- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Mamata Banerjee: అగ్గి రాజేసిన ‘వీధి న్యాయం’... మమతపై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు
ఇటీవల పశ్చిమబెంగాల్లోని చోప్రాలో ఓ వ్యక్తితోపాటు మహిళను నడిరోడ్డుపై చావబాదిన ఘటన రాష్ట్రంలో అగ్గి రాజేస్తోంది. గవర్నర్ ఆనంద్బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కోల్కతా: అక్రమ సంబంధం ఆరోపణతో ఓ వ్యక్తితో పాటు మహిళను నడి రోడ్డుపై చావబాదిన ఘటన పశ్చిమబెంగాల్లో (West Bengal) అగ్గి రాజేస్తోంది. దీనిని కారణంగా చూపుతూ.. గవర్నర్ ఆనంద్ బోస్ (Anand Bose).. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (Mamata Benarjee) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఎంబీ కాక్టైల్’తో రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడుతున్నాయని విమర్శించారు. తొలుత బాధితురాలని పరామర్శించేందుకు ఆమె ఇంటికి వెళ్లాలని నిర్ణయించిన గవర్నర్.. పోలీసుల సూచన మేరకు ఆగిపోయారు. బాధితురాలు ప్రస్తుతం ఒంటరిగా ఉండాలని కోరుకుంటోందని అధికారులు తెలియజేయడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ‘‘ బాధిత మహిళ ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం అందింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించి నేను వెళ్లలేదు. ఆమె రాజ్భవన్కు ఎప్పుడైనా రావొచ్చు. లేదంటే నేను వెళ్లేందుకైనా సిద్ధమే’’ అని గవర్నర్ మీడియాకు తెలిపారు.
ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల బాధితులను చాలా మందిని కలిశానని, వారితో మాట్లాడినప్పుడు వారు తమ బాధలు తనతో పంచుకున్నారని గవర్నర్ తెలిపారు. వారందరి మాటలు విన్న తర్వాత సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో నడుస్తున్న ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని అర్థమైందన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ధనబలం, రాజకీయ బలం, ప్రభుత్వం అండతో సంఘ వ్యతిరేక శక్తులు పేట్రేగిపోతున్నాయని విమర్శించారు. మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ.. ‘ఎంబీ కాక్టెయిల్’ బెంగాల్ పరిస్థితిని దెబ్బతీస్తోంది. హింస ఆనవాయితీగా మారింది. దీనికి హోం మంత్రి, పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. పౌరుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్న సంగతి పాలకులు గుర్తుంచుకోవాలి’’ అని విమర్శించారు.
ఆరోపణలెందుకు.. బిల్లులు ఆమోదించండి: తృణమూల్
మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలను తృణమూల్ కీలక నేత కునాల్ ఘోష్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చౌకబారు విమర్శలు చేశారని అన్నారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి భాష ఉపయోగించడం సరికాదన్నారు. సీఎంను విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా.. గతంలో అసెంబ్లీ రూపొందించిన బిల్లులను ఆమోదించి ఉంటే.. ఈ తరహా ఘటనలు చోటు చేసుకొని ఉండేవి కాదని, ఒక వేళ జరిగినా శిక్షలు చాలా కఠినంగా ఉండేవని అన్నారు. తాజా ఘటనపై అధికార పక్షానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే రెహ్మన్.. తన అనుచరుడైన తేజ్ముల్ను వెనకేసుకొచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి శాంతను సేన్ మాట్లాడుతూ.. చోప్రా తరహా ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ తృణమూల్ పార్టీగానీ, ప్రభుత్వంగానీ సహించబోదని చెప్పారు. ఇప్పటికే నిందితుడిపై కేసు నమోదైందని, చట్టప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇటీవల ఉత్తర్దీనాజ్పుర్లోని చోప్రాలో మహిళతోపాటు మరో వ్యక్తిని నడిరోడ్డుపై చావబాదిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సుమోటోగా తీసుకున్న పోలీసులు నిందితుడు తేజ్ముల్ అలియాస్ జేసీబీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏదైనా వివాదం తన దగ్గరకు వస్తే అప్పటికప్పుడు నచ్చినట్లు తీర్పు చెప్పి.. నడి రోడ్డుపై భౌతికంగా హింసిస్తాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమ సంబంధం కారణంగానే వీరిద్దరినీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ క్రమంలో అసెంబ్లీలో భాజపా ప్రతిపక్షనేత సువేందు అధికారి మరోవీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ కేసులోనూ తేజ్ముల్ నిందితుడేనని పేర్కొన్నారు. చోప్రా ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు జాతీయ మహిళా కమిషన్ కూడా లేఖ రాసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీబీఐ అధికారులు మరో అరెస్టు చేశారు. -
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!
హాథ్రస్ దుర్ఘటన వెనక అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆరోపిస్తూ భోలే బాబా ఓ ప్రకటన విడుదల చేశాడు. -
దర్శన్ ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్.. పేరెంట్స్పై కేసు!
విచారణ ఖైదీగా ప్రస్తుతం జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కేటాయించిన ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్ చేసిన ఓ జంట చిక్కుల్లో పడింది. -
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
వర్షం కురవడంతో పైకప్పు నుంచి వందేభారత్లోకి నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వేశాఖ ఏమందంటే..? -
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ రాధాకృష్ణన్కు అందించారు. -
‘డంక్డ్ రైస్ కేక్’..ఇడ్లీ అనుకున్నానే..!: హర్ష గొయెంకా పోస్ట్ వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘జికా’ వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ
మహారాష్ట్రలో పలుచోట్ల జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది. -
అవినీతిపై పోరు.. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: మోదీ
మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపించడంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. అవినీతిపరులను వదిలేది లేదన్నారు. -
ఆ రాష్ట్రంలో కుప్పకూలుతున్న వంతెనలు.. 15 రోజుల్లో ఏడు!
భారీ వర్షాల నేపథ్యంలో బిహార్లో గడిచిన 15 రోజుల్లో ఏడు బ్రిడ్జిలు కూలిపోయాయి. -
అదొక భయానక అనుభవం..ఎయిర్లైన్స్పై ప్రయాణికుడి పోస్టు
విస్తారా ఎయిర్లైన్స్ సేవలపై ఓ ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
జులై 5న ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృత్పాల్ సింగ్
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) జులై 5 లోక్సభ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మరో ఎంపీ సరభ్జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు. -
జైలుకెళ్లి.. బాబాగా మారి.. ‘భోలే’ పాదధూళి కథేంటీ?
Hathras Stampede: హాథ్రస్ తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన భోలే బాబా గతంలో ఓ లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లినట్లు తెలుస్తోంది. -
హాథ్రస్ తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ: సీఎం యోగి ప్రకటన
హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ జరపనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. -
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
సర్వైకల్ క్యాన్సర్ నివారణ మార్గాలపై అవగాహన కల్పించేలా ఎంపీ సుధామూర్తి (Sudha Murty) రాజ్యసభలో ప్రసంగించారు. దానిపై మోదీ(Modi) స్పందించారు. -
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
మణిపుర్పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం
PM Modi: మణిపుర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ అంశంపై రాజకీయాలు చేయడం ఇకనైనా ఆపాలని విపక్షాలకు గట్టిగా చెప్పారు. -
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం
కాంగ్రెస్ను ‘పరాన్న జీవి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. 2021లో రైతులు నిరసన చేపట్టినప్పుడు అదే మాట అన్నారని, మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారన్నారు. -
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
కాంగ్రెస్ (Congress), విపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు భాజపా (BJP) వీడియోల రూపంలో కౌంటర్ వచ్చింది. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది. -
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
PM Modi: రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో ఛైర్మన్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నీట్ వివాదం.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
నీట్ పరీక్షల అవకతవకలపై విమర్శలు చెలరేగుతోన్న సమయంలో దానిని రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామాలపై నటుడు విజయ్ (Vijay) స్పందించారు. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
Hathras stampede: హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్పించకుండా పోయిన భోలే బాబా కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కలకలం రేపిన ఏపీఎండీసీ దస్త్రాలు దహనం.. పెద్దిరెడ్డి అనుచరులపై అనుమానం
-
నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు
-
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా
-
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశం: సినీనటుడు నరేశ్
-
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. మార్చి 1న భారత్-పాక్ మ్యాచ్!
-
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!