- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
UP Exam Paper Leak: ఏకంగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే కాజేశారు.. యూపీ పేపర్ లీకేజీలో విస్తుగొలిపే వాస్తవాలు
యూపీ పేపర్ లీకేజీ కేసులో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. ఏకంగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే నలుగురు ఇంజినీర్లు పేపర్ను లీక్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇంటర్నెట్డెస్క్: కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నిరాశే మిగులుతోంది. వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకై, పరీక్షలు రద్దవుతుండటంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఓ వైపు ‘నీట్ యూజీ-2024’ ప్రవేశపరీక్ష (NEET UG-2024)పై గందరగోళం నెలకొన్న వేళ.. ఉత్తర్ప్రదేశ్లో ఫిబ్రవరి 11న జరిగిన రివ్యూ ఆఫీసర్/ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ( RO/ARO Recruitment) ప్రశ్న పత్రం లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం నలుగురు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు లీక్ చేసినట్లు విచారణలో తేలింది. పేపర్ లీకవ్వలేదని తొలుత అధికారులు చెప్పినప్పటికీ.. టాస్క్ఫోర్స్ ముమ్మర దర్యాప్తుతో నాలుగు నెలల తర్వాత అసలు నిజాలు బయటపడ్డాయి.
రెండు చోట్ల లీకేజీ
మొత్తం రెండు చోట్ల పేపర్ లీకైనట్లు విచారణలో తేలింది. ప్రయాగ్రాజ్లోని బిషప్ జాన్సన్ గర్ల్స్ హైస్కూల్ కేంద్రంలో పరీక్ష ప్రారంభానికి 4 గంటల ముందే ప్రశ్నపత్రం బయటకొచ్చినట్లు అధికారులు తేల్చారు. అర్పిత్ వినీత్, యశ్వంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీసి కొందరు అభ్యర్థులకు చేరవేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో అర్పిత్తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ప్రశ్నపత్రం ప్రింటింగ్ కేంద్రంలోనే లీకేజీ జరిగినట్లు గుర్తించారు. దీనికి నలుగురు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు రాజీవ్ నారాయణ్ మిశ్రా, సునీల్ రఘువంశీ, విశాల్ దుబే, సుభాష్ ప్రకాశ్లను కారకులుగా తేల్చారు.
ఏకంగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 950కి.మీ దూరంలోని ఓ ప్రింటింగ్ కేంద్రంలో ప్రశ్నపత్రాలను ముద్రించబోతున్నట్లు ప్రధాన నిందితుడు రాజీవ్ నారాయణ్కు సమాచారం అందింది. ఎలాగైనా లీక్ చేయాలనుకున్నాడు. దీని కోసం తన స్నేహితుడు విశాల్ దుబే సాయం తీసుకున్నాడు. అదే ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్న సునీల్ రఘువంశీ, విశాల్ స్నేహితులు కావడం రాజీవ్కు కలిసొచ్చింది. ఇద్దరూ కలిసి సునీల్ను ప్రలోభపెట్టారు. గతంలో విశాల్ దుబే, సునీల్ ఒకే కాలేజీలో చదువుకోవడం వల్ల అతడిని ఒప్పించడం చాలా సులువైంది. వృత్తిరీత్యా ఓ కన్సల్టేషన్ కార్యాలయంలో పని చేస్తున్న విశాల్, సుభాష్ ప్రకాశ్తో కలిసి వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను చేరుస్తుండేవారు. ఈ నలుగురు పేపర్ను లీక్ చేసేందుకు పన్నాగం పన్నారు.
ఆర్వో/ఏఆర్వో ప్రశ్నపత్రం ప్రింటింగ్కు రాగానే సునీల్ మిగతా ముగ్గురికీ సమాచారం అందించాడు. కాపీలు కావాలంటే రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. క్వచన్ పేపర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే అవకాశం ఉన్నందున అభ్యర్థులు వాటి ఫొటోలు తీసుకోరాదని షరతు విధించాడు. దీనికి మిగతావారంతా అంగీకరించారు. సరైన అవకాశం కోసం సునీల్ వేచి చూశాడు. ప్రింటింగ్ మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఆ పేపర్ను చించేస్తారు. పక్కా ప్రణాళిక ప్రకారం మెషీన్లో సునీల్ సమస్య సృష్టించి.. పేపర్ను చించేసినట్లు నటించి.. అధికారుల కళ్లుగప్పి రహస్యంగా ఇంటికి తీసుకొచ్చేశాడు. మిగతా ముగ్గురికి సమాచారం అందించాడు.
ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు
ఈలోగా ఉత్తర్ప్రదేశ్కు చెందిన వివేక్ ఉపాధ్యాయ, బిహార్కు చెందిన అమర్జీత్ అనే ఇద్దరు ఏజెంట్లు.. అభ్యర్థులను గుర్తించి, వారి ఉద్యోగహామీ ఇచ్చి.. ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. ఫిబ్రవరి 8న.. అంటే అంటే పరీక్షకు మూడు రోజుల ముందు ఓ హోటల్కు వారందర్నీ పిలిపించారు. ప్రశ్నపత్రంతో సునీల్ హోటల్కు చేరుకున్న తర్వాత సుభాష్ ప్రకాశ్ కొంత మంది సాయంతో ‘కీ’ తయారు చేయించాడు. ప్రశ్నపత్రంలోని అంకెల వరుస క్రమంలో ‘కీ’ని యథాతథంగా గుర్తుంచుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ‘కీ’ ఫొటోలను మాత్రమే అభ్యర్థులకు ఇచ్చి వారందరికీ హోటల్ లోనే ఆశ్రయం కల్పించారు. పరీక్ష రాసిన వారిలో సుభాష్ ప్రకాశ్ కూడా ఉన్నాడు.
డబ్బు మీద ఆశతో..
అయితే, డబ్బుమీద ఆశతో రాజీవ్ నారాయణ్ మిశ్రా.. ప్రశ్నపత్రం ఫొటోలను రవి అత్రి మరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశాడు. అతడు మరికొందరికి పంపడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలు వైరల్గా మారాయి. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని యూపీ పోలీసులు వెల్లడించారు. మరోవైపు యూపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నపత్రాన్ని కూడా రాజీవ్ నారాయణ్ మిశ్రా, రవి అత్రిలే లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే వీరిద్దర్నీ అరెస్టు చేసి మేరఠ్ జైల్లో ఉంచారు.
రివ్యూ ఆఫీసర్/ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పరీక్షకు 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 60వేల యూపీ పోలీస్కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దాదాపు 47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైనట్లు రుజువు కావడంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివిన విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా జగన్నాథుడి రథయాత్ర
జై జగన్నాథ్ నామస్మరణ, జయజయద్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవోపేతంగా సాగింది. -
ఉరిమిన వరుణుడు.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య ప్రాంతాల్లో కుంభవృష్టి వానలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. -
స్నాక్స్ అంటే లొట్టలేస్తాం.. లేబుల్ చదివాకే పొట్టలోకేస్తాం
భారతీయుల్లో ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై శ్రద్ధ పెరుగుతోంది. 73 శాతం మంది తాము చిరుతిళ్లు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్పై ముద్రించిన ముడి పదార్థాల (ఇంగ్రిడియంట్స్) జాబితా, పోషక విలువల వివరాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నట్లు ‘ది హెల్దీ స్నాకింగ్ రిపోర్ట్-2024’ నివేదిక తేల్చింది. -
ఉత్తర భారతంలో తరుగుతున్న పాతాళగంగ
ఉత్తర భారత దేశం.. 2002 నుంచి 2021 మధ్య దాదాపు 450 క్యూబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోయిందని తాజా అధ్యయనం పేర్కొంది. -
బిహార్లో మరో వంతెన కూలింది: తేజస్వీ
బిహార్లో మరో వంతెన కూలిపోయినట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. తూర్పు చంపారన్ జిల్లాలో కూలిన ఓ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
రూ.10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా
ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని రూ.10లక్షలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
లోకోపైలట్ల పరిస్థితిని పార్లమెంటులో లేవనెత్తుతాం
రైల్వే లోకోపైలట్ల సమస్యల్ని విపక్ష ఇండియా కూటమి పార్లమెంటులో లేవనెత్తుతుందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. -
310 పందులను చంపిన కేరళ
ఆఫ్రికన్ స్వైన్ జ్వరం (ఏఎస్ఎఫ్) వ్యాప్తిని కట్టడిచేసేందుకు కేరళ ప్రభుత్వం దాదాపు 310 పందులను చంపింది. ఏఎస్ఎఫ్ను తొలుత త్రిశూర్ జిల్లాలోని మతకథరన్ గ్రామంలో గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. -
నీట్-యూజీపై నేటి నుంచి సుప్రీంలో విచారణ
వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్-యూజీ 2024పై సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. -
ఖల్సా రాజ్ కలలు కనడం నేరం కాదు
‘ఖల్సా రాజ్’ కలలను నిజం చేసుకునేందుకు లక్షలాది సిక్కులు తమ జీవితాలను త్యాగం చేశారని, ఆ విధమైన కలలు కనడం నేరం కాదని సిక్కు అతివాద బోధకుడు, ఖడూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు అమృత్పాల్ సింగ్ అన్నారు. -
మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్లలో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకి పెరిగింది. -
సంక్షిప్త వార్తలు
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకర పోస్టు చేశారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘శివసేన’ నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలయ్యింది. -
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు CUET-UG పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తే ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి జులై 15 నుంచి 19 మధ్య కాలంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇంజినీరింగ్ ఫీజుల ఖరారు
-
చంద్రబాబుతోనే హైదరాబాద్ అభివృద్ధి: సినీ నటుడు సుమన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/07/24)
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ