- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సూరజ్ పాలే భోలే బాబా!
అతడు తన చేతితో నీరు ఇస్తే సమస్యలు తీరుతాయట.. అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకినా ఆశీర్వాదం అట.. ఉత్తరప్రదేశ్కు చెందిన ‘భోలే బాబా’ను అనుసరించేవారి నమ్మిక ఇది.
లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లిన మాజీ పోలీసు
బయటకొచ్చాక ఆధ్యాత్మివేత్త అవతారం
యూపీలో మెయిన్పురిలో భారీ ఆశ్రమం
కాస్గంజ్: అతడు తన చేతితో నీరు ఇస్తే సమస్యలు తీరుతాయట.. అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకినా ఆశీర్వాదం అట.. ఉత్తరప్రదేశ్కు చెందిన ‘భోలే బాబా’ను అనుసరించేవారి నమ్మిక ఇది. అందుకే ఆయన పాద ధూళి కోసం ఎగబడిన భక్తులు దురదృష్టవశాత్తూ అదే మట్టిలో కలిసిపోయారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనతో ఈ బాబా పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఇంతకీ ఎవరాయన? పోలీసు శాఖలో పనిచేసి.. లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లిన వ్యక్తి బాబాగా ఎలా మారాడు?
18 ఏళ్ల పాటు పోలీసుశాఖలో..
యూపీకి చెందిన నారాయణ్ సాకార్ హరి.. సాకార్ విశ్వ హరి, ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. అతడి అసలు పేరు సూరజ్ పాల్. కాస్గంజ్ జిల్లా పటియాలి తహసీల్లోని బహదూర్నగర్ గ్రామానికి చెందిన అతడు.. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. చదువు పూర్తయిన తర్వాత రాష్ట్ర పోలీసు శాఖలో చేరి 18 ఏళ్ల పాటు పనిచేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాను ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినట్లు చెప్పుకునేవాడు. ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకుని ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. అతనికి సంతానం లేదు. దత్తత తీసుకున్న కుమార్తె 16-17 సంవత్సరాల క్రితం మరణించింది. ఎవరి నుంచి ఎప్పుడూ చందాలు కోరడని చుట్టుపక్కల గ్రామాలవారు పేర్కొంటుంటారు. ఆయనకు స్వచ్ఛందంగానే విరాళాలు అందుతుంటాయంటారు. భగవంతుడి గురించే ఆయన ఎప్పుడూ బోధిస్తుంటారని ఆయన గ్రామంలోని మహిళలు పేర్కొంటారు.
‘సమాజ హితం కోసం ఈ మార్గం’
అయితే, పోలీసు శాఖ నుంచి బయటకు వచ్చిన తర్వాత సూరజ్ పాల్ కొన్ని కేసులు ఎదుర్కొన్నట్లు యూపీ పోలీసు వర్గాలు తెలిపాయి. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో 1997లో అరెస్టయి కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడట..! ఆ తర్వాత బయటకు వచ్చి తన పేరును ‘సాకార్ విశ్వ హరి బాబా’గా మార్చుకున్నాడు. అనేక ప్రాంతాల్లో ఆశ్రమాలను నిర్వహిస్తున్నాడు. వాటిలో మెయిన్పురిలో ఆశ్రమం అతిపెద్దది. తనకు గురువు ఎవరూ లేరని, కేవలం సమాజహితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు. తనను తాను భగవంతుని అవతారంగా చెప్పుకుంటాడు.
నీళ్ల కోసం భక్తుల క్యూ..
అలీగఢ్తోపాటు హాథ్రస్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. కొన్నిసార్లు లక్షల్లో జనం వస్తుంటారు. ఉత్తర్ప్రదేశ్ కాకుండా ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ‘భోలే బాబా’కు లక్షల మంది అనుచరులు ఉన్నారు. ఇతడి కార్యక్రమాలను నిర్వహించే వారు నల్లటి దుస్తులు ధరించి ఎన్ఎస్జీ కమాండో మాదిరిగా ఉంటారు. వీరిని ‘సేవాదర్ ఆర్మీ’గా పిలుస్తుంటారు. సాధారణంగా ఆశ్రమంలో నిర్వహించే సత్సంగ్ కార్యక్రమాల్లో భక్తులకు నీటిని పంపిణీ చేస్తుంటారు. అవి తాగితే సమస్యలన్నీ తొలగిపోతాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అతడి ఆశ్రమంలో ఓ చేతిపంపు ఉంటుంది. దాన్ని పవిత్ర జలంగా భావించి ఆ నీరు తీసుకునేందుకు భక్తులు క్యూ కడుతుంటారు. భోలే బాబా ఎప్పుడూ తెల్లటి సూట్ ధరించి టోపీ పెట్టుకుని కన్పిస్తాడు. ఏ కార్యక్రమానికి వచ్చినా భార్య వెంట ఉండాల్సిందే. కొవిడ్ సమయంలో అతడి పేరు తొలిసారిగా దేశమంతా వినిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహువాపై ఎఫ్ఐఆర్కు ఎన్సీడబ్ల్యూ ఆదేశం
జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖాశర్మపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు!
వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి.. అల్ప, మధ్యాదాయ దేశా (ఎల్ఎంఐసీ)ల్లోని చిన్నారుల పాలిట శాపమవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. -
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామనీ, పెండింగు కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సూచించారు. -
వంతెనలు కూలిన ఘటనలో..16 మంది ఇంజినీర్లపై వేటు వేసిన బిహార్
బిహార్లో వరుస వంతెనలు కూలిపోతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు. -
సింగరేణి నైనిబ్లాక్కు అనుమతులపై కిషన్రెడ్డి హర్షం
ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు గని తవ్వకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపట్ల కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. -
స్వలింగ వివాహాలకు గుర్తింపు నిరాకరించిన తీర్పు సమీక్షకు అభ్యర్థన
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించటానికి నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబరు 17న వెలువరించిన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. -
వైద్యులకు రక్షణ కల్పించండి
వైద్య పరంగా నేరపూరిత నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారి వైద్యులకు రక్షణ కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 26వ సెక్షన్ను వినియోగించేలా చూడాలని భారత వైద్య మండలి (ఐఎంఏ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. -
భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. -
పుణె కారు ప్రమాదం.. రోడ్డు భద్రతపై వ్యాసాన్ని సమర్పించిన మైనర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కారు ప్రమాదంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడు(17) శుక్రవారం రోడ్డు ప్రమాదంపై 300 పదాల వ్యాసాన్ని బాల నేరస్థుల న్యాయ మండలి(జేజేబీ)కి సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు
ఖలిస్థాన్ అనుకూలవాది, ‘వారిస్ పంజాబ్ దే’ అధిపతి అమృత్పాల్ సింగ్, కశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్లు శుక్రవారం భారీ భద్రత నడుమ పార్లమెంటులో ఎంపీలుగా ప్రమాణం చేశారు. -
కర్ణాటక జలాశయాలకు వరద
ఎగువ కురుస్తున్న వర్షాలకు కన్నడనాట జలాశయాల్లోకి వరద చేరుతోంది. ముఖ్యంగా మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వానలకు తుంగ జలాశయానికి ప్రవాహాలు పెరిగాయి.