మీ భర్తలను ఇంట్లో కూర్చొని తాగమనండి.. మహిళలకు మధ్యప్రదేశ్‌ మంత్రి సలహా

పురుషులతో మద్యం మాన్పించేందుకు మధ్యప్రదేశ్‌ సామాజిక న్యాయశాఖ మంత్రి నారాయణసింగ్‌ కుశ్వాహా మహిళలకు ఇచ్చిన సూచన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 30 Jun 2024 05:06 IST

భోపాల్‌: పురుషులతో మద్యం మాన్పించేందుకు మధ్యప్రదేశ్‌ సామాజిక న్యాయశాఖ మంత్రి నారాయణసింగ్‌ కుశ్వాహా మహిళలకు ఇచ్చిన సూచన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మద్యపానం, మాదకద్రవ్యాల వాడకాన్ని అరికట్టే లక్ష్యంతో భోపాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ‘‘ఆడవారు తమ ఇళ్లలోని పురుషులు మద్యం మానేయాలని కోరుకుంటే.. ముందుగా వారికి బయట తాగొద్దని చెప్పండి. మద్యాన్ని ఇంటికి తెచ్చుకొని కుటుంబసభ్యుల ముందు కూర్చొని తాగమనండి. ఇలా చేయడం ద్వారా సిగ్గుపడి మందు తాగే అలవాటు క్రమంగా తగ్గి.. రాను రాను దానికి పూర్తిగా దూరమవుతారు’’ అని మహిళలకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని