- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
నీట్-యూజీని రద్దు చేయొద్దు
పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన 56 మంది విద్యార్థులు
దిల్లీ: పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్-యూజీ (2024)లో అక్రమాలు జరిగినందున ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటివరకు 26 పిటిషన్లు సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. వీటిపై ఈ నెల 8న సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్న నేపథ్యంలో తాజా పిటిషన్ దాఖలైంది. ‘‘పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయతీగా, కష్టపడి చదివే విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుంది. విద్యాహక్కు ఉల్లంఘనకూ దారితీస్తుంది. అందుకే నీట్-యూజీని రద్దు చేయకుండా కేంద్రంతోపాటు ఎన్టీఏకు ఆదేశాలివ్వాలి’’ అని గుజరాత్కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్లాతోపాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా జగన్నాథుడి రథయాత్ర
జై జగన్నాథ్ నామస్మరణ, జయజయద్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవోపేతంగా సాగింది. -
ఉరిమిన వరుణుడు.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య ప్రాంతాల్లో కుంభవృష్టి వానలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. -
స్నాక్స్ అంటే లొట్టలేస్తాం.. లేబుల్ చదివాకే పొట్టలోకేస్తాం
భారతీయుల్లో ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై శ్రద్ధ పెరుగుతోంది. 73 శాతం మంది తాము చిరుతిళ్లు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్పై ముద్రించిన ముడి పదార్థాల (ఇంగ్రిడియంట్స్) జాబితా, పోషక విలువల వివరాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నట్లు ‘ది హెల్దీ స్నాకింగ్ రిపోర్ట్-2024’ నివేదిక తేల్చింది. -
ఉత్తర భారతంలో తరుగుతున్న పాతాళగంగ
ఉత్తర భారత దేశం.. 2002 నుంచి 2021 మధ్య దాదాపు 450 క్యూబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోయిందని తాజా అధ్యయనం పేర్కొంది. -
బిహార్లో మరో వంతెన కూలింది: తేజస్వీ
బిహార్లో మరో వంతెన కూలిపోయినట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. తూర్పు చంపారన్ జిల్లాలో కూలిన ఓ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
రూ.10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా
ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని రూ.10లక్షలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
లోకోపైలట్ల పరిస్థితిని పార్లమెంటులో లేవనెత్తుతాం
రైల్వే లోకోపైలట్ల సమస్యల్ని విపక్ష ఇండియా కూటమి పార్లమెంటులో లేవనెత్తుతుందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. -
310 పందులను చంపిన కేరళ
ఆఫ్రికన్ స్వైన్ జ్వరం (ఏఎస్ఎఫ్) వ్యాప్తిని కట్టడిచేసేందుకు కేరళ ప్రభుత్వం దాదాపు 310 పందులను చంపింది. ఏఎస్ఎఫ్ను తొలుత త్రిశూర్ జిల్లాలోని మతకథరన్ గ్రామంలో గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. -
నీట్-యూజీపై నేటి నుంచి సుప్రీంలో విచారణ
వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్-యూజీ 2024పై సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. -
ఖల్సా రాజ్ కలలు కనడం నేరం కాదు
‘ఖల్సా రాజ్’ కలలను నిజం చేసుకునేందుకు లక్షలాది సిక్కులు తమ జీవితాలను త్యాగం చేశారని, ఆ విధమైన కలలు కనడం నేరం కాదని సిక్కు అతివాద బోధకుడు, ఖడూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు అమృత్పాల్ సింగ్ అన్నారు. -
మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్లలో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకి పెరిగింది. -
సంక్షిప్త వార్తలు
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకర పోస్టు చేశారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘శివసేన’ నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలయ్యింది. -
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు CUET-UG పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తే ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి జులై 15 నుంచి 19 మధ్య కాలంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది.