- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రుతుపవనాల సమయంలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రుతుపవనాల సమయంలో తీవ్రమైన తేమతో కూడిన వేడికి గురవుతున్న వారి సంఖ్య భారత్లో క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ రకమైన వాతావరణ ప్రభావానికి గురవతున్న వారి సంఖ్య 1951-2020 మధ్యకాలంలో 67 కోట్లకు చేరిందని తెలిపింది.
దేశ జీడీపీపై ప్రభావం చూపే అవకాశం
దిల్లీ: రుతుపవనాల సమయంలో తీవ్రమైన తేమతో కూడిన వేడికి గురవుతున్న వారి సంఖ్య భారత్లో క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ రకమైన వాతావరణ ప్రభావానికి గురవతున్న వారి సంఖ్య 1951-2020 మధ్యకాలంలో 67 కోట్లకు చేరిందని తెలిపింది. ఈ అధ్యయనంలో అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రుతుపవనాల కాలంలో తేమతో కూడిన ఉష్ణోగ్రతల పెరగడం.. ఉత్పాదకతపై తీవ్రప్రభావం చూపుతోందని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. సింధు-గంగా మైదాన ప్రాంతం ఈ తరహా వాతావరణానికి ఎక్కువ ప్రభావితమవుతోందని తెలిపింది. రుతుపవనాల సమయంలో వేడి పరిస్థితులు ప్రజల ఆరోగ్యానికి, కార్మికుల ఉత్పాదకతకు సవాలుగా నిలిచాయని పేర్కొంది. కార్మికుల పనిగంటలను మార్చాల్సిన అవసరం ఉందని తెలిపింది. ‘‘గ్లోబల్ వార్మింగ్ కారణంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగినా కార్మికుల ఉత్పాదకత 7 శాతం తగ్గుతుంది. తద్వారా భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4 శాతం తగ్గే అవకాశం ఉంది’’ అని అధ్యయన రచయితలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహువాపై ఎఫ్ఐఆర్కు ఎన్సీడబ్ల్యూ ఆదేశం
జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖాశర్మపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు!
వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి.. అల్ప, మధ్యాదాయ దేశా (ఎల్ఎంఐసీ)ల్లోని చిన్నారుల పాలిట శాపమవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. -
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామనీ, పెండింగు కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సూచించారు. -
వంతెనలు కూలిన ఘటనలో..16 మంది ఇంజినీర్లపై వేటు వేసిన బిహార్
బిహార్లో వరుస వంతెనలు కూలిపోతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు. -
సింగరేణి నైనిబ్లాక్కు అనుమతులపై కిషన్రెడ్డి హర్షం
ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు గని తవ్వకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపట్ల కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. -
స్వలింగ వివాహాలకు గుర్తింపు నిరాకరించిన తీర్పు సమీక్షకు అభ్యర్థన
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించటానికి నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబరు 17న వెలువరించిన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. -
వైద్యులకు రక్షణ కల్పించండి
వైద్య పరంగా నేరపూరిత నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారి వైద్యులకు రక్షణ కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 26వ సెక్షన్ను వినియోగించేలా చూడాలని భారత వైద్య మండలి (ఐఎంఏ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. -
భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. -
పుణె కారు ప్రమాదం.. రోడ్డు భద్రతపై వ్యాసాన్ని సమర్పించిన మైనర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కారు ప్రమాదంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడు(17) శుక్రవారం రోడ్డు ప్రమాదంపై 300 పదాల వ్యాసాన్ని బాల నేరస్థుల న్యాయ మండలి(జేజేబీ)కి సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు
ఖలిస్థాన్ అనుకూలవాది, ‘వారిస్ పంజాబ్ దే’ అధిపతి అమృత్పాల్ సింగ్, కశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్లు శుక్రవారం భారీ భద్రత నడుమ పార్లమెంటులో ఎంపీలుగా ప్రమాణం చేశారు. -
కర్ణాటక జలాశయాలకు వరద
ఎగువ కురుస్తున్న వర్షాలకు కన్నడనాట జలాశయాల్లోకి వరద చేరుతోంది. ముఖ్యంగా మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వానలకు తుంగ జలాశయానికి ప్రవాహాలు పెరిగాయి.