- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kerala Blasts: టిఫిన్ బాక్సులో IED పేలుడు పదార్థాలు..!
ఐఈడీ (IED) కారణంగానే కన్వెన్షన్ సెంటర్లో భారీ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కేరళ పోలీసులు వెల్లడించారు.
తిరువనంతపురం: కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పేలుళ్లు (Kerala Blasts) దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఐఈడీ (IED) కారణంగానే కన్వెన్షన్ సెంటర్లో ఈ భారీ పేలుడు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కేరళ పోలీసులు వెల్లడించారు.
‘కలమస్సేరీలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో (Convention Centre) ఉదయం 9.40కి పేలుడు సంభవించింది. ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం రెండు పేలుళ్లు జరిగినట్లు అంచనా వేస్తున్నాం. భారీ పేలుడు పదార్థం ఐఈడీ (IED) కారణంగానే ఇది సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుళ్లకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’ అని కేరళ డీజీపీ షేక్ దార్వేశ్ సాహెబ్ పేర్కొన్నారు. ఇందులో ఉగ్రకోణం ఏమైనా ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దర్యాప్తు తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి ఎన్ఐతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు కేరళ మంత్రులు వీఎన్ వాసవన్, ఆంటోనీ రాజులు పేర్కొన్నారు.
కేరళలోని కలమస్సేరి కన్వెన్షన్ సెంటర్లో పేలుళ్లు
ఈ పేలుళ్లలో సుమారు 40 మంది గాయపడగా.. అందులో 10 మంది 50శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటున్నట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, ద్వేషపూరిత మెసేజ్లు వ్యాప్తి చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. 14 జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్తో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు బృందాలను పంపించినట్లు చెప్పారు.
బాంబు అమర్చింది నేనే..!
కన్వెన్షన్ సెంటర్లో బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొంటూ త్రిశూర్కు చెందిన ఓ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. కలమస్సేరీలో బాంబు అమర్చింది తానేనని చెప్పినట్లు సమాచారం. దీంతో అతడిని పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. ఆ బాంబు పేలుళ్లకు ఇతడికి నిజంగా సంబంధం ఉందా..? అన్న విషయంపై పోలీసులు ఇంకా ఓ నిర్ధారణకు రాలేదని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం
President Droupadi Murmu: పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ప్రసంగిస్తున్నారు. -
పోలీసు కస్టడీలో మేకప్ వేసుకుని.. లిప్స్టిక్ రాసుకున్న పవిత్రా గౌడ
Pavithra Gowda: హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటి పవిత్రా గౌడ పోలీసు కస్టడీలో మేకప్ వేసుకోవడం వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులకు నోటీసులు జారీ అయ్యాయి. -
జీరో ఎఫ్ఐఆర్.. ఆన్లైన్లోనే ఫిర్యాదులు
వచ్చే వారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాల (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)తో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. -
ముంబయి రైళ్లలో పశువుల తరలింపులా ప్రయాణాలు సిగ్గుచేటు : హైకోర్టు
లోకల్ రైళ్లలో ముంబయి ప్రయాణికులు పశువులను తరలిస్తున్నట్టుగా చేస్తున్న బలవంతపు ప్రయాణాలు చూసి సిగ్గు పడుతున్నట్లు బాంబే హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. -
రోడ్లు బాగా లేకుంటే టోల్ వసూలు చేయొద్దు
రహదారులు నాణ్యంగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్ వసూలు చేయొద్దని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలుకు సంబంధించిన గ్లోబల్ వర్క్షాపులో బుధవారం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్గా మళ్లీ పిట్రోడా
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్గా మళ్లీ శాం పిట్రోడాను నియమిస్తూ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయనే ఛైర్మన్గా ఉండేవారు. -
కాస్త ఒళ్లు వంచండి బ్రో
భారత్లో సుమారు సగం మంది వయోజనులు శరీరానికి కావాల్సినంత శ్రమను అందించడం లేదని ఓ అధ్యయనం వెల్లడించింది. -
సభలో ‘ఎమర్జెన్సీ’ దుమారం
లోక్సభ స్పీకర్గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం చేసిన ప్రసంగం సందర్భంగా ఎమర్జెన్సీపై ఓం బిర్లా చదివిన తీర్మానం సభలో తీవ్ర దుమారం రేపింది. -
సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్
మనీలాండరింగ్తో ముడిపడిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి న్యాయస్థానం బుధవారం అనుమతించింది. -
భారతీయ రాకెట్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహం
ఇస్రో వాణిజ్య విభాగమైన ఎన్ఎస్ఐఎల్ తన కొత్త రాకెట్ ఎస్.ఎస్.ఎల్.వి.ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
హిజాబ్ నిషేధంపై జోక్యం చేసుకోలేం: బాంబే హైకోర్టు
హిజాబ్, బుర్ఖా, నఖాబ్లపై నిషేధం విధిస్తూ ముంబయిలోని ఓ కళాశాల తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు బుధవారం తెలిపింది. -
వ్యవస్థ మొత్తం బెయిల్ను అడ్డుకుంటోంది: సునీతా కేజ్రీవాల్
జైలు నుంచి తన భర్త విడుదల కాకుండా వ్యవస్థ మొత్తం పనిచేస్తున్నట్లుగా ఉందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుండగులు హతమయ్యారు. -
పుణెలో ఓ వైద్యుడు సహా కుమార్తెకు జికా వైరస్
మహారాష్ట్రలోని పుణెలో ఓ వైద్యుడు(46), ఆయన కుమార్తె(15)కు జికా వైరస్ సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పుణె మున్సిపల్ కార్పొరేషన్(పీఎంసీ)అధికారులు బుధవారం తెలిపారు. -
రాడార్కు అందని సాంకేతికత
రాడార్ సిగ్నళ్లకు అందకుండా ఉండటంతోపాటు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్ కవచంలా పనిచేసే సాంకేతికతను బుధవారం భారతీయ నౌకా దళానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అందజేసింది. -
ఆయుధాలతో ఇద్దరి సంచారం.. పఠాన్కోట్లో హైఅలర్ట్
భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పఠాన్కోట్లో ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో తిరుగుతున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. -
సంక్షిప్త వార్తలు (7)
మనం ఇప్పుడు కష్టాలు అనుకున్నవే భవిష్యత్తులో మనకు దక్కిన అదృష్టంగా అనిపిస్తాయి. ఆ కష్టాలను మనం ఎదుర్కోకపోయింటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదనిపిస్తుంది. -
ఆసుపత్రిలో చేరిన ఎల్కే ఆడ్వాణీ
భాజపా సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. -
ఓం బిర్లాయే సభాపతి
నూతన లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం కేవలం 12 నిమిషాల్లో పూర్తయింది. రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి భాజపా తరఫున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్ అయ్యారు. -
విధుల్లో ఉండగా గుండెపోటు.. బ్యాంకు ఉద్యోగి మృతి!
విధులు నిర్వర్తిస్తున్న ఓ బ్యాంకు ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. కేవలం 30 ఏళ్లకే ఆయనకు కార్డియాక్ అరెస్టు రావడం బాధాకరం.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉంది?
-
పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం
-
ఫాక్స్కాన్లో వివాహిత మహిళలకు ఉద్యోగాల నిరాకరణ.? నివేదిక కోరిన కేంద్రం
-
ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్.. ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఫ్యాన్స్ సందడి
-
పోలీసు కస్టడీలో మేకప్ వేసుకుని.. లిప్స్టిక్ రాసుకున్న పవిత్రా గౌడ
-
పాక్ ఎన్నికలపై దర్యాప్తునకు అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం