- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Shashi Tharoor: ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య వ్యతిరేకమే కానీ..: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
Shashi Tharoor: దేశంలో అత్యయిక స్థితి విధించడంపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది ప్రజాస్వామ్య వ్యతిరేకమే గానీ.. రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు.
దిల్లీ: దాదాపు ఐదు దశాబ్దాల క్రితం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ (Emergency)’ అంశం ఇప్పుడు లోక్సభ సమావేశాలను కుదిపేస్తోంది. స్వయంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో ఈ ప్రస్తావన తేవడం, స్పీకర్ ఓం బిర్లా దీనిపై తీర్మానం చదవడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ (Congress) సీనియర్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) నాటి అత్యయిక స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే అయినప్పటికీ రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థరూర్ అత్యయిక స్థితిపై జరుగుతున్న వివాదం గురించి ప్రస్తావించారు. ‘‘ఎమర్జెన్సీని నేను విమర్శిస్తా. ఆ చర్యను నేను సమర్థించడం లేదు. గర్వించదగ్గ విషయమనీ చెప్పట్లేదు. అత్యయిక స్థితి సమయంలో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమనే భావిస్తున్నా. అయితే, అది వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదు. దేశంలో అంతర్గత ఎమర్జెన్సీని విధించేందుకు రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఆ తర్వాత దాన్ని తొలగించినప్పటికీ అప్పట్లో ఆ నిబంధన ఉండేది’’ అని థరూర్ వ్యాఖ్యానించారు.
ఈసందర్భంగా మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ విమర్శలు గుప్పించారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ సర్కారు ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని దుయ్యబట్టారు. ‘‘ఎన్డీయే ప్రభుత్వం 1975 లేదా 2047 గురించి మాట్లాడుతోంది కానీ.. వర్తమాన అంశాలను ప్రస్తావించట్లేదు. నీట్ పేపర్ లీక్ వివాదం, నిరుద్యోగం సమస్యలు, మణిపుర్ అల్లర్ల వంటి కీలక అంశాలపై వారు దృష్టి పెట్టాలి’’ అని థరూర్ అన్నారు.
మోదీపైనే సంసద్ టీవీ ఫోకస్: కాంగ్రెస్
‘జై సంవిధాన్’ అని కూడా అనలేమా ?: ప్రియాంక
కేరళలోని తిరువనంతపురం నుంచి నాలుగోసారి ఎన్నికైన శశిథరూర్ లోక్సభ సభ్యుడిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం పూర్తయిన తర్వాత ఆయన ‘జై హింద్, జై సంవిధాన్’ అని నినాదం చేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు కూడా ‘జై సంవిధాన్’ అని నినదించారు. ఇలా అనడంపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలుపగా.. విపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నాయకురాలు ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘‘అధికార పార్టీకి చెందిన సభ్యులు అనుచిత పదజాలాన్ని ఉపయోగించినా.. రాజ్యాంగ వ్యతిరేక నినాదాలు చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ప్రతిపక్ష నేతలు జై సంవిధాన్ అని చెబితే మాత్రం వద్దంటున్నారు. మన రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్ వైరల్
ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం దేశం మొత్తం ప్రపంచ కప్పు ఫీవర్లో ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న పోస్టులు వైరల్గా మారుతున్నాయి. -
ఉత్తర భారతంలో భారీవర్షాలు
ఉత్తర భారతంలో శనివారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. -
విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదు : సీబీఐ
మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (55) విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. -
నీట్ కేసు.. గుజరాత్లో ఏడుచోట్ల సీబీఐ సోదాలు
వైద్యవిద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష’ (నీట్-యూజీ) అక్రమాలకు సంబంధించి గుజరాత్లో ఏడుచోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం సోదాలు నిర్వహించింది. -
కూలిన రాజ్కోట్ విమానాశ్రయ పైకప్పు
భారీవర్షాలకు దిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలిన 24 గంటల్లోనే గుజరాత్లోని రాజ్కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అటువంటి సంఘటనే మరొకటి నమోదైంది. విమానాశ్రయ పైకప్పులో ఓ భాగం శనివారం ఊడిపడిపోయింది. -
లద్దాఖ్లో నది దాటుతూ ఐదుగురు సైనికుల దుర్మరణం
ఓ నదిని దాటే ప్రయత్నంలో యుద్ధ ట్యాంకులోని ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో శనివారం చోటుచేసుకుంది. -
ప్రభుత్వాన్ని నియంత్రించేది రాజ్యాంగ నైతికతే
రాజ్యాంగ నైతికత ప్రభుత్వాన్ని నియంత్రించే కారకంగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. భిన్నత్వాన్ని గౌరవించడం, అందరినీ కలుపుకొనిపోవడాన్ని ప్రోత్సహించడం, సహనాన్ని కొనసాగించడం వంటి షరతులు ఇందులో ఇమిడి ఉన్నాయని వివరించారు. -
బ్రీత్ ఎనలైజర్లపై పకడ్బందీ నిబంధనలు
శ్వాస విశ్లేషణ సాధనాలు (బ్రీత్ ఎనలైజర్స్) కచ్చితమైన, విశ్వసనీయమైన ఫలితాలను అందించేలా చూడటానికి కేంద్ర వినియోగదారుల శాఖకు చెందిన చట్టపరమైన తూనికలు, కొలతల విభాగం శుక్రవారం కొత్త ముసాయిదా నిబంధనలను వెలువరించింది. -
ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ
బిహార్కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని జనతాదళ్ (యునైటెడ్) డిమాండ్ చేసింది. పేరు ఏదైనా తమ రాష్ట్రానికి సాయం కావాలని పేర్కొంది. ఈ మేరకు శనివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. -
13వేల మందికిపైగా భక్తుల అమర్నాథ్ ఆలయ సందర్శన
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి రోజున 13వేల మందికిపైగా భక్తులు గుహాలయాన్ని సందర్శించారు. అంతకుముందు శనివారం తెల్లవారు జామున గట్టి బందోబస్తు మధ్య కశ్మీర్లోని జంట బేస్ క్యాంపులైన బాల్టాల్, నున్వాన్ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. -
ఏఐతో గొంతు మార్చి.. పురుషుడిలా మాట్లాడిన మహిళ
కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఓ మహిళ పురుషుడిలా గొంతు మార్చి ఓ యువతి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఠాణెకు చెందిన ఓ మహిళ ఏఐ సాయంతో పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్ చేసింది. -
‘డేటింగ్ యాప్’తో.. ఘరానా మోసం
సివిల్స్కి సిద్ధమవుతున్న ఓ యువకుడు ‘డేటింగ్ యాప్’ల మాయలో పడి రూ.1.2 లక్షలు కోల్పోయిన సంఘటన దిల్లీలో చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దాని వెనకున్న ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. -
ఎమర్జెన్సీపై ఓంబిర్లా వ్యాఖ్యలు సరికాదు
‘ఎమర్జెన్సీ’ అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు. -
ఎమర్జెన్సీలో జైల్లో వేసినా.. దేశద్రోహి అనలేదు: లాలూ
దాదాపు 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ఇటీవల రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ అత్యయిక పరిస్థితిని ఉద్దేశించి ప్రధాని మోదీ కాంగ్రెస్పై విమర్శలు చేశారు. -
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి 40% ప్రమాదభత్యం : అమిత్ షా
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) చేపట్టే కీలకమైన ఆపరేషన్లను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి 40 శాతం ప్రమాద భత్యాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు బైడెన్, ట్రంప్ మధ్య జరిగిన తొలి చర్చకు సంబంధించి అందరూ అంగీకరిస్తున్నది ఒక్కటే.. ట్రంప్ ముందు బైడెన్ తేలిపోయారని. అయితే బైడెన్ తాను చెప్పాలనుకున్న ముఖ్య విషయాలను స్పష్టంగానే వివరించారు. -
మీ భర్తలను ఇంట్లో కూర్చొని తాగమనండి.. మహిళలకు మధ్యప్రదేశ్ మంత్రి సలహా
పురుషులతో మద్యం మాన్పించేందుకు మధ్యప్రదేశ్ సామాజిక న్యాయశాఖ మంత్రి నారాయణసింగ్ కుశ్వాహా మహిళలకు ఇచ్చిన సూచన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
సంక్షిప్త వార్తలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో నమోదైన పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది. -
కల్తీసారా విక్రయాలపై తమిళనాడు ఉక్కుపాదం
ఇటీవల తమిళనాడులో కల్తీసారా బారిన పడి 60 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
అనూహ్య వరద.. కొట్టుకుపోయిన కార్లు!
హరిద్వార్లోని సుఖీ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. పలు కార్లు, బస్సులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
-
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
-
16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్ వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వెంకయ్యనాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
-
డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: సీఎం రేవంత్రెడ్డి