‘మెదడును తినే అమీబా’ వ్యాధితో కేరళలో బాలుడి మృతి

‘మెదడును తినే అమీబా (అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌)’ అనే అరుదైన వ్యాధి బారిన పడి కేరళలో 14 ఏళ్ల మృదుల్‌ అనే ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు.

Published : 05 Jul 2024 05:21 IST

కోజికోడ్‌: ‘మెదడును తినే అమీబా (అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌)’ అనే అరుదైన వ్యాధి బారిన పడి కేరళలో 14 ఏళ్ల మృదుల్‌ అనే ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి అతడు తుదిశ్వాస విడిచాడు. కలుషిత జలాల్లో ఉండే అమీబా బ్యాక్టీరియా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌ వ్యాధి సోకుతుంది. బాలుడు కోజికోడ్‌లోని ఓ చిన్న కొలనులో ఇటీవల దిగాడని, ప్రస్తుతం అక్కడ నివారణ చర్యలు చేపడుతున్నామని ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. ఈ ఏడాది మేలో మలప్పురంలో ఐదేళ్ల ఓ బాలిక, జూన్‌లో కన్నూర్‌లో 13 ఏళ్ల మరో బాలిక కూడా ఇదే వ్యాధితో మరణించడం గమనార్హం. 2017, 2023ల్లో అలప్పుళ జిల్లాలో అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌ కేసులు నమోదయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని