- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
నవశకపు నిర్మాణ అద్భుతం!
అటు ఆధ్యాత్మికంగా.. ఇటు నిర్మాణకౌశలం పరంగా అది భారత్లో ఓ కొత్త గమ్యస్థానం. అయోధ్యలో రూపుదిద్దుకున్న శ్రీరాముడి భవ్య ఆలయం.. నవశకపు నిర్మాణ అద్భుతం.
రామ మందిరంలో అణువణువునా ఆధ్యాత్మికత, కళాత్మకత
వెయ్యేళ్లయినా చెక్కుచెదరని రీతిలో నిర్మాణం
అటు ఆధ్యాత్మికంగా.. ఇటు నిర్మాణకౌశలం పరంగా అది భారత్లో ఓ కొత్త గమ్యస్థానం. అయోధ్యలో రూపుదిద్దుకున్న శ్రీరాముడి భవ్య ఆలయం.. నవశకపు నిర్మాణ అద్భుతం. రామభక్తుల వందల ఏళ్ల కలల కోవెలను వెయ్యేళ్లయినా చెక్కుచెదరని రీతిలో ప్రకృతి విపత్తులను తట్టుకునేలా నిర్మించారు. నాగరశైలిలో శిల్పులు ఎంతో నైపుణ్యంతో నగిషీలద్దిన ఈ ఆలయం అజరామరంగా నిలిచిపోనుంది. ఈ సువిశాల ప్రాంగణాన్ని అనేక ఇంజినీరింగ్ సవాళ్లను అధిగమించి, ప్రకృతికి చేటు కలగనిరీతిలో నిర్మించారు. దేశంలోని అత్యుత్తమ నిపుణుల మేధోమథన ఫలితం ఈ ఆలయమని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
ఇదీ ఆలయ ప్రత్యేకత..
ఆలయ పునాదుల కోసం తవ్వకాలు చేపట్టినప్పుడు.. పునాది రాయి వేయడానికి ఇక్కడి నేల అనువుగా లేదని తేలింది. దీంతో కృత్రిమ పునాదిని సృష్టించాలని ఇంజినీర్లు నిర్ణయించారు. దీన్ని 14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీటు-ఆర్సీసీతో నిర్మించారు. ఇది కృత్రిమ శిలలా తయారైంది. దీనిపైన బాహ్యనిర్మాణాన్ని సిద్ధం చేశారు.
- ప్రధాన ద్వారం వద్ద ఏనుగులు, సింహాలు, హనుమంతుడు, గరుడ శిల్పాలు కనిపిస్తాయి. వీటిని ఇసుకరాయితో రూపొందించారు.
- ఆలయంలోని శిలలపై ఆంజనేయుడు, ఇతర దేవతలు, నెమళ్లు, పూల ఆకృతులను అందంగా చెక్కారు. ఇవన్నీ భక్తిభావాన్ని ఇనుమడింపచేస్తున్నాయి.
- ఆలయంలో నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం ఉన్నాయి. రామ మందిరానికి సమీపంలో పురాతనమైన సీతా కూప అనే బావి కూడా ఉంది.
- ఆలయ సముదాయ నైరుతి భాగంలోని కుబేర్ తిల వద్ద జటాయువు విగ్రహంతోపాటు పురాతన శివుడి ఆలయాన్ని పునరుద్ధరించారు.
- ఆలయ ప్రాంగణానికి నాలుగు మూలల్లో నాలుగు మందిరాలు ఉన్నాయి. వీటిని సూర్యదేవుడికి, దేవీ భగవతికి, గణపతికి, శివుడికి అంకితమిచ్చారు. ప్రాంగణ ఉత్తర భాగంలో మాతా అన్నపూర్ణ ఆలయం, దక్షిణం వైపున హనుమంతుడి మందిరం ఉన్నాయి.
- ఆలయ ప్రాంగణంలో నీటి శుద్ధి కర్మాగారం, అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కోసం నీటి సరఫరా, రెండు మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ప్రత్యేక విద్యుత్ లైన్ ఉన్నాయి. మంటలు ఆర్పడానికి నేలమాళిగలోని ఒక రిజర్వాయర్లో నీరు నిల్వ ఉంటుంది.
- ఆలయ ప్రాంగణంలోని సింహ భాగం పచ్చదనాన్ని సంతరించుకొని ఉంటుంది. 70 ఎకరాల ప్రాంగణంలోని 70 శాతం మేర చెట్లే ఉంటాయి.
- ప్రధాన ఆలయానికి చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో పెర్కోటా అనే నిర్మాణం ఉంటుంది. దీని పొడవు 732 మీటర్లు, వెడల్పు 14 అడుగులు. ఇది ఒకరకంగా ఆలయానికి ప్రహరీలాంటిది. ఇలాంటి ఆకృతులు దక్షిణ భారత దేశ ఆలయాల్లో కనిపిస్తుంటాయి.
ఏమిటీ నాగరశైలి?
సాధారణంగా శిల్ప శాస్త్రంలో ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు పద్ధతులు ఉంటాయి. అవి.. నాగర, ద్రవిడ, విసార. ఇందులో నాగరశైలి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. ద్రవిడ శైలిలో దక్షిణాది ఆలయాలను నిర్మిస్తుంటారు. నాగరశైలిలో భారతీయ సంస్కృతి ఉట్టిపడటమే కాకుండా హిందూ ధర్మానికి దర్పణం పడుతుంది. అందులో అటు కళాత్మకత, ఇటు ఆధ్యాత్మికత ప్రతిబింబిస్తుంది. 5వ శతాబ్దం నుంచి ఈ శైలిలో ఆలయ నిర్మాణాలు జరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉత్తర భారతదేశంతోపాటు కర్ణాటకలోనూ ఈ తరహా కట్టడాలు కనిపిస్తాయి. ఏళ్లు గడిచేకొద్దీ నాగర శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. గుప్తుల హయాంలో దీనికి మంచి ఆదరణ లభించింది.
- నాగరశైలి ఆలయాల్లో గర్భగుడి, మండపం, ప్రదక్షిణ పాద, శిఖర, అమలక, కలశ, అంతరాల, జగతి అనే భాగాలు ఉంటాయి.
- గర్భగుడిని జన్మస్థానంగా పరిగణిస్తారు. అందుకే అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. నాగరశైలిలో ‘జగతి’పైన ఆలయ నిర్మాణాన్ని చేపడతారు. గర్భగుడికి ఎదురుగా మండపాన్ని నిర్మిస్తారు. గర్భగుడికిపైన ఉండే గోపురాన్ని శిఖరంగా వ్యవహరిస్తారు. మేరు పర్వత ఆకృతిలో దీన్ని నిర్మిస్తారు. నాగరశైలి ఆలయాలకు భారీ ప్రహరీ గోడలు, పుష్కరణి ఉండదు. దానికి బదులుగా ప్రదక్షిణ పథం ఉంటుంది. శిఖరానికి పైన ఉండే నిర్మాణాన్ని అమలక అంటారు. ఆ శిఖరంపైన కలశాన్ని ఏర్పాటు చేస్తారు.
- నాగరశైలిలో నిర్మించే ఆలయాల్లో ఇనుము వాడరు. ఇనుముతో కడితే తుప్పుపట్టి, ఆకృతి త్వరగా దెబ్బతింటుంది. దీర్ఘకాలం మన్నేలా పూర్తిగా శిలలతో నిర్మిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
Hathras Stampede: భోలే బాబా నిర్వహించిన సత్సంగ్కు హాజరై అనంతరం తొక్కిసలాటలో మరణించిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. -
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
Hathras Stampede: యూపీలో హాథ్రస్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన బాధితులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. -
రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. -
బ్రహ్మపుత్రి
వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్ జిల్లాలోని పులియామారి చార్! -
కుటుంబాన్ని కలవవచ్చు.. దిల్లీ వదిలి వెళ్లకూడదు
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. -
రోజువారీ మరణాల్లో 7శాతం వాయు కాలుష్యం వల్లే
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. -
మా అబ్బాయి పెళ్లికి రండి.. సోనియా కుటుంబాన్ని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దిల్లీలోని ఆమె 10 జన్పథ్ నివాసంలో గురువారం కలిశారు. -
నీట్-యూజీని రద్దు చేయొద్దు
పరీక్ష పత్రాల లీకేజీ, ఇతరత్రా అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పదమైన నీట్-యూజీ (2024)ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ అభ్యర్థనలను వ్యతిరేకిస్తూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆసుపత్రి నుంచి ఆడ్వాణీ డిశ్చార్జ్
భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
అడ్డా కూలీలకు గౌరవమివ్వాలి
కాయ కష్టం చేసే అడ్డా కూలీలకు పూర్తి హక్కులను కల్పించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని, అది తన జీవిత లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
సుప్రీంకు క్షమాపణ చెప్పిన ఐఎంయే అధ్యక్షుడు
పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంపై చేసిన వ్యాఖ్యలకు ‘భారత వైద్య సంఘం’ (ఐఎంయే) అధ్యక్షుడు డాక్టర్ ఆర్.వి.అశోకన్ గురువారం బహిరంగ క్షమాపణ చెప్పారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
8 నుంచి మోదీ రష్యా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8-10 తేదీల్లో ఆయన రష్యాతోపాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది. -
బిహార్లో కూలిన మరో వంతెన
బిహార్లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. గురువారం సారణ్ జిల్లాలోని గండకీ నదిపై మరో వంతెన కూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. -
‘మెదడును తినే అమీబా’ వ్యాధితో కేరళలో బాలుడి మృతి
‘మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్)’ అనే అరుదైన వ్యాధి బారిన పడి కేరళలో 14 ఏళ్ల మృదుల్ అనే ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. -
లోక్సభ విజేతల సగటు ఓట్లు 50.58%
లోక్సభ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో విజేతలు సగటున 50.58 శాతం ఓట్లను సాధించారని, గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2 శాతం మేర తగ్గినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఉభయ సభలను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రొరొగ్ చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సమావేశమైన సభలు తొలి విడతను పూర్తి చేసుకున్నట్లయింది. -
మోదీ ‘పరీక్షా పే చర్చ’ వర్చువల్గా పునఃసృష్టి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక పోర్టల్ రూపంలో వర్చువల్గా పునఃసృష్టించడానికి ఎన్సీఈఆర్టీ కసరత్తు ప్రారంభించింది. -
యుద్ధ స్వరూపం మారుతోంది
సాంకేతికంగా వస్తున్న మార్పులతో యుద్ధ రూపం వేగంగా మారుతోందని, దాన్ని అందుకోవడానికి సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలని భారత నూతన త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. -
మోదీ తండ్రిపై వ్యాఖ్యలు.. ఖేడా సమీక్ష పిటిషన్ కొట్టివేత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. -
అస్సాంలో వరద బీభత్సం
అస్సాంలో వరదల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తుతోంది. దీంతో గురువారం ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
-
24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!
-
కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో సీఎం చంద్రబాబు భేటీ
-
నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత రాలేను: బైడెన్
-
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత