- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు
ప్రస్తుత రైల్వే టైం టేబుల్ను డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రైల్వే జోన్లు సర్క్యులర్లు జారీ చేశాయి. సవరించిన రైళ్ల రాకపోకల సమయాలను సూచించే టైం టేబుల్ను ఏటా జూన్ 30కి ముందు రైల్వే సంస్థలు విడుదల చేస్తుంటాయి.
రైల్వే టైం టేబుల్లో మార్పులు లేవు
దిల్లీ: ప్రస్తుత రైల్వే టైం టేబుల్ను డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రైల్వే జోన్లు సర్క్యులర్లు జారీ చేశాయి. సవరించిన రైళ్ల రాకపోకల సమయాలను సూచించే టైం టేబుల్ను ఏటా జూన్ 30కి ముందు రైల్వే సంస్థలు విడుదల చేస్తుంటాయి. జులై 1 నుంచి తదుపరి ఏడాది జూన్ 30 వరకూ నూతన టైం టేబుల్ అమల్లో ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం డిసెంబరు 31 వరకు ప్రస్తుత టైం టేబుల్నే కొనసాగించాలని రైల్వే బోర్డు 17 జోన్ల జనరల్ మేనేజర్లకు జూన్ 27న సర్క్యులర్ జారీ చేసింది.
నేడు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం
దిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో తొలిసారిగా మోదీ మంగళవారం సమావేశం కానున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలు భాజపాకు సొంతంగా దక్కకపోవడం, మిత్రపక్షాలపైనే ఆధారపడాల్సి రావడంతో ఈ సమావేశంలో ప్రధాని పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సీబీఐ అరెస్టుపై దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ సవాల్
దిల్లీలో మద్యం విధానం కుంభకోణం కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టులో సోమవారం సవాల్ చేశారు. అలాగే జూన్ 26న మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇవ్వాలన్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులనూ కేజ్రీవాల్ సవాల్ చేశారు. జూన్ 29న ట్రయల్ కోర్టు ఆయనను జులై 12 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను సీబీఐ జూన్ 26న తిహాడ్ జైలు నుంచి అరెస్టు చేసింది.
చైనా వాదనల్లో పస లేదు
ఆసియాలో పలు భూభాగాలు, సముద్ర జలాలు తమవేనంటూ చైనా వినిపిస్తున్న వాదనల్లో పస లేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినా.. చరిత్ర ప్రకారం పరిశీలించినా ఆ దేశ వాదనలు దాదాపుగా చెల్లవు. అందుకే- తైవాన్, దక్షిణ చైనా సముద్రం, హిమాలయాలు.. ఇలా ప్రతి అంశంలో చైనా వింతగా మాట్లాడుతుంటుంది. చారిత్రక ఆధారాలు లేనప్పటి నుంచీ అవన్నీ తమ సముద్ర, భూ భాగాలేనని చెబుతుంటుంది.
బ్రహ్మ చెలానీ, భౌగోళిక వ్యవహారాల నిపుణులు
పీఎల్ఐ పథకాన్ని చాలామంది సరిగా అర్థం చేసుకోలేదు!
కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్నవేళ- ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) కోసం భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. పీఎల్ఐ గురించి చాలామంది సరిగా అర్థం చేసుకోలేదని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఈ పథకం ప్రతి రంగంలోని సవాళ్లను పరిష్కరించేది కాదు. భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారబోయే కొన్ని రంగాల్లో ఐదేళ్లలో ఉత్పత్తి, పోటీతత్వాన్ని భారీగా పెంచేందుకు పీఎల్ఐని తీసుకొచ్చాం. భారత ఉత్పాదకతను అంతర్జాతీయ స్థాయికి పెంచాలన్నది దాని లక్ష్యం.
అమితాబ్ కాంత్, నీతీ ఆయోగ్ మాజీ సీఈవో
ఆ క్రిమినల్ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశాలెక్కువ
ఉద్యోగం/పెళ్లి పేరుతో మోసం చేసి లైంగిక సంబంధం పెట్టుకునే వ్యక్తులకు పదేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించేందుకు కొత్త క్రిమినల్ చట్టమొకటి వీలు కల్పిస్తోంది. ఇది ఆందోళనకర విషయమే! ఎందుకంటే ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పరస్పర సమ్మతితో కొనసాగించిన సంబంధాలనూ దీనిద్వారా నేరాలుగా చూపే ముప్పుంది. తగిన పరిశీలన/చర్చ లేకుండా ఇలాంటి క్రిమినల్ చట్టాలను ఆమోదించడమేంటి?
రాజ్దీప్ సర్దేశాయ్,పాత్రికేయుడు
పనిమనుషులకు కనీస మర్యాద ఇవ్వరు!
తమ ఇంట్లో పనిచేసేవారి విషయంలో శ్రమదోపిడీకి పాల్పడినందుకు హిందూజా కుటుంబానికి విదేశాల్లో జైలుశిక్ష ఖరారైంది. ఒకవేళ అవే ప్రమాణాలను మన దేశంలో వర్తింపజేస్తే ఏం జరుగుతుంది? ఎంతమంది యజమానులు దోషులుగా తేలుతారు? మనలో చాలామంది.. ఇళ్లలో పనిమనుషులకు కనీస మర్యాద ఇవ్వరు. వారికి సెలవులివ్వరు. వేతనాలూ పెంచరు.
వీర్ సాంఘ్వీ, పాత్రికేయుడు
నీట్-యూజీ ఓఎంఆర్ షీట్ అవకతవకలు..రెండు వారాల తరవాత విచారించనున్న సుప్రీంకోర్టు
దిల్లీ: వివాదాస్పద నీట్-యూజీ, 2024 ఓఎంఆర్ షీట్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై రెండు వారాల అనంతరం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. తన ఓఎంఆర్ షీట్ మారిపోయిందంటూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన పిటిషన్ జస్టిస్ సి.టి.రవికుమార్ నేతృత్వంలోని సెలవుకాల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై రెండు వారాల అనంతరం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
వైస్ ఛాన్సలర్ ఇకపై కులగురు
మధ్యప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం
భోపాల్: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ (ఉప కులపతి) పదవిని ‘కులగురు’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తుందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. అన్ని యూనివర్సిటీల వీసీలను ఇకపై కులగురువులుగా సంబోధించనున్నట్లు వెల్లడించారు. ‘ఉప కులపతి అనే పదం కొన్నిసార్లు ఇబ్బందులకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆ స్థానంలో ఉన్న మహిళల జీవిత భాగస్వాములను ఉప కులపతి భర్తలుగా పేర్కొనడం వారికి ఇబ్బందికరంగా మారింది’ అని సీఎం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గజరాజులకు అదిరిపోయే డెన్
ఆ ఆరు ఏనుగులకూ అక్కడ రాజభోగాలే... ఉదయమే కాసేపు నడక, వ్యాయామం. 8:30కు అరటి పండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, చెరకు గడలు, పుచ్చకాయలతో టిఫిన్. మధ్యాహ్నం గంటన్నర సేపు జలకాలాట. -
132 సీట్లతో విమానం తరహా బస్సులు అందుబాటులోకి తెస్తాం : గడ్కరీ
కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని.. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
అనుమతి 80 వేలమందికి.. హాజరైంది 2.5 లక్షలు
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 121కి చేరింది. -
గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషను అవసరం
‘‘ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే.. ఆసుపత్రి లెక్కలో అది ఒక మరణం. కానీ, ఆ కుటుంబానికి అది తీరని లోటు’’ అని మనసులో నాటుకుపోయేలా తన తండ్రి చెప్పిన మాటలను రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. -
సంఘ విద్రోహుల చర్య ఇది.. దర్యాప్తునకు సహకరిస్తా: భోలే బాబా
యూపీలో హాథ్రస్ దుర్ఘటన జరిగిన ఒకరోజు అనంతరం దానిపై భోలే బాబా స్పందించాడు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఆ తొక్కిసలాట చోటుచేసుకుందన్నాడు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆడ్వాణీ
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె.ఆడ్వాణీ (96) బుధవారం రాత్రి దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత వారం ఎయిమ్స్లో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. -
సూరజ్ పాలే భోలే బాబా!
అతడు తన చేతితో నీరు ఇస్తే సమస్యలు తీరుతాయట.. అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకినా ఆశీర్వాదం అట.. ఉత్తరప్రదేశ్కు చెందిన ‘భోలే బాబా’ను అనుసరించేవారి నమ్మిక ఇది. -
రుతుపవనాల సమయంలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రుతుపవనాల సమయంలో తీవ్రమైన తేమతో కూడిన వేడికి గురవుతున్న వారి సంఖ్య భారత్లో క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ రకమైన వాతావరణ ప్రభావానికి గురవతున్న వారి సంఖ్య 1951-2020 మధ్యకాలంలో 67 కోట్లకు చేరిందని తెలిపింది. -
కొవిడ్లో 3% అధికంగా.. బరువు తక్కువ శిశు జననాలు
భారత్లో కొవిడ్ మహమ్మారి సమయంలో బరువు తక్కువ శిశువుల జననాలు 3 శాతం అధికంగా నమోదైనట్లు ఓ అధ్యయనం పేర్కొంది. -
మణిపుర్ ప్రభుత్వాన్ని విశ్వసించలేం
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్లోని రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర సర్కారును విశ్వసించలేమంటూ జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం మండిపడింది. -
వందేభారత్ రైలులో వర్షపునీటి లీకేజీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందేభారత్ రైళ్లలోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. -
బిహార్లో ఒకే రోజు కుప్పకూలిన 3 వంతెనలు
నిర్మాణంలో ఉన్నవి..వినియోగంలో ఉన్నవి.. పాతవి అనే తేడా లేకుండా బిహార్లో వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. బుధవారం ఏకంగా మూడు వారధులు నేలమట్టమయ్యాయి. -
రాహుల్గాంధీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు
మితవాద గ్రూపులు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఝార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్!
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. -
నీట్ అక్రమాలపై శిరోముండనంతో నిరసన
‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ బుధవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి. -
సంక్షిప్త వార్తలు
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ప్రదేశ్, మణిపుర్లను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రాల్లోని నదుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరడంతో వరద ఉద్ధృతి పెరిగింది. -
ఐదుగురు నిపుణుల కమిటీని నియమించండి
హాథ్రస్ ఘటనపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ఐదుగురు నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
మీ మానసిక పరిస్థితి బాగానే ఉందా!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా 2018లో తాను పైలట్గా ఉన్న ఎయిరిండియా విమానం కూల్చివేసి, జాతీయ భద్రతను అస్థిరపరచాలని ప్రయత్నించినట్లు కెప్టెన్ దీపక్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. -
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై 5న హైకోర్టులో విచారణ
మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ మోపిన అవినీతి కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఈ నెల 5న విచారణ జరపనుంది. -
దేశాల సమన్వయంతోనే గ్రహాల రక్షణ వ్యవస్థ: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) నుంచి భూమి సహా ఇతర గ్రహాలను రక్షించే వ్యవస్థను ఏ దేశమూ ఒంటరిగా రూపొందించలేదని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. -
ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారంట్, ప్లే గ్రౌండ్.. ఎక్కడో తెలుసా?
ఒడిశా అటవీ శాఖ ఏనుగుల కోసం వాటి శిక్షణా కేంద్రంలో సకల సౌకర్యాలు కల్పించింది. రెస్టారంట్, బాతింగ్ ఏరియాతో పాటు అనేక సదుపాయాలు సమకూర్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
-
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?