- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు (5)
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు బైడెన్, ట్రంప్ మధ్య జరిగిన తొలి చర్చకు సంబంధించి అందరూ అంగీకరిస్తున్నది ఒక్కటే.. ట్రంప్ ముందు బైడెన్ తేలిపోయారని. అయితే బైడెన్ తాను చెప్పాలనుకున్న ముఖ్య విషయాలను స్పష్టంగానే వివరించారు.
అమెరికాకు సమర్థులైన అధ్యక్ష అభ్యర్థుల కరవు!
ఇయాన్ బ్రెమ్మర్, రాజకీయ విశ్లేషకులు
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు బైడెన్, ట్రంప్ మధ్య జరిగిన తొలి చర్చకు సంబంధించి అందరూ అంగీకరిస్తున్నది ఒక్కటే.. ట్రంప్ ముందు బైడెన్ తేలిపోయారని. అయితే బైడెన్ తాను చెప్పాలనుకున్న ముఖ్య విషయాలను స్పష్టంగానే వివరించారు. ట్రంప్తో పోలిస్తే వాస్తవాలనే ఎక్కువగా చెప్పారు. వాదనలు వినిపించడం వరకు చూస్తే ట్రంప్ కన్నా బైడెన్దే పైచేయి అని చెప్పొచ్చు. కానీ చర్చ సాగినంతసేపు ట్రంప్ ఉత్సాహంగా కనిపించగా, బైడెన్ తొలి నుంచి కాస్త గందరగోళంగా, అసంబద్ధంగా కనిపించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండటానికి పూర్తిగా అనర్హుడు కాబట్టి అతడు పోటీలో ఉండకూడదు. బైడెన్ వయసురీత్యా పోటీ చేయకపోవడమే మంచిది. అమెరికా లాంటి శక్తిమంతమైన దేశానికి గెలుపోటములతో సంబంధం లేకుండా సమర్థులైన అభ్యర్థులు దొరక్కపోవడం బాధాకరం.
రుతుపవనాల సీజన్లో మార్పులపై చర్చ జరగాలి
- ఆనంద్ మహీంద్రా, పారిశ్రామికవేత్త
ఈ ఏడాది కూడా రుతుపవనాల ప్రవేశం అంచనాలకు అందలేదు. జూన్లో దేశవ్యాప్త వర్షపాతం లోటు 18 శాతంగా నమోదైంది. దశాబ్దకాలంగా రుతుపవనాల సీజన్ రాక, ముగింపునకు సంబంధించి గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవి శాశ్వత మార్పులుగా స్థిరపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాటికి అనుగుణంగా రైతులు పొలాల్లో విత్తనం వేసే కాలాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందా అన్న విషయంపై విస్తృత చర్చ జరగాలి. మారుతున్న రుతుపవనాల సీజన్ను తట్టుకొని మనుగడ సాగించే పంటల వైపు అన్వేషణ జరగాలి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు దీన్ని జాతీయ ప్రాధాన్య అంశంగా పరిగణించి పరిశోధనలు జరపాలి.
సమస్యలను నివారించలేం.. కానీ పరిష్కారం మన చేతుల్లోనే..
- బి.ఎస్.గుప్తా, రచయిత, యోగా శిక్షకులు
జీవితంలో సమస్యలు రాకుండా నివారించడం సాధ్యం కాదు కానీ, వాటి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. ప్రకృతి మిమ్మల్ని సమస్యల్లో పడేయడం వెనుక ఉద్దేశం మీరు బలహీనంగా ఉన్న అంశాలేంటో మీకు తెలియపర్చి, వాటిలో పట్టు సాధించేలా మిమ్మల్ని సిద్ధం చేయడమే. సమస్యలకన్నా మీరే శక్తిమంతులని గుర్తుంచుకోండి. అవి ఎదురైనప్పుడు కంగారుపడకుండా, పరిష్కార మార్గాల కోసం సావధానంగా ఆలోచించండి. ఆలోచనలతోనే ఆగిపోకుండా ప్రణాళికబద్ధమైన చర్యలకు ఉపక్రమించండి. సమస్య పెద్దది కాకమునుపే పరిష్కారానికి ప్రయత్నించండి. మొక్కను వేర్లతో సహా పెకిలించడం సులువు కానీ, చెట్టును పెకిలించడం కష్టం కదా.
వైవిధ్యమైన నెట్వర్క్ను నిర్మించుకోండి
- జెన్సెన్ హువాంగ్, ఎన్విడియా సీఈవో
మనం కలిసే ప్రతి వ్యక్తి నుంచి మనకు తెలియని విషయం నేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండాలి. అది చిన్నదా, పెద్దదా అని ఆలోచించొద్దు. కొన్నిసార్లు చిన్నపిల్లల నుంచి నేర్చుకొనే విషయాలు కూడా జీవితంలో గొప్ప ఫలితాలనిస్తాయి. నిరంతరం మన నెట్వర్క్ను విస్తృతం చేసుకోవడమే కాదు, విభిన్న వృత్తుల్లో ఉండేవారి కలయికతో వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. వివిధ రంగాల్లో అప్పుడే కెరీర్లో ప్రవేశించిన ట్రైనీల నుంచి ఉన్నత స్థానాల్లో ఉండేవారి వరకూ మన సన్నిహిత బృందంలో ఉంటే మన ఆలోచనా పరిధి విస్తృతం అవుతుంది.
రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 3కు వాయిదా
ఠాణె: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో నమోదైన పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది. మహాత్మా గాంధీజీ హత్యకు సంబంధించి ఆరెస్సెస్పై వ్యాఖ్యలకు గాను రాజేశ్ కుంతే అనే సంఘ్ పరివార్ కార్యకర్త ఈ కేసు పెట్టారు. శనివారం జరగాల్సిన విచారణ మేజిస్ట్రేట్ సెలవులో ఉండడం వల్ల వాయిదాపడిందని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది నారాయణ్ అయ్యర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పుర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. -
ఎంపీగా ఇంజినీర్ రషీద్ ప్రమాణానికి ఎన్ఐఏ అనుమతి
ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమతి ఇచ్చింది. -
స్వచ్ఛంద సంస్థల రెన్యువల్ చెల్లుబాటు గడువు పెంపు
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్యే) కింద నమోదైన అన్ని స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) చెల్లుబాటు గడువును మరోసారి పెంచుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
భారతీయులకు మాతృభూమిపై ప్రేమ, భక్తి ఎన్నటికీ తరగవు
బయటి ప్రపంచానికి భారత్పై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, దేశంలో ప్రతి ఒక్కరికీ మాతృభూమిపై తరగని ప్రేమ, భక్తి ఉంటాయని, ఎన్ని వైరుధ్యాలున్నా భారత్ ఒకే దేశంగా నిలిచిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. -
మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష
ఇరవై మూడేళ్ల క్రితంనాటి పరువు నష్టం దావాలో ఉద్యమకారిణి మేధా పాట్కర్కు దిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ సోమవారం అయిదు నెలల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు. -
పార్లమెంటులో జర్నలిస్టులపై ఆంక్షలను తొలగించండి: ఎడిటర్స్ గిల్డ్
పార్లమెంటు కార్యకలాపాలను కవర్ చేసే మీడియా ప్రతినిధులపై కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షలను తొలగించాలంటూ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్లకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. -
అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి, సత్వర న్యాయం అందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఎఫ్ఐఆర్ నమోదు దశ నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు మూడేళ్లలోగా కేసుల పరిష్కారం జరుగుతుందన్నారు. -
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ 2024 పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు మళ్లీ నిర్వహించిన పరీక్ష ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. -
సాధారణానికి మించి ఈ నెలలో వర్షాలు: ఐఎండీ
దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. -
నిర్దేశిత విధానంలోనే ప్రమాణం చేయండి
పార్లమెంటులో ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్లో నిర్దేశించిన విధానాన్నే అనుసరించాలని లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. -
సంక్షిప్త వార్తలు
ప్రస్తుత రైల్వే టైం టేబుల్ను డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రైల్వే జోన్లు సర్క్యులర్లు జారీ చేశాయి. సవరించిన రైళ్ల రాకపోకల సమయాలను సూచించే టైం టేబుల్ను ఏటా జూన్ 30కి ముందు రైల్వే సంస్థలు విడుదల చేస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘మై క్వీన్’ విష కౌగిలి.. 10 రోజుల్లోనే రూ.10 కోట్లు దోచేశారు!
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క