- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు
18వ లోక్సభ తొలి సమావేశాలు ఒకరోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం సమాధానం ఇవ్వగానే...
ఒకరోజు ముందుగానే లోక్సభ నిరవధిక వాయిదా
విపక్ష అవాంతరాలపై తీర్మానం
దిల్లీ: 18వ లోక్సభ తొలి సమావేశాలు ఒకరోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం సమాధానం ఇవ్వగానే అది ఆమోదం పొందినట్లు సభాపతి ఓంబిర్లా ప్రకటించి, ఈ విషయాన్ని తెలిపారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమైతే బుధవారం కూడా సభ కొనసాగాల్సి ఉంది. ప్రధాని ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని ఖండిస్తూ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని హోంమంత్రి అమిత్షా బలపరిచారు. తర్వాత దానిని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. విపక్ష చర్యలు పార్లమెంటరీ నిబంధనల్ని తుంగలో తొక్కాయని అధికారపక్షం ధ్వజమెత్తింది. వాటి తీరును ఓంబిర్లా కూడా తప్పుపట్టారు. మణిపుర్కు చెందిన ఎంపీలను మాట్లాడేందుకు అనుమతించాలని ప్రధాని ప్రసంగం అనంతరం విపక్షాలు కోరాయి. ఇప్పటికే వారిలో ఒకరు మాట్లాడారని స్పీకర్ చెప్పారు. వెల్ వద్దకు వెళ్లాలని విపక్ష సభ్యులకు ప్రతిపక్ష నేత రాహుల్ చెప్పడాన్ని సభాపతి తప్పుపట్టి మందలించారు.
ఎంపీగా ప్రమాణం చేసేందుకు రషీద్కు పెరోల్
దిల్లీ: కశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు వీలుగా దిల్లీ కోర్టు ఆయనకు షరతులతో 2గంటల కస్టడీ పెరోల్కు అనుమతించింది. బారాముల్లా లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాపై రషీద్ గెలుపొందారు. జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్నారనే అభియోగాలతో 2017లో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం తిహాడ్ కారాగారంలో ఉన్న రషీద్... ఎంపీగా ప్రమాణం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా కస్టడీ పెరోల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ అభ్యంతరం తెలపకపోవడంతో ఈ నెల 5న ప్రమాణం చేసేందుకు వీలుగా రెండు గంటల కస్టడీ పెరోల్కు అనుమతిస్తున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ మంగళవారం తెలిపారు.
26న విచారణకు హాజరుకండి
పరువునష్టం కేసులో రాహుల్కు యూపీ న్యాయస్థానం ఆదేశం
సుల్తాన్పుర్: కేంద్రమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఈ నెల 26న కోర్టు ముందు విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఈ విచారణకు మంగళవారమే హాజరు కావాల్సి ఉన్నా.. పార్లమెంటు సమావేశాల కారణంగా రాహుల్ రాలేకపోయారు. విచారణకు తాజా తేదీని ఇవ్వాలన్న రాహుల్ తరఫు న్యాయవాది అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు.
సివిల్స్ ఆశావహుల కోసం నిర్మాణ్ పోర్టల్
ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
ఈనాడు, దిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సమాయత్తమయ్యే అభ్యర్థుల కోసం కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి మంగళవారం దిల్లీలోని తన కార్యాలయంలో నిర్మాణ్ పోర్టల్ను ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ కర్మయోగి పథకానికి అనుగుణంగా బొగ్గు సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో దీన్ని ఏర్పాటు చేశారు. సివిల్ ప్రాథమిక పరీక్షల్లో పాస్ అయిన వారిని మెయిన్స్, ఇంటర్వ్యూలకు సమాయత్తం చేసేందుకు వీలుగా ఈ పోర్టల్ను తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా బొగ్గు గనులున్న 39 జిల్లాల్లో సివిల్స్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, యువతులు, థర్డ్ జెండర్లకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రిలిమ్స్ పాసైన వారికి రూ.లక్ష ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న అభ్యర్థులు దీని ద్వారా ప్రయోజనం అందుకోవచ్చు.
భారత్ నుంచే కైలాస పర్వత దర్శనం
సెప్టెంబరు 15 నుంచి అనుమతి
ఫిథోరాగఢ్: టిబెట్లో ఉన్న కైలాస పర్వతాన్ని భారత భూ భాగం నుంచే దర్శించే అవకాశం భక్తులకు కలగనుంది. ఉత్తరాఖండ్ పిథోరాగఢ్ జిల్లా వ్యాస్వ్యాలీలో భూమికి 18,300 అడుగుల ఎత్తున ఉండే పాత లిపులేఖ్ పాస్ నుంచి కైలాస పర్వతం, ఓమ్ పర్వత్ స్పష్టంగా కనిపిస్తాయని జిల్లా పర్యాటక అధికారి కీర్తి చంద్ర ఆర్య పేర్కొన్నారు. సెప్టెంబరు 15 నుంచి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.
65 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకు బిహార్ ప్రభుత్వం
దిల్లీ: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతమున్న 50శాతం రిజర్వేషన్లను 65శాతానికి పెంచుకోవడం కోసం బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ పట్నా హైకోర్టు వెలువరించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. రాజ్యాంగం ప్రకారం 50శాతం కోటాను మించిన రిజర్వేషన్లు చెల్లవంటూ జూన్ 20న ఇచ్చిన తీర్పులో హైకోర్టు పేర్కొంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని కొట్టివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. దేశంలో తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. -
బ్రహ్మపుత్రి
వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియామారి చార్! -
కుటుంబాన్ని కలవవచ్చు.. దిల్లీ వదిలి వెళ్లకూడదు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. -
రోజువారీ మరణాల్లో 7శాతం వాయు కాలుష్యం వల్లే
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. -
మా అబ్బాయి పెళ్లికి రండి.. సోనియా కుటుంబాన్ని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దిల్లీలోని ఆమె 10 జన్పథ్ నివాసంలో గురువారం కలిశారు. -
నీట్-యూజీని రద్దు చేయొద్దు
పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆసుపత్రి నుంచి ఆడ్వాణీ డిశ్చార్జ్
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
అడ్డా కూలీలకు గౌరవమివ్వాలి
కాయ కష్టం చేసే అడ్డా కూలీలకు పూర్తి హక్కులను కల్పించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని, అది తన జీవిత లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
సుప్రీంకు క్షమాపణ చెప్పిన ఐఎంయే అధ్యక్షుడు
పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంపై చేసిన వ్యాఖ్యలకు ‘భారత వైద్య సంఘం’ (ఐఎంయే) అధ్యక్షుడు డాక్టర్ ఆర్.వి.అశోకన్ గురువారం బహిరంగ క్షమాపణ చెప్పారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
8 నుంచి మోదీ రష్యా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8-10 తేదీల్లో ఆయన రష్యాతోపాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది. -
బిహార్లో కూలిన మరో వంతెన
బిహార్లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. గురువారం సారణ్ జిల్లాలోని గండకీ నదిపై మరో వంతెన కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. -
‘మెదడును తినే అమీబా’ వ్యాధితో కేరళలో బాలుడి మృతి
‘మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్)’ అనే అరుదైన వ్యాధి బారిన పడి కేరళలో 14 ఏళ్ల మృదుల్ అనే ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. -
లోక్సభ విజేతల సగటు ఓట్లు 50.58%
లోక్సభ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో విజేతలు సగటున 50.58 శాతం ఓట్లను సాధించారని, గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2 శాతం మేర తగ్గినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఉభయ సభలను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రొరొగ్ చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సమావేశమైన సభలు తొలి విడతను పూర్తి చేసుకున్నట్లయింది. -
మోదీ ‘పరీక్షా పే చర్చ’ వర్చువల్గా పునఃసృష్టి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక పోర్టల్ రూపంలో వర్చువల్గా పునఃసృష్టించడానికి ఎన్సీఈఆర్టీ కసరత్తు ప్రారంభించింది. -
యుద్ధ స్వరూపం మారుతోంది
సాంకేతికంగా వస్తున్న మార్పులతో యుద్ధ రూపం వేగంగా మారుతోందని, దాన్ని అందుకోవడానికి సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలని భారత నూతన త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. -
మోదీ తండ్రిపై వ్యాఖ్యలు.. ఖేడా సమీక్ష పిటిషన్ కొట్టివేత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. -
అస్సాంలో వరద బీభత్సం
అస్సాంలో వరదల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తుతోంది. దీంతో గురువారం ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. -
కర్ణాటక-ఏపీ సరిహద్దుల సర్వే
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఏడు బీ-1 కేటగిరీ గనులను సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ఉన్నతాధికారుల సమితి(సీఈసీ) గురువారం పరిశీలించింది. -
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?
గత 17 రోజుల్లో బిహార్లో 12 వంతెనలు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి ఇంజినీర్లు, గుత్తేదారులే కారణమని ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది.