- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు (5)
దేశానికి సంబంధించిన ఏ విషయంపైనా ప్రజాశ్రేయస్సు కోణంలో చర్చ జరగడం లేదు. హిందూ-ముస్లిం, రిజర్వేషన్లకు మద్దతు-వ్యతిరేకం, నాకు నచ్చిన పార్టీ-ప్రత్యర్థి పార్టీ.. ఇలా మన దృష్టికోణం విభజనవాదంతో నిండిపోయింది.
హేతుబద్ధత లేని చర్చలతో దేశానికి తీవ్ర నష్టం
- అక్షత్ శ్రీవాస్తవ, ఆర్థిక వ్యవహారాల నిపుణులు
దేశానికి సంబంధించిన ఏ విషయంపైనా ప్రజాశ్రేయస్సు కోణంలో చర్చ జరగడం లేదు. హిందూ-ముస్లిం, రిజర్వేషన్లకు మద్దతు-వ్యతిరేకం, నాకు నచ్చిన పార్టీ-ప్రత్యర్థి పార్టీ.. ఇలా మన దృష్టికోణం విభజనవాదంతో నిండిపోయింది. దీనివల్ల ఎవరూ ఏ రకమైన విమర్శలనూ సహించడం లేదు. కాబట్టే ఎవరికీ జవాబుదారీతనం లేక మనకు మెరుగైన ఫలాలు అందడం లేదు. ఫలితంగా నిజమైన ప్రతిభకు గుర్తింపు దక్కక నెమ్మదిగా కనుమరుగవుతోంది. హేతుబద్ధతతో ఆలోచించడం మొదలుపెట్టకపోతే దేశానికి తీవ్ర నష్టం కలుగుతుంది. దేశాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యమున్నవారు ఇతర దేశాలకు తరలిపోయి తమ మేధస్సును అక్కడ వినియోగిస్తున్నారు.
పార్లమెంటు ప్రజలది.. ప్రభుత్వానిది కాదు
- కపిల్ సిబల్, రాజ్యసభ ఎంపీ
ప్రతిపక్ష ఎంపీల గళాన్ని వినడానికి లోక్సభ స్పీకర్కు ఇష్టం ఉండకపోవచ్చు. ప్రభుత్వానికి వారి అభిప్రాయాలు అసలు నచ్చకపోవచ్చు. కానీ దేశ ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ తరఫున పార్లమెంటులో గళం వినిపించాలని కోరుకుంటారు. పార్లమెంటు ప్రజల కోసమే తప్ప ప్రభుత్వం కోసమో, స్పీకర్ ఇష్టాయిష్టాల కోసమో కాదు. కాబట్టి విపక్ష ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం ఎంత ముఖ్యమో, వారు చెప్పే అభిప్రాయాలు నచ్చినా, నచ్చకపోయినా మైక్ కట్ చేయకపోవడం అంతే ముఖ్యం.
21 శాతం క్రీడాకారిణులకు లైంగిక వేధింపులు
- యునెస్కో
ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగంలోకి ప్రవేశిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామం. క్రీడల్లో మహిళలకు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పిస్తేనే వారు తమ శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో ప్రదర్శించి రాణిస్తారు. 21 శాతం మంది క్రీడాకారిణులు చిన్నతనంలో శిక్షకులు, ఇతరుల నుంచి తమకు లైంగిక వేధింపులు ఎదురైనట్లు చెప్పారు. వీటి గురించి బయటకు చెప్పలేక ఆటలకు దూరమైన వారూ ఉన్నారు. వేధింపులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న వారివల్లే ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేధింపులను నివారించడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి.
మత స్వేచ్ఛపై అమెరికా నివేదిక వాస్తవ విరుద్ధం
- భారత విదేశీ వ్యవహారాల శాఖ ఖండన
దిల్లీ: అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంశంపై బుధవారం అమెరికా విడుదల చేసిన వార్షిక నివేదిక-2023పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటు బ్యాంకు కేంద్రంగా రూపొందించిన సదరు నివేదిక పూర్తి పక్షపాత ధోరణిలో ఉందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అంగీకరించబోమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన దిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ నివేదికలోని అంశాలను ఖండిస్తున్నామన్నారు.
చండీగఢ్లో 24 గంటలూ దుకాణాలు తెరవచ్చు!
చండీగఢ్: వ్యాపారాల్ని ప్రోత్సహించే దిశగా కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ పాలనా యంత్రాంగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పొడుగునా 24 గంటలూ దుకాణాల్ని, వ్యాపార సంస్థలను తెరుచుకునే వెసులుబాటును కల్పించింది. పంజాబ్ షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం, 1958(చండీగఢ్కూ వర్తిస్తుంది) ప్రకారం చండీగఢ్లో నమోదైన అన్ని దుకాణాలూ, వ్యాపార సంస్థలకు ఏడాదిలో 365 రోజులూ, రోజులో 24 గంటలూ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎక్సైజ్ చట్టాలు వర్తించే లిక్కర్ దుకాణాలూ, బార్లకు మాత్రం ఈ నియమం వర్తించదని అధికారులు తెలిపారు. మహిళా ఉద్యోగులు మాత్రం రాత్రి ఎనిమిది గంటల తర్వాత పనిచేయకూడదనే నిబంధన తెచ్చారు. ఒకవేళ ఎవరైనా పనిచేయాలనుకుంటే, వారి నుంచి రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాలని, వారి భద్రతకు యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
Social Media: ఏటా జూన్ 30న సామాజిక మాధ్యమాల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. సోషల్ మీడియా ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. -
న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. -
అమ్మ పేరిట మొక్క
‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి (ఏక్ పేడ్ మా కే నామ్)’ అని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా వన మహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఏసీ తరగతి గదులు
విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు ఏసీ తరగతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘వివాహేతర సంబంధం’పై ఆగ్రహం.. బెంగాల్లో ఓ జంటకు బహిరంగ శిక్ష
వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమబెంగాల్లో ఓ జంటను నడిరోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. -
పార్లమెంటులో దుమారం రేపనున్న నీట్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సోమవారం పార్లమెంటులో దుమారం రేకెత్తించే అవకాశాలున్నాయి. -
కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచుచరియ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల పైనున్న గాంధీ సరోవరం వద్ద ఆదివారం ఉదయం భారీ మంచుచరియ విరిగిపడింది. -
ఒవైసీకి వ్యతిరేకంగా వీహెచ్పీ ప్రదర్శన
లోక్సభ సభ్యుడిగా ప్రమాణస్వీకార సమయంలో ‘జై పాలస్తీన్’ అని నినదించిన ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. -
6,619 మందితో అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన మూడో బ్యాచ్
జమ్మూలోని భగవతీ నగర్లోని బేస్ క్యాంపు నుంచి 6,619 మందితో కూడిన మూడో బ్యాచ్ కశ్మీర్లోని బేస్ క్యాంపులకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరింది. -
సంక్షిప్త వార్తలు (6)
చిన్నప్పుడు అందరిలాగే నేనూ కథలు వినడానికి తెగ ఆసక్తి చూపేదాన్ని. కానీ పుస్తకాలు చదవడం అసలు ఇష్టముండేది కాదు. -
కుటుంబ పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం
కుటుంబ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సోమవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. -
జలపాతంలో మునిగి మహిళ, ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలోని భూసీ డ్యామ్ బ్యాక్వాటర్ సమీపంలోని జలపాతంలో మునిగి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. -
ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్నసిన్హా
బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం వెల్లడించారు. -
వాట్సప్లో ఏఐ స్నేహితుడు
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. -
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
‘కేదార్నాథ్ ధామ్’ సమీపంలో మంచు ఉప్పెన విరుచుకుపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. -
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్’ లేదంటూ డీఎంకే సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. -
గుజరాత్లో భారీ వర్షాలు.. రోడ్డుపై భారీ గుంత.. కాంగ్రెస్ చురకలు
అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM