- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Lok Sabha Election Results: జైలు నుంచే ఎంపీగా గెలుపు.. లోక్సభకు వెళ్లొచ్చా..?
Lok Sabha Election Results: ఉగ్ర అభియోగాలపై జైలులో ఉన్న ఇద్దరు తాజా ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందారు. మరి వారు లోక్సభకు వెళ్లొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల (Lok Sabha Election Results)తో 18వ లోక్సభలో అడుగుపెట్టే 543 మంది ఎవరో ఖరారైంది. వీరిలో రాజకీయ ఉద్ధండులు, తొలిసారి ఎన్నికైనవారు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. వీరందరిని పక్కనబెడితే కొత్తగా ఎన్నికైన వారిలో ఇద్దరి గెలుపు ఆశ్చర్యపర్చింది. అవును మరి.. వాళ్లు జైలు నుంచే ఈ ఎన్నికల్లో పోటీ చేయడమే గాక.. విజయం సొంతం చేసుకున్నారు. వారే అమృత్పాల్ సింగ్ (Amritpal Singh), ఇంజినీర్ రషీద్. మరి వారు లోక్సభకు వెళ్లొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం..!
పంజాబ్ (Punjab)లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్పాల్ సింగ్, జమ్మూకశ్మీర్లోని బారాముల్లా నుంచి ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ (Engineer Rashid) తాజా లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటంతో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతిస్తారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం వీరు ప్రమాణం చేసేందుకు అర్హులేనని లోక్సభ (Lok sabha) మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారి తెలిపారు.
‘‘ఇలాంటి కేసుల్లో రాజ్యాంగ నిబంధనలు పాటించడం అత్యంత అవశ్యం. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చట్టసభ్యుడిగా ప్రమాణం (Oath Taking) చేయడం అనేది రాజ్యాంగపరమైన హక్కు. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నందున ప్రమాణస్వీకారం కోసం పార్లమెంట్కు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి. ప్రమాణం పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాలి’’ అని ఆచారి వెల్లడించారు.
అయితే, జైల్లో ఉన్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. అందువల్ల ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత వారు సభకు హాజరుకాలేకపోవడంపై స్పీకర్కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి అభ్యర్థనలను సభాపతి సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్ కమిటీకి పంపుతారు. ఈ అభ్యర్థులను అంగీకరించాలా? వద్దా అన్నదానిపై కమిటీ సిఫార్సులు చేస్తుంది. వాటిపై సభలో ఓటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని ఆచారి తెలిపారు.
స్వతంత్రులుగా పోటీ చేసి..
అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీసులపై దాడి కేసులో ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు, వేర్పాటువాది అమృత్పాల్ (Amritpal Singh) పేరు దేశంలో మార్మోగింది. జాతీయ భద్రతా చట్టం కింద 2023 ఏప్రిల్లో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లోని ఖడూర్సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో దాదాపు 2 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం అందుకున్నారు.
ఇక, ఇంజినీర్ రషీద్గా గుర్తింపు పొందిన షేక్ అబ్దుల్ రషీద్.. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో అరెస్టయ్యారు. తాజా ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసి ఏకంగా మాజీ సీఎంనే ఓడించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అయితే ఈ కేసుల్లో వారు దోషులుగా తేలి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్షను ఎదుర్కొంటే.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అనర్హులవుతారు. అప్పుడు లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. జైలుశిక్ష కాలంతో పాటు మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిహార్లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. -
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తనపై చేస్తోన్న ఆరోపణలకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. -
‘సింగింగ్’ చాయ్వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
ఒక చేతిలో చాయ్ కలిపే గరిటె.. మరో చేతిలో మైక్తో కనిపిస్తున్న ఓ చాయ్వాలా.. వినియోగదారులకు టీ రుచి చూపిస్తూనే.. గాన మాధుర్యంతో అలరిస్తున్నారు. -
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
భోలే బాబా (Bhole Baba) అద్భుతాలు చేయగలిగితే.. తన సత్సంగ్ కార్యక్రమానికి వచ్చిన మృతులను ఎందుకు బతికించలేదని హాథ్రస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. -
ఎంపీలుగా ప్రమాణం చేసిన అమృత్పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్
వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్, ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. -
ఆ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు - ఎన్బీఈ హెచ్చరిక
‘ఎఫ్ఎంజీఈ’ అర్హత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని అందజేస్తామని సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. -
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
Sudha Murty: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గత 30 ఏళ్లలో ఒక్క చీరను కూడా కొనలేదట. అందుకు కారణమేంటో ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్ ఘటనపై సిట్ చీఫ్
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు.. నిర్వాహకులదే తప్పిదమని సూచిస్తున్నాయని దర్యాప్తు అధికారి తెలిపారు. -
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధతమైనది కాదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. -
ఆప్ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా సంజయ్ సింగ్
ఆమ్ఆద్మీ పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్గా ఆప్ సంజయ్ సింగ్ను నియమించింది. -
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?
అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూకశ్మీర్ ఎన్నికలు నిర్వహించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. -
అందుకే బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం
బిహార్ (Bihar)లో వరుసగా బ్రిడ్జ్లు కూలిపోవడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి వెల్లడించారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ ఆశ్చర్యపరుస్తోంది. -
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
Hathras Stampede: భోలే బాబా నిర్వహించిన సత్సంగ్కు హాజరై అనంతరం తొక్కిసలాటలో మరణించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
Hathras Stampede: యూపీలో హాథ్రస్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన బాధితులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. -
రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. -
బ్రహ్మపుత్రి
వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియామారి చార్! -
కుటుంబాన్ని కలవవచ్చు.. దిల్లీ వదిలి వెళ్లకూడదు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. -
రోజువారీ మరణాల్లో 7శాతం వాయు కాలుష్యం వల్లే
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. -
మా అబ్బాయి పెళ్లికి రండి.. సోనియా కుటుంబాన్ని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దిల్లీలోని ఆమె 10 జన్పథ్ నివాసంలో గురువారం కలిశారు. -
నీట్-యూజీని రద్దు చేయొద్దు
పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆసుపత్రి నుంచి ఆడ్వాణీ డిశ్చార్జ్
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం: రేవంత్రెడ్డి
-
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు
-
జూన్లో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. మొత్తం ఎన్ని?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 190
-
పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం.. త్వరలో నూతన ఐటీ పాలసీ: మంత్రి లోకేశ్