పురాతన భవంతి కూలుస్తుండగా బయటపడ్డ బంగారు నాణేలు
ఓ పురాతన భవంతిని కూలుస్తుండగా బ్రిటిష్ కాలం(1922) నాటి బంగారు నాణేలు బయటపడ్డాయి.
చోరీ చేసిన కాంట్రాక్టరు, కూలీల అరెస్టు
నవసారీ: ఓ పురాతన భవంతిని కూలుస్తుండగా బ్రిటిష్ కాలం(1922) నాటి బంగారు నాణేలు బయటపడ్డాయి. కింగ్ జార్జ్-5 బొమ్మ ముద్రించి ఉన్న ఆ విలువైన నాణేలను కూల్చివేత పనులు చేపట్టిన కాంట్రాక్టరు, నలుగురు కూలీలు ఇంటి యజమానికి తెలియకుండా చోరీ చేశారు. దీనిపై యజమాని గతేడాది అక్టోబరులోనే ఫిర్యాదు చేయగా పోలీసులు తాజాగా నిందితులను అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు. గుజరాత్లోని నవసారీ జిల్లా బిలిమోరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్లో నివసిస్తున్న హవబెన్ బలియా అనే ప్రవాస భారతీయుడు.. సర్ఫరాజ్ కరదియా అనే కాంట్రాక్టరుకు ఇల్లు కూల్చే పని అప్పగించారు. ఆయన మధ్యప్రదేశ్కు చెందిన నలుగురు కూలీలను తీసుకొచ్చి దానిని కూల్చివేస్తుండగా.. బంగారు నాణేలు బయటపడటంతో వాటిని తీసుకెళ్లిపోయారు. వారి నుంచి పోలీసులు రూ.92 లక్షల విలువైన 199 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అయితే దర్యాప్తు సమయంలో తమ నుంచి కొన్ని నాణేలను మధ్యప్రదేశ్కు చెందిన నలుగురు పోలీసులు తీసుకున్నారని ఓ కూలీ ఫిర్యాదు చేయడంతో వారిని కూడా అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెలసరి సెలవులు మంచిదే కానీ..: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court: కొన్నిసార్లు మహిళల ప్రయోజనాల కోసం మనం చేసే ప్రయత్నాలు వారికి ప్రతికూలంగా మారొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నెలసరి సెలవుల అంశంపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్
ఇటీవల మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్ (Hemant Soren).. ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. -
కజిరంగ పార్క్ను ముంచెత్తిన వరదలు.. వన్యప్రాణులు మృత్యువాత
వరదలు అస్సాంను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు దీనివల్ల 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. -
భారీ వర్షాల ఎఫెక్ట్.. 27 విమానాల దారి మళ్లింపు..!
ముంబయిలో వర్షాలు ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దాదాపు 27 విమానాలను దారి మళ్లించారు. -
మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్ఔట్ నోటీసు
Mumbai Hit and Run case: ఓ మహిళ మృతికి కారణమైన ముంబయి హిట్ రన్ కేసులో ప్రధాన నిందితుడు శివసేన యువనేతపై పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. అతడి కోసం 6 బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. -
ఆ స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: రష్యా పర్యటనకు బయల్దేరిన మోదీ
ప్రధాని నరేంద్రమోదీ (Modi) నేడు రష్యా పర్యటనకు బయల్దేరారు. -
అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన
అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సందర్శించారు. -
బయట నుంచి చూస్తే కప్బోర్డ్.. లోపల మాత్రం ఉగ్ర స్థావరం
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు జనావాసాల మధ్య నక్కేందుకు బంకర్లను నిర్మించుకొంటున్నారు. తాజాగా ఓ ఎన్కౌంటర్లో సైన్యం ఈ విషయాన్ని గమనించింది. -
6 గంటల్లో 300 మి.మి.ల వాన.. ముంబయిని వణికించిన వరుణుడు
Mumbai Rains: ముంబయిలో ఆరు గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నగరం అస్తవ్యస్తమైంది. లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
స్నాక్స్ అంటే లొట్టలేస్తాం.. లేబుల్ చదివాకే పొట్టలోకేస్తాం
భారతీయుల్లో ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై శ్రద్ధ పెరుగుతోంది. 73 శాతం మంది తాము చిరుతిళ్లు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్పై ముద్రించిన ముడి పదార్థాల (ఇంగ్రిడియంట్స్) జాబితా, పోషక విలువల వివరాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నట్లు ‘ది హెల్దీ స్నాకింగ్ రిపోర్ట్-2024’ నివేదిక తేల్చింది. -
నేత్రపర్వంగా జగన్నాథుడి రథయాత్ర
జై జగన్నాథ్ నామస్మరణ, జయజయద్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవోపేతంగా సాగింది. -
ఉరిమిన వరుణుడు.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య ప్రాంతాల్లో కుంభవృష్టి వానలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. -
ఉత్తర భారతంలో తరుగుతున్న పాతాళగంగ
ఉత్తర భారత దేశం.. 2002 నుంచి 2021 మధ్య దాదాపు 450 క్యూబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోయిందని తాజా అధ్యయనం పేర్కొంది. -
బిహార్లో మరో వంతెన కూలింది: తేజస్వీ
బిహార్లో మరో వంతెన కూలిపోయినట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. తూర్పు చంపారన్ జిల్లాలో కూలిన ఓ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
రూ.10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా
ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని రూ.10లక్షలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
లోకోపైలట్ల పరిస్థితిని పార్లమెంటులో లేవనెత్తుతాం
రైల్వే లోకోపైలట్ల సమస్యల్ని విపక్ష ఇండియా కూటమి పార్లమెంటులో లేవనెత్తుతుందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చెప్పారు. -
310 పందులను చంపిన కేరళ
ఆఫ్రికన్ స్వైన్ జ్వరం (ఏఎస్ఎఫ్) వ్యాప్తిని కట్టడిచేసేందుకు కేరళ ప్రభుత్వం దాదాపు 310 పందులను చంపింది. ఏఎస్ఎఫ్ను తొలుత త్రిశూర్ జిల్లాలోని మతకథరన్ గ్రామంలో గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. -
నీట్-యూజీపై నేటి నుంచి సుప్రీంలో విచారణ
వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్-యూజీ 2024పై సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. -
ఖల్సా రాజ్ కలలు కనడం నేరం కాదు
‘ఖల్సా రాజ్’ కలలను నిజం చేసుకునేందుకు లక్షలాది సిక్కులు తమ జీవితాలను త్యాగం చేశారని, ఆ విధమైన కలలు కనడం నేరం కాదని సిక్కు అతివాద బోధకుడు, ఖడూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు అమృత్పాల్ సింగ్ అన్నారు. -
మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్లలో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకి పెరిగింది. -
సంక్షిప్త వార్తలు
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకర పోస్టు చేశారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్కు ప్రజలు ఓటు వేశారు: పురందేశ్వరి
-
737 మ్యాక్స్ విమాన ప్రమాదాలు.. బోయింగ్ నేరాంగీకారం
-
నెలసరి సెలవులు మంచిదే కానీ..: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ‘కల్కి 2898 ఏడీ’
-
డీఎస్సీని వాయిదా వేయాలని ఆందోళన.. విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
కాలుష్యం పెరిగితే.. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు: మంత్రి పొన్నం ప్రభాకర్