- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అనుమతి 80 వేలమందికి.. హాజరైంది 2.5 లక్షలు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 121కి చేరింది.
121కి చేరిన హాథ్రస్ మృతులు
తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో గుమిగూడిన స్థానికులు
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 121కి చేరింది. వీరిలో నలుగురిని ఇంకా గుర్తించాల్సి ఉంది. గాయపడిన వారు 28 మంది ఉన్నారు. ఈ విషాదం తర్వాత భోలే బాబా అలియాస్ జగత్ గురు సాకార్ విశ్వహరి ఆచూకీ తెలియరావట్లేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. జరిగిన దారుణంపై మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక సికంద్రరావ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ముఖ్య సేవాదార్ దేవ్ప్రకాశ్ మధుకర్, ఇతర నిర్వాహకుల పేర్లను చేర్చినా.. బాబా పేరును ఇందులో పొందుపరచలేదు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం.. హాథ్రస్ జిల్లా సికంద్రరావ్ ప్రాంతం ఫుల్రయీ, ముగల్గఢీ గ్రామాల మధ్యలోని జీటీ రహదారిని అనుకొని ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 80 వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు తేలింది. జనం కిక్కిరిసి ఊపిరాడని కారణంగానే మరణాలు సంభవించాయని శవపరీక్షల్లో తేలిందని ఎటాలోని జిల్లా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
సంఘటనలో గాయపడి ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయవిచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ తొక్కిసలాట వెనుక ‘కుట్ర కోణం’ కూడా ఉండిఉండొచ్చని యోగి అనుమానం వ్యక్తం చేశారు.
ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్
గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆదేశాల మేరకు హాథ్రస్ ఘటనపై దర్యాప్తునకు బుధవారం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయకమిషన్ను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వం వహించనున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారులు హేమంత్ రావు, భవేశ్ కుమార్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిషన్ రెండు నెలల వ్యవధిలోపు ప్రభుత్వానికి తన దర్యాప్తు నివేదికను సమర్పిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భర్త రాజకీయ కుట్రలో ఇరుక్కున్నారు: సునీత కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ శనివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. -
కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. 15 మందికి గాయాలు!
గుజరాత్లోని సూరత్లో ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. -
హాథ్రస్ ఘటన.. భోలేబాబాపై తొలికేసు
హాథ్రస్ తొక్కిసలాట (Hathras stampede)కు కారణమైన భోలేబాబాపై తొలికేసు నమోదైంది. అలాగే ఆయన ముఖ్యసేవాదర్ ఇటీవల పలువురు రాజకీయ నేతలను సంప్రదించినట్లు వెల్లడైంది. -
ఆమెది ప్రేమ.. అతడిది త్యాగం: వీరుడి భార్య కన్నీటి ప్రేమ కథా దృశ్యం..!
అమితమైన ప్రేమ, అంతులేని బాధ, వెలకట్టలేని త్యాగం.. కలగలిపి ఈ దృశ్యం. దీని వెనుక కన్నీటి కథ తెలిస్తే ప్రతి హృదయం ద్రవిస్తుంది. -
అగ్నివీరుల వయోపరిమితిని పెంచాలి: ఆర్మీ
అగ్నిపథ్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న అగ్నివీరుల వయోపరిమితి, సర్వీస్ పొడిగింపుపై ఆర్మీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నట్లుగా సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు. -
పేపర్ లీక్ ఆరోపణలు.. ప్రిన్సిపల్ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది
పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ఒక విద్యాసంస్థకు చెందిన ప్రిన్సిపల్ను బయటకు పంపినతీరు విమర్శలకు దారితీసింది. -
అనంత్- రాధిక సంగీత్లో టీ20 హీరోలకు గ్రాండ్ వెల్కమ్
Anant - Radhika: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో టీ20 ప్రపంచకప్ హీరోలకు అరుదైన గౌరవం లభించింది. -
అస్సాం అతలాకుతలం.. ఉప్పొంగుతున్న నదులు
వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు దీని కారణంగా 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. -
ఉత్తరాఖండ్లో కొండచరియల బీభత్సం.. ఇద్దరు హైదరాబాదీల మృతి
Landslides: ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతిచెందారు. వారు వెళ్తున్న బైక్పై కొండచరియలు విరిగిపడ్డాయి. -
కేరళలో ‘మెదడును తినే అమీబా’.. మరో కేసు నమోదు
‘మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్)’ అరుదైన వ్యాధి కేరళ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కాగా తాజాగా మరో కేసు నమోదైంది. -
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా..
NEET UG counselling: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా పడింది. -
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ సంగీత్ వేడుక అట్టహాసంగా జరిగింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. -
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
Hathras stampede: కొద్దిరోజుల క్రితం హాథ్రస్లో జరిగిన సత్సంగ్ తీవ్ర విషాదం నింపింది. దీనిపై తాజాగా ‘భోలేబాబా’(Bhole Baba) మీడియాతో మాట్లాడారు. -
మహువాపై ఎఫ్ఐఆర్కు ఎన్సీడబ్ల్యూ ఆదేశం
జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖాశర్మపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు!
వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి.. అల్ప, మధ్యాదాయ దేశా (ఎల్ఎంఐసీ)ల్లోని చిన్నారుల పాలిట శాపమవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. -
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామనీ, పెండింగు కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సూచించారు. -
వంతెనలు కూలిన ఘటనలో..16 మంది ఇంజినీర్లపై వేటు వేసిన బిహార్
బిహార్లో వరుస వంతెనలు కూలిపోతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు. -
సింగరేణి నైనిబ్లాక్కు అనుమతులపై కిషన్రెడ్డి హర్షం
ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు గని తవ్వకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపట్ల కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. -
స్వలింగ వివాహాలకు గుర్తింపు నిరాకరించిన తీర్పు సమీక్షకు అభ్యర్థన
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించటానికి నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబరు 17న వెలువరించిన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
బ్లూ లైన్లో యుద్ధ మేఘాలు.. ఐరాస తీవ్ర ఆందోళన
-
కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. 15 మందికి గాయాలు!
-
14 ఏళ్లుగా ప్రధాని.. పదవి నుంచి దిగి సైకిల్పై ఇంటికి..
-
ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం.. 10 అంశాలపై చర్చ
-
హాథ్రస్ ఘటన.. భోలేబాబాపై తొలికేసు