ఇదిగో క్రికెట్‌ చూస్తూ.. నేను హాయిగా ఉన్నా

తీవ్రజ్వరంతో గత వారం ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ నటుడు, ఆసన్‌సోల్‌ (పశ్చిమబెంగాల్‌) ఎంపీ శత్రుఘ్నసిన్హా (77) తన ఆరోగ్యం గురించి వచ్చిన వదంతులకు ఖండనగా కొన్ని చిత్రాలను విడుదల చేశారు.

Published : 03 Jul 2024 04:55 IST

నటుడు, ఎంపీ శత్రుఘ్నసిన్హా

ముంబయి: తీవ్రజ్వరంతో గత వారం ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ నటుడు, ఆసన్‌సోల్‌ (పశ్చిమబెంగాల్‌) ఎంపీ శత్రుఘ్నసిన్హా (77) తన ఆరోగ్యం గురించి వచ్చిన వదంతులకు ఖండనగా కొన్ని చిత్రాలను విడుదల చేశారు. సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఓ వర్గం సృష్టించిన వివాదాలకు, గందరగోళానికి దూరంగా కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి తాను ఉల్లాసంగా ఉన్నట్లు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయిక అయిన శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షీ సిన్హా వివాహం జూన్‌ నెలాఖరులో ఆమె సహనటుడైన ఇక్బాల్‌ జహీర్‌తో జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహంతో సిన్హా అనారోగ్యాన్ని ముడిపెడుతూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఆయన విడుదల చేసిన చిత్రాల్లో తన సన్నిహితులతో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తున్నట్లుగా ఉంది. ‘‘శనివారం రాత్రి బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూశా. మన జట్టు అద్భుత విజయం సాధించింది. మా అనుష్కాశర్మ (బాలీవుడ్‌ నటి) ‘హీరో’ విరాట్‌ కోహ్లి ప్రదర్శన అత్యద్భుతం’’ అని శత్రుఘ్నసిన్హా పోస్టులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని