- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pune Porsche Case: పుణె కారు ప్రమాదం కేసులో బాంబే హైకోర్టు తీర్పు
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పుణె కారు ప్రమాదం కేసులో నిందితుడిని తక్షణమే బెయిల్పై విడుదల చేయాలని బాంబే హైకోర్టు అనూహ్య తీర్పు వెలువరించింది.
పుణె: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పుణె కారు ప్రమాదం కేసులో (Pune Porsche Case) బాంబే హైకోర్టు (Bombay High Court) అనూహ్య తీర్పు వెలువరించింది. నిందితుడిని తక్షణమే బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ భారతి దాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్పాండేలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం అబ్జర్వేషన్ హోంలో ఉన్న నిందితుడిని విడుదల చేయాలంటూ అతడి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ‘‘ మనమంతా చట్టానికి, జువైనల్ జస్టిస్ లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. కేసులో తీవ్రత ఉన్నప్పటికీ చట్ట విరుద్ధంగా మైనర్లను పెద్దవారి మాదిరిగా పరిగణించకూడదు’’ అని పేర్కొంది.
నిందితుడిని అబ్జర్వేషన్ హోమ్లో నిర్బంధిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) ఇచ్చిన ఆదేశాలు చట్టవిరుద్ధమని, అధికార పరిధిని దాటి ఆదేశాలిచ్చారని కోర్టు అభిప్రాయపడింది. జేజేబీ ఆదేశాల ప్రకారం నిందితుడు పునరావాసంలో, మానసిక నిపుణుడి పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పిన న్యాయస్థానం.. సీసీఎల్ చట్టానికి లోబడి అతడి వయసును కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. టీనేజర్ బంధువుల తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ వాదనలు వినిపిస్తూ జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం.. పిల్లల్ని నిర్బంధించకూడదని కోర్టుకు తెలిపారు. చట్ట విరుద్ధంగా అతడిని బంధించారని వెంటనే విడుదల చేసేలా ఆదేశించాలని కోరారు.
మే 19 అర్ధరాత్రి పుణెలో టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ఇంజినీర్లు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కేసు జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుటకు రాగానే 300 పదాలతో వ్యాసరచన చేయమనడం, 15 గంటలు ట్రాఫిక్ పోలీసులకు సాయం..తదితర నిబంధనలతో తక్షణమే బెయిల్ ఇచ్చేసింది. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో తిరిగి నిందితుడిని తిరిగి అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్కు తరలించారు. ఈ క్రమంలో నిందితుడి తరఫు బంధువులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఏ నిబంధనల ప్రకారం జేజేబీ బెయిల్ ఆర్డర్ను సవరించిందని ప్రశ్నించింది. బోర్డు సవరించిన బెయిల్ ఆర్డర్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు కూడా హైకోర్టులో ఎలాంటి దరఖాస్తు చేయలేదని ధర్మాసనం పేర్కొంది.
ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. కారకుడిగా భావిస్తున్న టీనేజర్ కూడా గాయపడినట్లు ధర్మాసనం ప్రస్తావించింది.‘‘ ఇది ఎలాంటి రిమాండ్?ఏ అధికారంతో నిందితుడికి మళ్లీ రిమాండ్ విధించారు. ఓ వ్యక్తికి తొలుత బెయిల్ మంజూరు చేసి, మళ్లీ రిమాండ్కు పంపడం ఏంటి? దీనికి ఏ విధానాన్ని అవలంబించారు?’’ అని కోర్టు ప్రశ్నించింది. బెయిల్ మంజూరైన వ్యక్తిని మళ్లీ అబ్జర్వేషన్ హోంలో ఉంచడం నిర్బంధం కాదా? అని నిలదీసింది. ఏ అధికారంతో ఆదేశిలిచ్చారని, జువైనల్ జస్టిస్ బోర్డు దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైస్ ఛాన్సలర్ కాదు.. ఇకపై ‘కులగురు’.. మధ్యప్రదేశ్ నిర్ణయం!
విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ పదవి పేరును ‘కులగురు’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
స్పీకర్పై రాహుల్ ఆరోపణలు.. మండిపడ్డ అధికార పక్షం
ప్రధాని మోదీ ముందు వంగి స్పీకర్ ఓం బిర్లా నమస్కరించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. -
ఎన్ని విభేదాలున్నా.. దేశమంతా ఒక్కటే: మోహన్ భాగవత్
దేశ ప్రజల ఐక్యతను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కొనియాడారు. ఎన్ని విభేదాలున్నా.. శత్రుదేశాలు దాడులకు యత్నించినప్పుడు దేశమంతా ఒక్కటవుతుందన్నారు. -
రాహుల్ VS రాజ్నాథ్.. అగ్నిపథ్పై మాటల తూటాలు
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా అగ్నిపథ్ పథకంపై లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య మాటల తూటాలు పేలాయి. -
రైళ్ల టైమ్ టేబుల్ యథాతథం.. డిసెంబర్ 31వరకు పాతదే వర్తింపు
రైళ్ల రాకపోకలకు సంబంధించిన టైమ్టేబుల్ వివరాల్లో ఎటువంటి మార్పు లేదని.. డిసెంబర్ 31, 2024 వరకు ప్రస్తుతమున్న కాలపట్టికే కొనసాగుతుందని భారతీయ రైల్వే వెల్లడించింది. -
కర్ణాటకలో నాయకత్వ మార్పు..? సీఎం ఏమన్నారంటే!
సీఎం పదవి నుంచి వైదొలగి డీకే శివకుమార్కు మార్గం సుగమం చేయాలని వక్కలిగ వర్గానికి చెందిన ఓ పీఠాధిపతి సిద్ధరామయ్యకు ఇటీవల విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
కుండపోత వర్షాలు.. ఏడు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
రానున్న ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. మొత్తం 7 రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. -
పరువు నష్టం కేసులో ఎదురు దెబ్బ.. ఎంపీకి 50లక్షల జరిమానా
పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఎదురు దెబ్బ తగిలింది. -
‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్
Mahua Moitra: లోక్సభలో తనపై బహిష్కరణ వేటు వేసిన భాజపాకు ప్రజలు గట్టి సమాధానం చెప్పారని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా అన్నారు. 63 మంది ఎంపీలను ఇంటికి పంపించారన్నారు. -
రాహుల్ దాడి భాజపాపై మాత్రమే: ప్రియాంక గాంధీ
రాహుల్ గాంధీ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని భాజపా చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కొట్టిపడేశారు. -
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!
కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టాలు న్యాయ వ్యవస్థలో మార్పునకు కీలక ముందడుగుగా కొందరు అభివర్ణించగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?
Rahul Gandhi: లోక్సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మోదీజీ ఎప్పుడూ సీరియస్గా ఎందుకు ఉంటారని అడగ్గా.. ప్రధాని దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. -
పరువునష్టం కేసు.. మేధా పాట్కర్కు అయిదు నెలల జైలుశిక్ష
ఓ పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ కోర్టు అయిదు నెలల జైలుశిక్ష విధించింది. -
మైక్ కట్ చేస్తున్నాననడం సరికాదు.. ఇది గౌరవానికి సంబంధించిన అంశం: ఓం బిర్లా
ప్రతిపక్ష నేతల మైక్లను సభాపతి కట్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం సరికాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) పేర్కొన్నారు. -
ఇది రాహుల్కి కఠిన పరీక్ష.. అనురాగ్ ఠాకూర్ విమర్శలు
లోక్సభ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికవ్వడం ఆయనకు కఠిన పరీక్షతో సమానమని భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. -
భద్రతా పరమైన సవాళ్లు స్వీకరించడానికి ఆర్మీ సిద్ధంగా ఉంది: జనరల్ ద్వివేది.
దేశానికి ఎదురయ్యే ఎటువంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది పేర్కొన్నారు. -
మోదీ అంతరిక్షంలోకి వెళ్లగలరా? - ఇస్రో చీఫ్ ఏమన్నారంటే!
‘గగన్యాన్’ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పేర్కొన్నారు. -
లోక్సభలో రాహుల్ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం
దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
కొత్త నేర చట్టాలపై విపక్షాలది అనవసర ఆరోపణే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కొత్త నేర చట్టాల(New criminal laws)పై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వాటిపై ఆందోళన చెందుతున్న నేతలతో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమిత్ షా (Amit Shah) తెలిపారు. -
ధన్ఖడ్, ఖర్గే సంభాషణ.. సభలో నవ్వులే నవ్వులు!
రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన సరదా సంభాషణతో సభలో నవ్వులు విరబూశాయి. -
జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ అనుమతి
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ జైల్లో ఉండటంతో ఇంజినీర్ రషీద్ (Engineer Rashid ).. ఎంపీగా ప్రమాణం చేయలేకపోయారు. దీనిపై ఎన్ఐఏ స్పందించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్పీకర్పై రాహుల్ ఆరోపణలు.. మండిపడ్డ అధికార పక్షం
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ
-
ఎన్ని విభేదాలున్నా.. దేశమంతా ఒక్కటే: మోహన్ భాగవత్
-
పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. సీఎం చంద్రబాబు సీరియస్
-
ఈనాడు.నెట్ టాప్ 10 వార్తలు @ 9 PM
-
లెదర్ ఫినిష్తో రియల్మీ నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్