- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
LS Speaker: స్పీకర్ ఎన్నిక ఎలా జరుగుతుంది? ఆ పదవికి ఎందుకంత ప్రాధాన్యం?
విపక్షాల నిర్ణయంతో స్వతంత్ర భారత చరిత్రలో లోక్సభ స్పీకర్ ఎన్నికకు మూడోసారి ఎన్నిక అనివార్యమైంది.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ (Lok Sabha Elections) స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. దశాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయానికి తెరపడింది. స్వతంత్ర భారత చరిత్రలో స్పీకర్ ఎన్నికకు మూడోసారి ఓటింగ్ అనివార్యమైంది. కొన్నిసార్లు మినహా దశాబ్దాలుగా స్పీకర్ పదవిని అధికార పక్షం చేపట్టగా.. విపక్షాలు డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ (Speaker election) ఎన్నిక ఏవిధంగా జరుగుతుందనే విషయాన్ని పరిశీలిస్తే..
సీక్రెట్ బ్యాలెట్తోనే..
స్పీకర్ ఎన్నిక నిర్వహణకు ఎటువంటి కాల వ్యవధి లేదు. అయితే.. కొత్త లోక్సభ కొలువుదీరిన అనంతరం సాధ్యమైనంత త్వరగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవాలని రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 93’ చెబుతోంది. సాధారణ మెజార్టీతోనే స్పీకర్ను ఎన్నుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థి సగానికి పైగా ఓట్లు పొందుతారో ఆయనే స్పీకర్గా ఎన్నికవుతారు.
50 ఏళ్లలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక.. అభ్యర్థిని నిలబెట్టిన ఇండియా కూటమి
లోక్సభలో సభ్యుడిగా ఉన్న ఎవరైనా ఈ పదవికి పోటీ పడవచ్చు. ప్రత్యేక అర్హతలు కూడా అవసరం లేదు. కేవలం సభలో సభ్యుడు/సభ్యురాలిగా ఉంటే చాలు. సీనియారిటీ, నిష్పాక్షికత వంటి ముఖ్య అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను నిలబెడతారు. అనర్హత లేదా అవిశ్వాస ప్రక్రియ ద్వారా స్పీకర్ను ఆ పదవి నుంచి తొలగించవచ్చు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 94 ప్రకారం, నోటీసులు ఇచ్చిన 14 రోజుల తర్వాతే అటువంటి తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
కీలకం ఎందుకంటే..?
లోకసభ కార్యకలాపాలు సజావుగా సాగడంలో స్పీకర్దే కీలక పాత్ర. సభను ఆర్డర్లో ఉంచడం, సభా గౌరవాన్ని కాపాడటంతోపాటు సమావేశాల అజెండా, వాయిదా, అవిశ్వాస తీర్మానాలు అనుమతించే బాధ్యత ఆయనదే. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం సభ నియమాలను ఉల్లంఘించిన సభ్యులపై చర్యలు తీసుకునే, అనర్హత విధించే అధికారం స్పీకర్కు ఉంటుంది. సభా నియమాలను పాటిస్తూనే వాటిని స్పీకర్ అమలుచేయాల్సి ఉంటుంది. ఆయన నిర్ణయాలను సవాలు చేయలేరు. లోక్సభలో సభ్యుడు/సభ్యురాలు అయినప్పటికీ.. సభాపతిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
విపక్షాల బలంతో..
గత రెండుసార్లు సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని కొనసాగించిన భాజపా.. ఈసారి మాత్రం మెజార్టీ మార్కుకు 32 సీట్లు తక్కువ కావడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఎన్డీయేకు 293 మంది సభ్యులు, విపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలున్నారు. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా స్పీకర్ ఎన్నిక కీలకంగా మారింది. అధికార పక్షం నుంచి ఓం బిర్లా నామినేషన్ వేయగా.. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ బరిలో నిలిచారు. అయితే, మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు గడవు ఉంది. ఆలోపు విపక్షాలు వెనక్కి తగ్గకపోతే జూన్ 26న ఉదయం 11 గంటలకు స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారంట్, ప్లే గ్రౌండ్.. ఎక్కడో తెలుసా?
ఒడిశా అటవీ శాఖ ఏనుగుల కోసం వాటి శిక్షణా కేంద్రంలో సకల సౌకర్యాలు కల్పించింది. రెస్టారంట్, బాతింగ్ ఏరియాతో పాటు అనేక సదుపాయాలు సమకూర్చింది. -
నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీబీఐ అధికారులు మరో అరెస్టు చేశారు. -
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!
హాథ్రస్ దుర్ఘటన వెనక అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆరోపిస్తూ భోలే బాబా ఓ ప్రకటన విడుదల చేశాడు. -
దర్శన్ ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్.. పేరెంట్స్పై కేసు!
విచారణ ఖైదీగా ప్రస్తుతం జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కేటాయించిన ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్ చేసిన ఓ జంట చిక్కుల్లో పడింది. -
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
వర్షం కురవడంతో పైకప్పు నుంచి వందేభారత్లోకి నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వేశాఖ ఏమందంటే..? -
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ రాధాకృష్ణన్కు అందించారు. -
‘డంక్డ్ రైస్ కేక్’..ఇడ్లీ అనుకున్నానే..!: హర్ష గొయెంకా పోస్ట్ వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘జికా’ వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ
మహారాష్ట్రలో పలుచోట్ల జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది. -
అవినీతిపై పోరు.. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: మోదీ
మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపించడంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. అవినీతిపరులను వదిలేది లేదన్నారు. -
ఆ రాష్ట్రంలో కుప్పకూలుతున్న వంతెనలు.. 15 రోజుల్లో ఏడు!
భారీ వర్షాల నేపథ్యంలో బిహార్లో గడిచిన 15 రోజుల్లో ఏడు బ్రిడ్జిలు కూలిపోయాయి. -
అదొక భయానక అనుభవం..ఎయిర్లైన్స్పై ప్రయాణికుడి పోస్టు
విస్తారా ఎయిర్లైన్స్ సేవలపై ఓ ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
జులై 5న ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృత్పాల్ సింగ్
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) జులై 5 లోక్సభ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మరో ఎంపీ సరభ్జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు. -
జైలుకెళ్లి.. బాబాగా మారి.. ‘భోలే’ పాదధూళి కథేంటీ?
Hathras Stampede: హాథ్రస్ తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన భోలే బాబా గతంలో ఓ లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లినట్లు తెలుస్తోంది. -
హాథ్రస్ తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ: సీఎం యోగి ప్రకటన
హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ జరపనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. -
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
సర్వైకల్ క్యాన్సర్ నివారణ మార్గాలపై అవగాహన కల్పించేలా ఎంపీ సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభలో ప్రసంగించారు. దానిపై మోదీ(Modi) స్పందించారు. -
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
మణిపుర్పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం
PM Modi: మణిపుర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ అంశంపై రాజకీయాలు చేయడం ఇకనైనా ఆపాలని విపక్షాలకు గట్టిగా చెప్పారు. -
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం
కాంగ్రెస్ను ‘పరాన్న జీవి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. 2021లో రైతులు నిరసన చేపట్టినప్పుడు అదే మాట అన్నారని, మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారన్నారు. -
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
కాంగ్రెస్ (Congress), విపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు భాజపా (BJP) వీడియోల రూపంలో కౌంటర్ వచ్చింది. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది. -
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
PM Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో ఛైర్మన్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నీట్ వివాదం.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
నీట్ పరీక్షల అవకతవకలపై విమర్శలు చెలరేగుతోన్న సమయంలో దానిని రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామాలపై నటుడు విజయ్ (Vijay) స్పందించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారంట్, ప్లే గ్రౌండ్.. ఎక్కడో తెలుసా?
-
పేటీఎం మర్చంట్స్కు.. నెలకు కేవలం రూ.35తో ఆరోగ్య బీమా
-
నాకు పెళ్లైంది.. ఈయనే నా భర్త: నివేదా థామస్ కామెంట్స్
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. రష్యా, జపాన్ అధినేతల సంతాపం
-
మరో మైలురాయి దాటిన ‘కల్కి 2898 ఏడీ’.. వసూళ్లు ఎంతంటే?
-
కలకలం రేపిన ఏపీఎండీసీ దస్త్రాలు దహనం.. పెద్దిరెడ్డి అనుచరులపై అనుమానం