- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Agnipath: అగ్నిపథ్ నిరసనల మధ్య కేంద్రం కీలక నిర్ణయం
సైనికుల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
దిల్లీ: సైనికుల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్ (Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు (Agnipath Protests) వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరుల (Agniveers)కు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్ (Assam Rifles) నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.
అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరుల (Agniveers)కు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది. ఫలితంగా తొలిబ్యాచ్ అగ్నివీరుల (Agniveers)కు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్ (Agnipath)కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే.
(ఇదీ చదవండి: అగ్నిపథ్పై ఎందుకింత అలజడి?)
పారామిలిటరీ బలగాలుగా వ్యవహరించే సరిహద్దు భద్రతా దళం (BSF), కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (CRPF), ఇండో-టిబెటన్ సహరిద్దు పోలీసులు (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF)తో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డు (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (SPG)ను కలిపి కేంద్ర సాయుధ బలగాలు (CAPF)గా పేర్కొంటారు. కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం.. సీఏపీఎఫ్ (CAPF), అస్సాం రైఫిల్స్ (Assam Rifles)లో ప్రస్తుతం 73,219 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో మరో 18,124 ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన తాత్కాలిక నియామక విధానం ‘అగ్నిపథ్’ (Agnipath)పై నిరసనలు శుక్రవారం మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. యువకుల ఆగ్రహంతో రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. నిరసనకారులు పోలీసులతోనూ బాహాబాహీకి దిగారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తోపాటు సైనిక ఉద్యోగార్థులు పలు రాష్ట్రాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పంటించారు. రహదారులపై, రైలు మార్గాల్లో బైఠాయించారు. ప్రభుత్వ ఆస్తులపై రాళ్ల దాడులకూ పాల్పడ్డారు. బిహార్, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, హరియాణాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 234 రైలు సర్వీసులు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్ణాటకలో నాయకత్వ మార్పు..? సీఎం ఏమన్నారంటే!
సీఎం పదవి నుంచి వైదొలగి డీకే శివకుమార్కు మార్గం సుగమం చేయాలని వక్కలిగ వర్గానికి చెందిన ఓ పీఠాధిపతి సిద్ధరామయ్యకు ఇటీవల విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
కుండపోత వర్షాలు.. ఏడు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
రానున్న ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. మొత్తం 7 రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. -
పరువు నష్టం కేసులో ఎదురు దెబ్బ.. ఎంపీకి 50లక్షల జరిమానా
పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది. -
‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్
Mahua Moitra: లోక్సభలో తనపై బహిష్కరణ వేటు వేసిన భాజపాకు ప్రజలు గట్టి సమాధానం చెప్పారని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా అన్నారు. 63 మంది ఎంపీలను ఇంటికి పంపించారన్నారు. -
రాహుల్ దాడి భాజపాపై మాత్రమే: ప్రియాంక గాంధీ
రాహుల్ గాంధీ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని భాజపా చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కొట్టిపడేశారు. -
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!
కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టాలు న్యాయ వ్యవస్థలో మార్పునకు కీలక ముందడుగుగా కొందరు అభివర్ణించగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?
Rahul Gandhi: లోక్సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మోదీజీ ఎప్పుడూ సీరియస్గా ఎందుకు ఉంటారని అడగ్గా.. ప్రధాని దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. -
పరువునష్టం కేసు.. మేధా పాట్కర్కు అయిదు నెలల జైలుశిక్ష
ఓ పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ కోర్టు అయిదు నెలల జైలుశిక్ష విధించింది. -
మైక్ కట్ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా
ప్రతిపక్ష నేతల మైక్లను సభాపతి కట్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం సరికాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) పేర్కొన్నారు. -
ఇది రాహుల్కి కఠిన పరీక్ష.. అనురాగ్ ఠాకూర్ విమర్శలు
లోక్సభ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికవ్వడం ఆయనకు కఠిన పరీక్షతో సమానమని భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. -
భద్రతా పరమైన సవాళ్లు స్వీకరించడానికి ఆర్మీ సిద్ధంగా ఉంది: జనరల్ ద్వివేది.
దేశానికి ఎదురయ్యే ఎటువంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది పేర్కొన్నారు. -
మోదీ అంతరిక్షంలోకి వెళ్లగలరా? - ఇస్రో చీఫ్ ఏమన్నారంటే!
‘గగన్యాన్’ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పేర్కొన్నారు. -
లోక్సభలో రాహుల్ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం
దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
కొత్త నేర చట్టాలపై విపక్షాలది అనవసర ఆరోపణే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కొత్త నేర చట్టాల(New criminal laws)పై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వాటిపై ఆందోళన చెందుతున్న నేతలతో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమిత్ షా (Amit Shah) తెలిపారు. -
ధన్ఖడ్, ఖర్గే సంభాషణ.. సభలో నవ్వులే నవ్వులు!
రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన సరదా సంభాషణతో సభలో నవ్వులు విరబూశాయి. -
జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ అనుమతి
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ జైల్లో ఉండటంతో ఇంజినీర్ రషీద్ (Engineer Rashid ).. ఎంపీగా ప్రమాణం చేయలేకపోయారు. దీనిపై ఎన్ఐఏ స్పందించింది. -
‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు
New Criminal Laws: తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. వాటిని బలవంతంగా అమల్లోకి తీసుకొస్తున్నారని ఆరోపించాయి. -
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సభ్యులంతా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. -
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
పశ్చిమ బెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా కొడుతున్న వీడియో వైరల్గా మారింది. దీనిపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. -
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
NEET-UG 2024: నీట్ రీటెస్ట్ ఫలితాలను ఎన్టీఏ సోమవారం విడుదల చేసింది. దీంతోపాటు నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులు సవరించినట్లు వెల్లడించింది. -
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)(Bharatiya Nyay Sanhita) కింద తొలి కేసు నమోదు అయింది. దిల్లీలో ఓ వీధి వ్యాపారిపై పోలీసులు ఈ కేసు పెట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాగజ్నగర్లో తల్లీ ముగ్గురు కూతుళ్ల ఆత్మహత్యాయత్నం
-
కర్ణాటకలో నాయకత్వ మార్పు..? సీఎం ఏమన్నారంటే!
-
ఆ సైనికుల మరణం తీవ్రంగా కలచివేసింది: చంద్రబాబు
-
మహ్మద్ అబు సల్మియాను విడుదల చేసిన ఇజ్రాయెల్
-
ప్రాణం తీసిన ‘రాంగ్ రూట్’.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి
-
కుండపోత వర్షాలు.. ఏడు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్