ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్‌పీ ప్రదర్శన

లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్‌’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ప్రదర్శన నిర్వహించింది.

Published : 01 Jul 2024 05:08 IST

దిల్లీ: లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్‌’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ప్రదర్శన నిర్వహించింది. ఆయన తీరు వేరే దేశానికి విధేయత చూపినట్లుగా ఉందని ఓ ప్రకటనలో వీహెచ్‌పీ పేర్కొంది. గతంలో ‘భారత్‌మాతాకీ జై’ అనేందుకు అంగీకరించని ఒవైసీ మన రాజ్యాంగాన్ని అవమానించారని తెలిపింది. అయిదుసార్లు ఎంపీగా గెలిచిన ఒవైసీని అనర్హుడిగా ప్రకటించేలా చట్టపరంగా ఉన్న అవకాశాలను సైతం వీహెచ్‌పీ పరిశీలిస్తోంది. జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో వీహెచ్‌పీ యువజన విభాగం, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని