ఖతార్ జైల్లో మగ్గుతున్న నౌకాదళ మాజీ అధికారుల విడుదల
దౌత్యపరంగా భారత్ పెద్ద విజయం సాధించింది. గూఢచర్య ఆరోపణలపై ఖతార్ జైలులో 2022 నుంచి మగ్గుతున్న ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది.
భారత్కు అతి పెద్ద దౌత్య విజయం
గూఢచర్యం ఆరోపణలతో వీరంతా అరెస్టు
దిల్లీ: దౌత్యపరంగా భారత్ పెద్ద విజయం సాధించింది. గూఢచర్య ఆరోపణలపై ఖతార్ జైలులో 2022 నుంచి మగ్గుతున్న ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఏడుగురు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. ఎనిమిదో వ్యక్తిని కూడా సాధ్యమైనంత త్వరగా భారత్ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు పేర్కొన్నారు. 18 నెలలుగా అక్కడి జైల్లో ఉన్న వీరికి స్థానిక న్యాయస్థానం మరణ దండన విధించింది. తర్వాత జైలు శిక్షగా మార్చింది. ఇప్పుడు అభియోగాల నుంచి విముక్తి కల్పించి భారత్కు అప్పగించింది. ఖతార్ నిర్ణయాన్ని కేంద్రం స్వాగతించింది. ‘‘ఖతార్లోని దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ అరెస్టయిన ఎనిమిది మంది భారతీయ పౌరుల విడుదలకు వీలుగా ‘ఎమిర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఖతార్’ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం’’ అని విదేశీవ్యవహారాల శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. విడుదలలో ప్రధాని మోదీతో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పలుమార్లు ఆయన రహస్యంగా దోహా పర్యటించారు. 2022లో గూఢచర్యం ఆరోపణలతో ఈ మాజీ నౌకాదళ సిబ్బందిని ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వీరిలో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. సుగుణాకర్ విశాఖ వాసి. ప్రధాని మోదీ చొరవ వల్లే తమ విడుదల సాధ్యమైందని దిల్లీకి చేరుకున్న నౌకాదళ మాజీ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున విమానాశ్రయానికి చేరుకున్న వీరు ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు.
ఖతార్కు ఈ నెల 14న మోదీ
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన నావికాదళ మాజీ అధికారులను ఖతార్ ప్రభుత్వం విడుదల చేసిన వేళ.. భారత విదేశీ వ్యవహారాల శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 14న ఖతార్కు ప్రధాని మోదీ వెళ్లనున్నారని పేర్కొంది. 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటించనున్న ప్రధాని.. అక్కడినుంచి దోహాకు వెళ్తారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా సోమవారం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
India-China: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. -
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. -
ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ చూపించారు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను ఆయన సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. -
ఆయనకు 84.. ఆమెకు 66
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే (84)కు ఆయన కుమారులు, కుమార్తెలు 66 ఏళ్ల వృద్ధురాలితో ఘనంగా రెండోపెళ్లి జరిపించారు. -
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. -
4 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుష్షు
నాలుగు నిమిషాల్లోనే ఒక మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు.. వారి సాధారణ ఆయుష్షు కన్నా ఐదేళ్లు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. -
వారణాసి గంగా హారతిలో అమిత్ షా, యోగి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. -
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. -
ఓ ఆదివాసీ ప్రశ్నకు వ్యంగ్యంగా బదులిచ్చానంతే
రత్లాం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. -
నింగిలో రంగురంగుల అరోరాలు
చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది.
తాజా వార్తలు (Latest News)
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ