- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రోజువారీ మరణాల్లో 7శాతం వాయు కాలుష్యం వల్లే
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది.
దిల్లీ: దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. 2008 నుంచి 2019 మధ్య పదకొండేళ్ల కాలంలో సంభవించిన దాదాపు 36 లక్షల మరణాలను విశ్లేషించారు. రోజువారి మరణాలు, వాయు కాలుష్యం మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయమై అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబయి, పుణె, శిమ్లా, వారణాసిలలో కొనసాగించిన ఈ అధ్యయనంలో అంతర్జాతీయ నిపుణులతో పాటు భారత శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పది నగరాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని నివేదిక వెల్లడించింది. సంవత్సరంలో 99.8 శాతం రోజులు ఇదే పరిస్థితి ఉంటోందని తెలిపింది. మెషీన్ లెర్నింగ్ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా పీఎం 2.5 రేణువుల స్థాయులను అంచనా వేశారు.
- పీఎం 2.5 స్థాయిలు ప్రతి ఘనపు మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు 1.42 శాతం అధికమైనట్లు అధ్యయనం గుర్తించింది. పది నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలిపింది. విడివిడిగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీగానే ఉందని పేర్కొంది. పీఎం 2.5 రేణువులు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాలు దిల్లీలో 0.31 శాతం, బెంగళూరులో 3.06 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది.
- దేశ రాజధాని దిల్లీలో సగటున ప్రతీ ఏడాది 11.5 శాతం మరణాలు (11,964) వాయు కాలుష్యం కారణంగా సంభవించాయని తెలిపారు. దేశంలో అత్యధిక మరణాలు ఈ మహానగరంలోనే నమోదయ్యాయి.
- శిమ్లాలో అత్యల్పంగా 59 మంది మరణించారు. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో ఇది 3.7 శాతానికి సమానం.
- హైదరాబాద్లో వాయు కాలుష్యం వల్ల 5.6 శాతం మరణాలు (1,597) సంభవించాయి.
వివిధ నగరాల్లో స్వల్పకాలంలో కాలుష్య ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం భారత్లో ఇదే తొలిసారని మరో పరిశోధకుడు భార్గవ్ కృష్ణ తెలిపారు. భారతీయుల ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావానికి సంబంధించి కీలక విషయాలు దీనివల్ల వెల్లడైనట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంజకోట్ ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు..గాయపడిన జవాన్
రాజౌరి జిల్లాలోని మంజకోట్ ఆర్మీ క్యాంపు సమీపంలో శనివారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
ఉత్తరాఖండ్ గర్వాల్ డివిజన్లో భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. -
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
గుజరాత్ రాష్ట్రం సూరత్లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. సూరత్లోని పాల్ ప్రాంతంలో శనివారం ఆరంతస్తుల భవనం కూలింది. -
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్రను ఆదివారం నిర్వహించనున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా... -
శారీరకంగా దృఢంగా ఉన్నా: దలైలామా
తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని.. బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బౌద్ధ గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసుకొని కోలుకుంటున్నారు. -
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్ను కుర్చీలోంచి బయటకు లాగేసిన సిబ్బంది
పేపర్ లీక్ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఓ ప్రిన్సిపల్ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. ఆమె ఫోన్ లాగేసుకొని, కుర్చీ నుంచి లేపి, బలవంతంగా బయటకు పంపారు. -
అనంత్, రాధికల సంగీత్ వేడుకలో.. జస్టిన్ బీబర్, బాలీవుడ్ తారల తళుకు
దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట అనంత్ - రాధికల ముందస్తు పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ‘సంగీత్’ కార్యక్రమంలో కెనడాకు చెందిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (30)తోపాటు బాలీవుడ్ తారలు సల్మాన్ఖాన్, రణవీర్ సింగ్, -
తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు సిద్ధం
తూర్పు లద్ధాఖ్లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్’ సిద్ధమైంది. తాజాగా దీనిపై పరీక్షలు మొదలయ్యాయి. -
23న కేంద్ర బడ్జెట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. -
సూరత్లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం
గుజరాత్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ పట్టణంలోని పాల్ ప్రాంతంలో శనివారం ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల్లో పలువురు చిక్కుకుపోయారు. -
కేజ్రీవాల్పైనే దర్యాప్తు జరుగుతోంది
మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 15 వరకు న్యాయస్థానం పొడిగించింది. -
దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరు
హాథ్రస్ తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని వివాదాస్పద సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబా పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి అండగా ఉంటామని చెప్పారు. -
ఖరారు కాని నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలు
వైద్యవిద్యకు సంబంధించిన 2024 నీట్ యూజీ, పీజీ కోర్సుల కౌన్సెలింగు షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఇంకా నోటిఫై చేయలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం స్పష్టం చేసింది. -
నలుగురు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం
జమ్మూకశ్మీర్లో శనివారం రెండు వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు సైనికులూ ప్రాణాలు కోల్పోయారు. -
సంక్షిప్త వార్తలు
వ్యవసాయ మార్కెట్లలో అనధీకృత వ్యక్తులు వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్, మార్కింగ్ పనులు చేస్తే జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
సీసీటీవీల అవినీతి కేసులో మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై దర్యాప్తు
దేశ రాజధాని దిల్లీ నగరంలో సీసీటీవీల ఏర్పాటులో అవినీతి జరిగిందనే ఆరోపణలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా అనుమతించారు. -
లోకోపైలట్లతో రాహుల్ భేటీపై వివాదం
రైల్వే డ్రైవర్ల (లోకోపైలట్ల)తో లోక్సభ విపక్షనేత రాహుల్గాంధీ భేటీఅయి వారి సమస్యలపై చర్చించడం కాస్త వివాదానికి తావిచ్చింది. కొత్తదిల్లీ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాహుల్తో మాట్లాడిన డ్రైవర్లంతా బయటివారేనని, -
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలో అత్యధికంగా 214.6మి.మీ వర్షపాతం నమోదైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘లోన్ యాప్’తో జాగ్రత్త.. ప్రభుత్వం హెచ్చరిక
-
మంజకోట్ ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు..గాయపడిన జవాన్
-
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
-
సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్ఆర్ ఆంజనేయులు చక్కర్లు
-
ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్ సేన్