- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఉగ్రవాదికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
దేశ రాజధానిలో కాల్పులకు పాల్పడిన ఓ ఉగ్రవాది.. తన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు.
24 ఏళ్ల క్రితం కేసులో తాజా పరిణామం
దిల్లీ: దేశ రాజధానిలో కాల్పులకు పాల్పడిన ఓ ఉగ్రవాది.. తన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. దేశ భద్రత, ప్రజల ఐకమత్యం, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే చర్య కావడంతో ఆమె క్షమాభిక్షకు అంగీకరించలేదని రాష్ట్రపతి భవన్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. డిసెంబరు 22, 2000లో దిల్లీలోని ఎర్రకోట వద్ద పహారా కాస్తున్న వారిపై.. పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఇందులో ముగ్గురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఘటన జరిగిన రెండ్రోజుల అనంతరం నిందితుల్లో ఒకరైన మహమ్మద్ ఆరిఫ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మిగతా ముగ్గురు వేర్వేరు ఎన్కౌంటర్లలో మృతిచెందారు. పలు విచారణల అనంతరం నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబాకు చెందిన ఆరిఫ్కు ఉరిశిక్ష విధిస్తూ 2005 అక్టోబరులో ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును 2007లో దిల్లీ హైకోర్టు, 2011లో సుప్రీం కోర్టులు సమర్థించాయి. అనంతరం నిందితుడు పలు అప్పీళ్లు, రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేకపోయింది. చివరి యత్నంగా క్షమాభిక్ష కోరుతూ మే 15న రాష్ట్రపతికి దరఖాస్తు చేయగా.. మే 27న ఆమె తిరస్కరించారు. రాష్ట్రపతిగా ముర్ము బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షమాభిక్ష తిరస్కరించడం ఇది రెండోసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారంట్, ప్లే గ్రౌండ్.. ఎక్కడో తెలుసా?
ఒడిశా అటవీ శాఖ ఏనుగుల కోసం వాటి శిక్షణా కేంద్రంలో సకల సౌకర్యాలు కల్పించింది. రెస్టారంట్, బాతింగ్ ఏరియాతో పాటు అనేక సదుపాయాలు సమకూర్చింది. -
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!
హాథ్రస్ దుర్ఘటన వెనక అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆరోపిస్తూ భోలే బాబా ఓ ప్రకటన విడుదల చేశాడు. -
దర్శన్ ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్.. పేరెంట్స్పై కేసు!
విచారణ ఖైదీగా ప్రస్తుతం జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కేటాయించిన ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్ చేసిన ఓ జంట చిక్కుల్లో పడింది. -
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
వర్షం కురవడంతో పైకప్పు నుంచి వందేభారత్లోకి నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వేశాఖ ఏమందంటే..?
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/07/24)
-
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
-
ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారంట్, ప్లే గ్రౌండ్.. ఎక్కడో తెలుసా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!
-
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్