- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మా అబ్బాయి మృతిచెందాక..మొత్తం రూ.1.08 కోట్లు అందాయి
విధి నిర్వహణలో మృతిచెందిన మహారాష్ట్రలోని బుల్ఢాణా జిల్లా పింపల్గావ్ సరాయీ గ్రామవాసి, ‘అగ్నివీర్’ అక్షయ్ గవాతే కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1.08 కోట్లు అందాయి.
‘అగ్నివీర్’ మృతుడి తండ్రి లక్ష్మణ్
లోక్సభలో చర్చ నేపథ్యంలో వెల్లడి
బుల్ఢాణా (మహారాష్ట్ర): విధి నిర్వహణలో మృతిచెందిన మహారాష్ట్రలోని బుల్ఢాణా జిల్లా పింపల్గావ్ సరాయీ గ్రామవాసి, ‘అగ్నివీర్’ అక్షయ్ గవాతే కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1.08 కోట్లు అందాయి. అక్షయ్ తండ్రి లక్ష్మణ్ గవాతే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 2023 అక్టోబరులో సియాచిన్ వద్ద విధుల్లో ఉన్నపుడు అక్షయ్ మృతిచెందారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ మాట్లాడుతూ ‘అగ్నిపథ్’ పథకం కింద భర్తీ అయిన అగ్నివీరులను ప్రభుత్వం వాడుకొని వదిలేసే కార్మికులుగా పరిగణిస్తోందని, కనీసం ‘అమరువీరుల’ హోదా కూడా వారికి ఇవ్వడం లేదని ధ్వజమెత్తిన విషయం విదితమే. ఈ విమర్శలకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ బదులిస్తూ విధి నిర్వహణలో మృతిచెందిన అగ్నివీరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ వాద, సంవాదాల నేపథ్యంలో అక్షయ్ గవాతే కుటుంబ వివరణ వెల్లడికావడం గమనార్హం. సోమవారం సాయంత్రం లక్ష్మణ్ గవాతే మీడియాతో మాట్లాడుతూ.. రూ.48 లక్షలు బీమా కవరేజీ కింద, రూ.50 లక్షలు కేంద్రం నుంచీ, రాష్ట్ర సర్కారు తరఫున మరో రూ.10 లక్షలు తమకు అందినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రి నుంచి ఆడ్వాణీ డిశ్చార్జ్
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
అడ్డా కూలీలకు గౌరవమివ్వాలి
కాయ కష్టం చేసే అడ్డా కూలీలకు పూర్తి హక్కులను కల్పించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని, అది తన జీవిత లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
సుప్రీంకు క్షమాపణ చెప్పిన ఐఎంయే అధ్యక్షుడు
పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంపై చేసిన వ్యాఖ్యలకు ‘భారత వైద్య సంఘం’ (ఐఎంయే) అధ్యక్షుడు డాక్టర్ ఆర్.వి.అశోకన్ గురువారం బహిరంగ క్షమాపణ చెప్పారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
8 నుంచి మోదీ రష్యా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8-10 తేదీల్లో ఆయన రష్యాతోపాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది. -
బిహార్లో కూలిన మరో వంతెన
బిహార్లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. గురువారం సారణ్ జిల్లాలోని గండకీ నదిపై మరో వంతెన కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. -
‘మెదడును తినే అమీబా’ వ్యాధితో కేరళలో బాలుడి మృతి
‘మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్)’ అనే అరుదైన వ్యాధి బారిన పడి కేరళలో 14 ఏళ్ల మృదుల్ అనే ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. -
బ్రహ్మపుత్రి
వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియామారి చార్! -
కుటుంబాన్ని కలవవచ్చు.. దిల్లీ వదిలి వెళ్లకూడదు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. -
లోక్సభ విజేతల సగటు ఓట్లు 50.58%
లోక్సభ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో విజేతలు సగటున 50.58 శాతం ఓట్లను సాధించారని, గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2 శాతం మేర తగ్గినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఉభయ సభలను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రొరొగ్ చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సమావేశమైన సభలు తొలి విడతను పూర్తి చేసుకున్నట్లయింది. -
మోదీ ‘పరీక్షా పే చర్చ’ వర్చువల్గా పునఃసృష్టి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక పోర్టల్ రూపంలో వర్చువల్గా పునఃసృష్టించడానికి ఎన్సీఈఆర్టీ కసరత్తు ప్రారంభించింది. -
యుద్ధ స్వరూపం మారుతోంది
సాంకేతికంగా వస్తున్న మార్పులతో యుద్ధ రూపం వేగంగా మారుతోందని, దాన్ని అందుకోవడానికి సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలని భారత నూతన త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. -
మోదీ తండ్రిపై వ్యాఖ్యలు.. ఖేడా సమీక్ష పిటిషన్ కొట్టివేత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. -
అస్సాంలో వరద బీభత్సం
అస్సాంలో వరదల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తుతోంది. దీంతో గురువారం ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. -
కర్ణాటక-ఏపీ సరిహద్దుల సర్వే
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఏడు బీ-1 కేటగిరీ గనులను సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) గురువారం పరిశీలించింది. -
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?
గత 17 రోజుల్లో బిహార్లో 12 వంతెనలు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి ఇంజినీర్లు, గుత్తేదారులే కారణమని ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది.