 గంటల ప్రాంతంలో ఆయన ఆసుపత్రిలో చేరారు’’ అని వైద్యవర్గాలు తెలిపాయి. ఆడ్వాణీ ఆరోగ్య సమస్య ఏమిటన్నది వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని