- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
దిల్లీ మంత్రి ఆతిశీ నీటి దీక్షకు ముగింపు
దేశ రాజధాని నగరం నీటిసమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించటంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలింపు
ఆతిశీని ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది
దిల్లీ: దేశ రాజధాని నగరం నీటిసమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించటంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లోక్నాయక్ (ఎల్ఎన్జేపీ) హాస్పిటల్ ఐసీయూ వార్డులో మంత్రి చికిత్స పొందుతున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ‘‘ఆతిశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఎల్ఎన్జేపీ వైద్యులు వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. హరియాణా ప్రభుత్వం దిల్లీకి నీటిని విడుదల చేయాలన్న డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆమె గత అయిదు రోజులుగా ఏమీ తినలేదు. ఆతిశీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఆసుపత్రికి తరలింపుతో మంత్రి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష ముగిసినా, తమ మిత్రపక్షాలతో కలిసి ఈ విషయాన్ని పార్లమెంటులో లేవదీస్తామని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్సింగ్ మీడియాకు తెలిపారు. యమునానది నీటిలో హరియాణా నుంచి దిల్లీకి అందాల్సిన న్యాయమైన వాటాపై ఇప్పటికే తమ ఎంపీలంతా ప్రధానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలుకు గాయం.. బాలుడి మర్మావయవాలకు సర్జరీ!
ఠాణెలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాలుడి కాలుకు బదులు అతడి మర్మావయవాలకు శస్త్రచికిత్స నిర్వహించారు. -
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం
Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. పార్టీ సమావేశంలో దీనిపై కీలక తీర్మానం చేశారు. -
‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్ పవార్
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నాడు దేశంలో విధించిన ‘ఎమర్జెన్సీ’పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. -
మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్ వైరల్
తాగుడుకు బానిసైన (drinking habit) తమ భర్తలతో ఆ వ్యసనాన్ని మాన్పించేందుకు భార్యలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తాగుడును ఇలా మాన్పించాలంటూ ఓ మంత్రి చేసిన సూచన వైరల్గా మారింది. -
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్ల మృతి
Ladakh: లద్దాఖ్లో జరిగిన సైనిక విన్యాసాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. -
విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ నియామకం
ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు. -
నీట్పై చర్చకు విపక్షాల పట్టు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది. -
హేమంత్ సోరెన్ దోషి అని నమ్మడానికి ఆధారాల్లేవు
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు భారీ ఊరట లభించింది. -
నీట్-యూజీ పేపర్ లీకు కేసు.. ఝార్ఖండ్లో ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ అరెస్టు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకు కేసుకు సంబంధించి ఝార్ఖండ్లోని హజారీబాగ్లో ఓ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. -
పనితీరు బాగోకపోతే ముందస్తుగా పదవీ విరమణ
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలూ తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతి నెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) స్పష్టం చేసింది. -
పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ కొత్త తేదీల ప్రకటన
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది. -
కొత్త నేర న్యాయచట్టాలపై 1న పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు
కొత్త నేర న్యాయచట్టాలు అమల్లోకి వచ్చే జులై ఒకటిన దేశవ్యాప్తంగా ఉన్న 17,500 పోలీస్ స్టేషన్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాయి. -
మీడియాలో వాణిజ్య ప్రకటనలకు ‘స్వీయ ధ్రువీకరణ’ అప్పుడే వద్దు
ప్రజలను మోసం చేసే, తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలను నిరోధించే లక్ష్యంతో సుప్రీంకోర్టు సూచన మేరకు అమలులోకి తెచ్చిన ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ సమర్పించే నిబంధనను ప్రస్తుతానికి మెడికల్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ విజ్ఞప్తి చేశారు. -
విమానం మరుగుదొడ్డిలో పొగతాగిన వ్యక్తి అరెస్టు
దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబయికి వెళుతున్న ఇండిగో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. -
పరీక్షల విధానంలో సంస్కరణలు.. సలహాల కోసం వెబ్సైట్ ప్రారంభం
నీట్ యూజీ , యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ప్రాథమిక గణిత ప్రశ్నలపై 80% మంది ఉపాధ్యాయుల్లో తడబాటు
భారత్తోపాటు మధ్య ప్రాచ్య దేశాల్లోని గణిత ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది నిష్పత్తి, అనుపాత తార్కికం, బీజ గణితం, ఎస్టిమేషన్, లాజికల్ రీజనింగ్ వంటి ప్రాథమిక భావనల్లో తడబడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
దేశానికి సంబంధించిన ఏ విషయంపైనా ప్రజాశ్రేయస్సు కోణంలో చర్చ జరగడం లేదు. హిందూ-ముస్లిం, రిజర్వేషన్లకు మద్దతు-వ్యతిరేకం, నాకు నచ్చిన పార్టీ-ప్రత్యర్థి పార్టీ.. ఇలా మన దృష్టికోణం విభజనవాదంతో నిండిపోయింది. -
నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ‘నీట్’ నుంచి తమిళనాడును మినహాయించాలని, ఇందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని శుక్రవారం తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. -
దిల్లీ.. తల్లడిల్లి
భారీ వర్షాలతో దేశ రాజధాని దిల్లీ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి నగరంలో కుండపోత వర్షం మొదలై పలు ప్రాంతాల్లో వరదనీరు ఉప్పొంగింది. -
దిల్లీ విమానాశ్రయ ఘటన.. కేంద్రం కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల నిర్మాణాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలోని ‘భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ’ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ-జగదల్పూర్ హైవేలో మార్పులు కోరాం: మంత్రి తుమ్మల
-
కాలుకు గాయం.. బాలుడి మర్మావయవాలకు సర్జరీ!
-
క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు.. ఈ జాబితాలో మీ బ్యాంక్ ఉందా?
-
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం
-
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
-
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ