- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషను అవసరం
‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు.
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం
అభినందించిన ప్రధాని మోదీ
దిల్లీ: ‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. రచయిత్రిగా, దాతగా సుపరిచితురాలైన సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలిగా చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్య సమస్యలను తన ప్రసంగంలో ఆమె ప్రస్తావించారు. దీనిపై ప్రధానమంత్రి స్పందించారు. బుధవారం ఎగువసభకు వచ్చిన నరేంద్ర మోదీ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుమునుపు గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణ మార్గాలపై అందరికీ అవగాహన కల్పించేలా సుధామూర్తి ప్రసంగించారు. ‘‘9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సినేషను చేయవచ్చు. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ను అడ్డుకోవచ్చు. చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి.. అమ్మాయిల మెరుగైన భవిష్యత్తు కోసం ఆ వ్యాక్సిన్ అందివ్వాలి’’ అని ప్రభుత్వాన్ని కోరారు. సుధామూర్తి ప్రసంగాన్ని ఉద్దేశించి బుధవారం సభలో మోదీ మాట్లాడారు. ‘‘మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలు. గత పదేళ్లకాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించింది. శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశాం. గర్భిణులకు వ్యాక్సినేషను తీసుకువచ్చాం’’ అని తెలిపారు. కాగా, గర్భాశయ క్యాన్సర్ను అదుపు చేయడానికి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు టీకాలు వేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహువాపై ఎఫ్ఐఆర్కు ఎన్సీడబ్ల్యూ ఆదేశం
జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖాశర్మపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు!
వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి.. అల్ప, మధ్యాదాయ దేశా (ఎల్ఎంఐసీ)ల్లోని చిన్నారుల పాలిట శాపమవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. -
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామనీ, పెండింగు కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సూచించారు. -
వంతెనలు కూలిన ఘటనలో..16 మంది ఇంజినీర్లపై వేటు వేసిన బిహార్
బిహార్లో వరుస వంతెనలు కూలిపోతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు. -
సింగరేణి నైనిబ్లాక్కు అనుమతులపై కిషన్రెడ్డి హర్షం
ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు గని తవ్వకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపట్ల కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. -
స్వలింగ వివాహాలకు గుర్తింపు నిరాకరించిన తీర్పు సమీక్షకు అభ్యర్థన
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించటానికి నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబరు 17న వెలువరించిన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. -
వైద్యులకు రక్షణ కల్పించండి
వైద్య పరంగా నేరపూరిత నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారి వైద్యులకు రక్షణ కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 26వ సెక్షన్ను వినియోగించేలా చూడాలని భారత వైద్య మండలి (ఐఎంఏ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. -
భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. -
పుణె కారు ప్రమాదం.. రోడ్డు భద్రతపై వ్యాసాన్ని సమర్పించిన మైనర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కారు ప్రమాదంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడు(17) శుక్రవారం రోడ్డు ప్రమాదంపై 300 పదాల వ్యాసాన్ని బాల నేరస్థుల న్యాయ మండలి(జేజేబీ)కి సమర్పించారు. -
సంక్షిప్త వార్తలు
ఖలిస్థాన్ అనుకూలవాది, ‘వారిస్ పంజాబ్ దే’ అధిపతి అమృత్పాల్ సింగ్, కశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్లు శుక్రవారం భారీ భద్రత నడుమ పార్లమెంటులో ఎంపీలుగా ప్రమాణం చేశారు. -
కర్ణాటక జలాశయాలకు వరద
ఎగువ కురుస్తున్న వర్షాలకు కన్నడనాట జలాశయాల్లోకి వరద చేరుతోంది. ముఖ్యంగా మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వానలకు తుంగ జలాశయానికి ప్రవాహాలు పెరిగాయి.