- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
నీట్-యూజీని మళ్లీ నిర్వహించాలి
నీట్-యూజీ పరీక్షను రద్దు చేసి 24 లక్షల మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్షను నిర్వహించాలని పలు విద్యార్థి సంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. పరీక్షలో అవకతవకలపై భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
విద్యార్థి సంఘాల డిమాండ్
దిల్లీ: నీట్-యూజీ పరీక్షను రద్దు చేసి 24 లక్షల మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్షను నిర్వహించాలని పలు విద్యార్థి సంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. పరీక్షలో అవకతవకలపై భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోరాయి.
నీట్-యూజీని సమర్థంగా నిర్వహించలేకపోయిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)ను రద్దు చేయాలంటూ విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల జాతీయ నేతలంతా ఉమ్మడి తీర్మానంపై సంతకాలు చేశారు. దిల్లీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ..పరీక్షను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్టీఏ అసమర్థత లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ సమావేశాల చివరి రోజైన బుధవారం పార్లమెంటు వరకూ ప్రదర్శన నిర్వహించాలని విద్యార్థి సంఘాలు భావిస్తున్నాయి. కార్యక్రమంలో ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, సమాజ్వాదీ ఛాత్ర సభ, ఎన్ఎస్యూఐ నేతలు పాల్గొన్నారు.
- మరోపక్క ఎన్టీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొందరు విద్యార్థులు పటేల్ చౌక్ మెట్రో స్టేషన్కు చేరుకున్నారు. ‘కేంద్ర విద్యామంత్రిని బర్తరఫ్ చేయాలి’, ‘ఎన్టీఏను రద్దు చేయాలి’ అనే నినాదాలతో కూడిన బ్యానర్లు ధరించి వారంతా పార్లమెంటు దిశగా నిరసన ప్రదర్శనకు యత్నించగా దిల్లీ పోలీసులు డజనుకు పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
- నీట్-యూజీ, పీజీ, యూజీసీ-నెట్ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలను నిరసిస్తూ ‘ఇండియా ఎగైనెస్ట్ ఎన్టీఏ’ పేరిట పలు వామపక్ష విద్యార్థి సంఘాలు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న నిరవధిక దీక్ష మంగళవారానికి ఏడో రోజుకు చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. -
బ్రహ్మపుత్రి
వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియామారి చార్! -
కుటుంబాన్ని కలవవచ్చు.. దిల్లీ వదిలి వెళ్లకూడదు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. -
రోజువారీ మరణాల్లో 7శాతం వాయు కాలుష్యం వల్లే
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. -
మా అబ్బాయి పెళ్లికి రండి.. సోనియా కుటుంబాన్ని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దిల్లీలోని ఆమె 10 జన్పథ్ నివాసంలో గురువారం కలిశారు. -
నీట్-యూజీని రద్దు చేయొద్దు
పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆసుపత్రి నుంచి ఆడ్వాణీ డిశ్చార్జ్
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
అడ్డా కూలీలకు గౌరవమివ్వాలి
కాయ కష్టం చేసే అడ్డా కూలీలకు పూర్తి హక్కులను కల్పించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని, అది తన జీవిత లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
సుప్రీంకు క్షమాపణ చెప్పిన ఐఎంయే అధ్యక్షుడు
పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంపై చేసిన వ్యాఖ్యలకు ‘భారత వైద్య సంఘం’ (ఐఎంయే) అధ్యక్షుడు డాక్టర్ ఆర్.వి.అశోకన్ గురువారం బహిరంగ క్షమాపణ చెప్పారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
8 నుంచి మోదీ రష్యా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8-10 తేదీల్లో ఆయన రష్యాతోపాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది. -
బిహార్లో కూలిన మరో వంతెన
బిహార్లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. గురువారం సారణ్ జిల్లాలోని గండకీ నదిపై మరో వంతెన కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. -
‘మెదడును తినే అమీబా’ వ్యాధితో కేరళలో బాలుడి మృతి
‘మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్)’ అనే అరుదైన వ్యాధి బారిన పడి కేరళలో 14 ఏళ్ల మృదుల్ అనే ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. -
లోక్సభ విజేతల సగటు ఓట్లు 50.58%
లోక్సభ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో విజేతలు సగటున 50.58 శాతం ఓట్లను సాధించారని, గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2 శాతం మేర తగ్గినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఉభయ సభలను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రొరొగ్ చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సమావేశమైన సభలు తొలి విడతను పూర్తి చేసుకున్నట్లయింది. -
మోదీ ‘పరీక్షా పే చర్చ’ వర్చువల్గా పునఃసృష్టి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక పోర్టల్ రూపంలో వర్చువల్గా పునఃసృష్టించడానికి ఎన్సీఈఆర్టీ కసరత్తు ప్రారంభించింది. -
యుద్ధ స్వరూపం మారుతోంది
సాంకేతికంగా వస్తున్న మార్పులతో యుద్ధ రూపం వేగంగా మారుతోందని, దాన్ని అందుకోవడానికి సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలని భారత నూతన త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. -
మోదీ తండ్రిపై వ్యాఖ్యలు.. ఖేడా సమీక్ష పిటిషన్ కొట్టివేత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. -
అస్సాంలో వరద బీభత్సం
అస్సాంలో వరదల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తుతోంది. దీంతో గురువారం ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. -
కర్ణాటక-ఏపీ సరిహద్దుల సర్వే
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఏడు బీ-1 కేటగిరీ గనులను సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) గురువారం పరిశీలించింది. -
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?
గత 17 రోజుల్లో బిహార్లో 12 వంతెనలు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి ఇంజినీర్లు, గుత్తేదారులే కారణమని ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది.