- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
జులైలో రష్యా పర్యటనకు మోదీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై నెల మొదట్లో రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు దౌత్య వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బహుశా జులై 8న ఇది ఉండవచ్చని, తేదీ ఖరారుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.
సన్నాహాలు ప్రారంభించామన్న క్రెమ్లిన్ వర్గాలు
దిల్లీ, మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై నెల మొదట్లో రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు దౌత్య వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బహుశా జులై 8న ఇది ఉండవచ్చని, తేదీ ఖరారుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పలు అంశాలపై ప్రధాని విస్తృతస్థాయి చర్చలు జరిపే అవకాశముంది. మాస్కో సందర్శన కార్యరూపం దాల్చితే గత అయిదేళ్లలో ఇది ప్రధాని మోదీకి తొలి రష్యా పర్యటన అవుతుంది. ఇంతకు మునుపు 2019లో రష్యాలోని వ్లాడవాస్టాక్ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ పర్యటనకు సంబంధించి భారత్ వైపు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇద్దరు అగ్రనేతల భేటీకి క్రియాశీలక సన్నాహాలను తాము అపుడే ప్రారంభించినట్లు మాస్కోలోని క్రెమ్లిన్ అధికార వర్గాలు తెలిపాయి. ‘‘భారత ప్రధాని రాకకు మేము సిద్ధమవుతున్నట్లు నేను నిర్ధరించగలను. అయితే, పర్యటన తేదీని అపుడే చెప్పలేము. ఈ విషయం ఉభయులూ తర్వాత ప్రకటిస్తారు’’ అని రష్యా అధ్యక్షుడి సహాయకుడైన యూరి ఉషకోఫ్ మీడియాకు వివరించారు. జులై 3, 4 తేదీల్లో కజఖ్స్థాన్లో జరగనున్న షాంఘై సదస్సు (ఎస్సీవో)కు గైర్హాజరు కావాలని మోదీ నిర్ణయించుకొన్న నేపథ్యంలో క్రెమ్లిన్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం. అలాగే అక్టోబరు నెలలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) వార్షిక సదస్సుకు రష్యా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు మోదీ హాజరవుతారని రష్యాకు పూర్తి విశ్వాసం ఉన్నట్లు క్రెమ్లిన్ అధికారులు తెలిపారు.
ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇప్పటిదాకా రష్యా, భారత్ల నడుమ 21 సార్లు వార్షిక భేటీలు జరిగాయి. చివరిసారిగా 2021 డిసెంబరు 6న దిల్లీ వేదికగా పుతిన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. మోదీ పర్యటన ఖరారైతే మూడేళ్ల విరామం అనంతరం ఇరు దేశాల మధ్య 22వ వార్షిక సమావేశం జరుగుతుంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించే విషయాన్ని కూడా పుతిన్తో మోదీ చర్చించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వెంటనే ముగిసిపోవాలని భారత్ ఆది నుంచీ కోరుకుంటున్నా, మాస్కోతో ద్వైపాక్షిక స్నేహబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోడానికి సిద్ధంగా లేనందునే ఉక్రెయిన్పై దాడిని ఇప్పటిదాకా ఖండించలేదు. దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెబుతూ వస్తోంది.
కజఖ్ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ
కజఖ్స్థాన్ అధ్యక్షుడు కాసం జోమార్ట్ తొకయేవ్తో భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఫోన్లో మాట్లాడారు. జులై 3-4 తేదీల్లో కజఖ్లో జరగబోయే ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్సీవో) వార్షిక శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని, దానికి భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో విజయంపై తనను అభినందించినందుకు ధన్యవాదాలు చెప్పారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మున్ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. సదస్సుకు మోదీ వెళ్లడం లేదని, ఆయన బదులు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ హాజరవుతారని దౌత్యవర్గాల సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ నియామకం
ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్ మిస్రీ (59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు. -
నీట్పై చర్చకు విపక్షాల పట్టు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అక్రమాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది. -
హేమంత్ సోరెన్ దోషి అని నమ్మడానికి ఆధారాల్లేవు
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు భారీ ఊరట లభించింది. -
నీట్-యూజీ పేపర్ లీకు కేసు.. ఝార్ఖండ్లో ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ అరెస్టు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకు కేసుకు సంబంధించి ఝార్ఖండ్లోని హజారీబాగ్లో ఓ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. -
పనితీరు బాగోకపోతే ముందస్తుగా పదవీ విరమణ
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలూ తమ సిబ్బంది పనితీరుకు సంబంధించిన నివేదికను ప్రతి నెలా 15వ తేదీలోగా అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) స్పష్టం చేసింది. -
పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ కొత్త తేదీల ప్రకటన
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది. -
కొత్త నేర న్యాయచట్టాలపై 1న పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు
కొత్త నేర న్యాయచట్టాలు అమల్లోకి వచ్చే జులై ఒకటిన దేశవ్యాప్తంగా ఉన్న 17,500 పోలీస్ స్టేషన్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాయి. -
మీడియాలో వాణిజ్య ప్రకటనలకు ‘స్వీయ ధ్రువీకరణ’ అప్పుడే వద్దు
ప్రజలను మోసం చేసే, తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలను నిరోధించే లక్ష్యంతో సుప్రీంకోర్టు సూచన మేరకు అమలులోకి తెచ్చిన ‘స్వీయ ధ్రువీకరణ పత్రం’ సమర్పించే నిబంధనను ప్రస్తుతానికి మెడికల్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ కార్తికేయ శర్మ విజ్ఞప్తి చేశారు. -
విమానం మరుగుదొడ్డిలో పొగతాగిన వ్యక్తి అరెస్టు
దేశ రాజధాని దిల్లీ నుంచి ముంబయికి వెళుతున్న ఇండిగో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు. -
పరీక్షల విధానంలో సంస్కరణలు.. సలహాల కోసం వెబ్సైట్ ప్రారంభం
నీట్ యూజీ , యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ప్రాథమిక గణిత ప్రశ్నలపై 80% మంది ఉపాధ్యాయుల్లో తడబాటు
భారత్తోపాటు మధ్య ప్రాచ్య దేశాల్లోని గణిత ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది నిష్పత్తి, అనుపాత తార్కికం, బీజ గణితం, ఎస్టిమేషన్, లాజికల్ రీజనింగ్ వంటి ప్రాథమిక భావనల్లో తడబడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
దేశానికి సంబంధించిన ఏ విషయంపైనా ప్రజాశ్రేయస్సు కోణంలో చర్చ జరగడం లేదు. హిందూ-ముస్లిం, రిజర్వేషన్లకు మద్దతు-వ్యతిరేకం, నాకు నచ్చిన పార్టీ-ప్రత్యర్థి పార్టీ.. ఇలా మన దృష్టికోణం విభజనవాదంతో నిండిపోయింది. -
నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ‘నీట్’ నుంచి తమిళనాడును మినహాయించాలని, ఇందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని శుక్రవారం తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. -
దిల్లీ.. తల్లడిల్లి
భారీ వర్షాలతో దేశ రాజధాని దిల్లీ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం తెల్లవారుజామున 3.00 గంటల నుంచి నగరంలో కుండపోత వర్షం మొదలై పలు ప్రాంతాల్లో వరదనీరు ఉప్పొంగింది. -
దిల్లీ విమానాశ్రయ ఘటన.. కేంద్రం కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల నిర్మాణాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలోని ‘భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ’ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన
-
‘మర్డర్ ఆఫ్ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!
-
ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు
-
సర్కారు జాగా దర్జాగా కబ్జా.. ఇంటి నంబర్లతో వెయ్యి గజాలకు దరఖాస్తు