- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Heavy Rains: దిల్లీ.. తల్లడిల్లి
భారీ వర్షాలతో దేశ రాజధాని దిల్లీ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి నగరంలో కుండపోత వర్షం మొదలై పలు ప్రాంతాల్లో వరదనీరు ఉప్పొంగింది.
దేశ రాజధాని నగరంలో వర్షబీభత్సం
24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం
విమానాశ్రయ పైకప్పు కూలి ఒకరు...
విద్యుదాఘాతం, నీటమునిగి నలుగురి దుర్మరణం
దేశీయంగా పలు విమాన సర్వీసుల రద్దు
సమీక్షించిన మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు కూలి ధ్వంసమైన ట్యాక్సీలు
దిల్లీ: భారీ వర్షాలతో దేశ రాజధాని దిల్లీ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి నగరంలో కుండపోత వర్షం మొదలై పలు ప్రాంతాల్లో వరదనీరు ఉప్పొంగింది. 24 గంటల్లో ఏకంగా 228 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పులో కొంతభాగం కూలి ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోహిణీ కాలనీలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి (39) మృతిచెందగా.. వసంత్ విహార్ వద్ద నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఉస్మాన్పుర్ ప్రాంతంలో వర్షపునీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు, షాలిమార్ బాగ్ అండర్పాస్ వద్ద నిలిచిన నీటిలో మునిగి మరో యువకుడు మృతిచెందారు. రోడ్లపై మైళ్ల దూరం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రగతి మైదాన్తోపాటు పలుచోట్ల కీలక ప్రాంతాల్లో ఉన్న సొరంగ మార్గాలను మూసివేశారు. దిల్లీ రైల్వేస్టేషనులో, పలు మెట్రోస్టేషన్ల వద్ద మోకాటిలోతు వరదనీరు చేరింది. నగరంలో చాలాచోట్ల విద్యుత్తు లైన్లు, స్తంభాలు కూలిపోగా.. ముందు జాగ్రత్తగా సరఫరాను నిలిపివేశారు. ఆజాద్పుర్ వంతెన కింద చిక్కుకుపోయిన ఓ బస్సు నుంచి 21 మంది ప్రయాణికులను అగ్నిమాపకశాఖ సిబ్బంది కాపాడారు. దిల్లీ, నొయిడా, గురుగ్రామ్ పరిసరాల్లో గురువారం నుంచీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి. తీవ్రమైన వేడి వాతావరణం తర్వాత ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు దిల్లీలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దిల్లీ సర్కారు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది.
మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు
రద్దీగా ఉండే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పులో కొంతభాగం కూలి ట్యాక్సీలపై పడింది. ఈ ప్రమాదంలో రమేశ్కుమార్ (45) అనే ట్యాక్సీ డ్రైవరు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో దేశీయంగా విమానాలు తిరిగే టెర్మినల్-1 నుంచి బయలుదేరాల్సిన అన్ని సర్వీసులను తదుపరి నోటీసు జారీ చేసేవరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పందించారు. తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. టెర్మినల్-1 ప్రయాణికులందరికీ తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాలని వారిపై అదనపు భారం పడకుండా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడ్డవారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అన్ని విభాగాల అధికారులతో మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో నిర్మాణాల సామర్థ్యాన్ని తనిఖీ చేసి, అయిదు రోజుల్లోపు నివేదికలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
నేరపూరిత నిర్లక్ష్యం: కాంగ్రెస్
దిల్లీ విమానాశ్రయ ఘటన గత పదేళ్ల మోదీ సర్కారు అవినీతి, నేరపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. నాసిరకం నిర్మాణంతో కూలిన టెర్మినల్ను ఇటీవలే ప్రధాని మోదీ ప్రారంభించారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆరోపించారు. ఈ విమర్శలపై మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ..‘‘ఈరోజు కూలింది పాత భవనంలోని పైభాగం. దానిని 2009లో నిర్మించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం అవతలివైపు ఉంది. సాంకేతిక కమిటీ అన్నీ తనిఖీ చేస్తుంది. మంత్రిత్వశాఖ, డీజీసీఏ విడివిడిగా దర్యాప్తు చేస్తాయి’’ అని వెల్లడించారు.
88 ఏళ్ల తర్వాత మళ్లీ అత్యధిక వర్షం
శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయానికి.. 24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు దిల్లీలోని సఫ్దర్జంగ్ వాతావరణ కేంద్రం తెలిపింది. 1936 జూన్ 24న దిల్లీలో 235.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. 88 ఏళ్ల తర్వాత.. శుక్రవారం నమోదైనదే జూన్ నెలలో మళ్లీ అత్యధిక వర్షపాతం. దిల్లీలో వారాంతపు రోజుల్లో భారీ నుంచి అతి భారీవర్షం కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ఎంపీని ఎత్తుకొని వచ్చి.. కారులో కూర్చోబెట్టారు
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కోసం ఎంపీలంతా దిల్లీలోనే ఉన్నారు. వారిలో కొందరి నివాసాలు వర్షపునీటిలో చిక్కుకుపోయాయి. నగరంలో నీటిఎద్దడి పరిష్కారానికి ఇటీవల నిరాహారదీక్ష చేసిన ఆప్ నేత, దిల్లీ జలమంత్రి ఆతిశీ ఇంటి చుట్టూ నీరు చేరింది. ఇంట్లోకి నీరు చేరి వస్తువులన్నీ పాడైనట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. మరో ఎంపీ మనీశ్ తివారీ (కాంగ్రెస్) సైతం తన ఇంటి చుట్టూ చేరిన వరదనీటి వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్గోపాల్ యాదవ్కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. లోథి ఎస్టేట్ ప్రాంతంలోని ఆయన నివాసం వద్ద వర్షపునీరు నిలవడంతో సిబ్బంది ఎంపీని ఎత్తుకొనివచ్చి కారులో కూర్చోబెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.